అమలాపురం,: విశాఖ సందేసం:...అమలాపురం పట్టణ మున్సిపల్ కమిషనర్ వి. నిర్మల్ కుమార్ కు పట్టణ మున్సిపాలిటీ పరిధిలో గల19,20 వార్డులలో మంచినీటి కుళాయి సమస్యపై వినతి పత్రాన్ని బుధవారం అందజేశారు ప్రస్తుతం పట్టణంలో మంచినీటి సమస్య కోరతగా ఉన్నదని, ట్యాంకుల ద్వారా అన్ని వార్డులకు తాగునీరు సప్లై చేయాలని, వేసవికాలం సందర్భంగా వార్డులు పరిధిలో మంచినీటి సమస్య లేకుండా చర్యలు చేపట్టాలని, వార్డులకు నాలుగు రోజులకు ఒకసారి ట్యాంకర్ సప్లై చేసే విధంగా సమకూర్చాలని కోరారు. ఈ కార్యక్రమంలో పట్టణ మున్సిపాలిటీ వార్డుల సభ్యులు చిక్కాల రవిశంకర్, గున్నేపల్లి భీమశంకరం, పిచ్చేటి వర ప్రసాద్, కుసుమే దుర్గేష్, గిడగు మూర్తి తదితరులు పాల్గొన్నారు

Comments
Post a Comment