Skip to main content

Posts

Featured Post

ప్రజా దర్బార్ కి విశేష స్పందన * అర్జీదారుల వద్దకు వచ్చి వినతులు స్వీకరించిన చైర్మన్ ఎం వి ప్రణవ్ గోపాల్.

.                K.V.SHARMA EDITOR   విజయనగరం వి ఎం ఆర్ డి ఎ జోనల్ కార్యాలయంలో మంగళవారం వి ఎం ఆర్ డి ఎ చైర్మన్ శ్రీ ఎం వి ప్రణవ్ గోపాల్ గారి నేతృత్వంలో నిర్వహించిన ప్రజా దర్బార్ కి విశేష స్పందన లభించింది.  పెద్ద ఎత్తున అర్జేదారులు రావటంతో  వి ఎం ఆర్ డి ఎ చైర్మన్ శ్రీ ఎం వి ప్రణవ్ గోపాల్ గారు వారందరి  వద్దకు వచ్చి వినతులు తీసుకున్నారు. ఆయన స్వయంగా అర్జీదారులతో మాట్లాడి వారి సమస్యలు తెలుసుకున్నారు. అర్జీదారుల నుంచి వినతులు స్వీకరించారు.   ఆయా వినతులను పరిశీలించి తర్వాత సంబంధిత అధికారులతో మాట్లాడి అవసరమైన చర్యలు తీసుకోవాలని, అవసరాన్ని బట్టి క్షేత్ర స్థాయిలో పరిశీలన చేయాలని ఆదేశించారు. అర్జీలను సత్వరమే పరిష్కరించాలని ఆదేశించారు. వి ఎం ఆర్ డి ఎ పరిధిలోని ప్రజలు తమ సమస్యలను విన్నవించటానికి విశాఖ వరకు రానవసరం లేదని, విజయనగరంలో జోనల్ కార్యాలయం ఏర్పాటు చేయటం జరిగిందని, ఇక్కడ ప్రతీ మంగళవారం ప్రజా దర్బార్ జరుగుతుందని, విజయనగరం జిల్లా ప్రజలు  ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. మంగళవారం నిర్వహించిన ప్రజా దర్బార్ కి ...
Recent posts

జిల్లా వైద్య మరియు ఆరోగ్య శాఖాధికారి కార్యాలయం, విశాఖపట్నం ໖: 20-07-2026 సింహాచలం గిరిప్రదక్షిణ (జూలై 28, 29) నేపథ్యంలో ప్రైవేట్, కార్పొరేట్ ఆసుపత్రులు మరియు మెడికల్ కాలేజీలకు అత్యవసర వైద్య సేవల సన్నద్దత ఉత్తర్వులు.

.              K.V.SHARMA EDITOR  .ఈ నెల జూలై 28 మరియు 29 తేదీలలో అత్యంత వైభవంగా జరగనున్న శ్రీ వరాహ లక్ష్మీనరసింహ స్వామి వారి 32 కిలోమీటర్ల "సింహాచలం గిరిప్రదక్షిణ" మహోత్సవానికి లక్షలాది మంది భక్తులు తరలిరానున్నారు. భక్తుల రద్దీ, ఎండల తీవ్రత మరియు సంభవించబోయే ఎలాంటి అత్యవసర వైద్య పరిస్థితులనైనా తట్టుకునేందుకు, సింహాచలం గిరిప్రదక్షిణ మార్గానికి 32 కిలోమీటర్ల పరిధిలో ఉన్న అన్ని ప్రైవేట్ ఆసుపత్రులు, కార్పొరేట్ ఆసుపత్రులు మరియు ప్రైవేట్ వైద్య కళాశాలలు కింది ఆదేశాలను తూచా తప్పకుండా పాటించాలని జిల్లా వైద్య ఆరోగ్య శాఖాధికారి (DM&HO) ఆదేశించారు. ముఖ్యమైన ఆదేశాలు: అత్యవసర మందులు & రక్తం నిల్వ ఉంచుకోవడం: అన్ని ఆసుపత్రులు ప్రాణ రక్షణ మందులు, అత్యవసర ఐవి (IV) ద్రవాలు, ఓఆర్ఎస్ (ORS) ప్యాకెట్లు మరియు తగినంత రక్తాన్ని (Blood Reserves) ముందస్తుగా సిద్ధం చేసుకోవాలి, ఐసియు (ICU) మరియు ఎమర్జెన్సీ వార్డులలోని వెంటిలేటర్లు, ఆక్సిజన్ సిలిండర్లు వంటి పరికరాలు 100% పనితీరుతో సిద్ధంగా ఉండాలి. ముందస్తు (Elective) శస్త్రచికిత్సలు మరియు ఓపిడి (OPD) నిలిపివేత: అత్యవసర...

జివో 396ను ఉపసంహరించుకోవాలంటూదస్తావేజు లేఖర్లు నిరసన....

.              SRINIVAS SPL Correspondant  అమలాపురం, :విశాఖ సందేసం....స్థిరాస్తులు మరియు ఆస్తి దస్తావేజుల రిజిస్ట్రేషన్ల సేవలు ప్రయివేటీకరణను రద్దు చేయాలని దస్తావేజు లేఖర్లు, సహయకులు, టైపిస్ట్ లు  ముమ్మిడివరం లేఖర్లు అన్నారు.  ముమ్మిడివరం సబ్ రిజిస్ట్రార్ కార్యాలయం వద్ద  జి.ఓ. నెం.396 ను నిరసిస్తూ సమ్మెను ప్రారంభించారు. సోమవారం నుండి ఈ నెల 31వరకూ సమ్మెను కొనసాగిస్తామని అన్నారు. రిజిస్ట్రేషన్ సేవలు ప్రయివేటి కరణ నిలుపుదల చేయాలని, దస్తావేజు లేఖర్లుకి లైసెన్సులు పునరుద్దీంచాలని లేఖర్లు కోరారు.అలాగే  ఎలాంటి వివాదాలు లేకుండా ప్రజలకు రిజిస్ట్రేషన్ తాలుకు సేవలను దస్తావేజు లేఖర్లు తమ తమ తరతరాల అనుభవంతో క్రయ విక్రయ దారులకు  తమ సేవలను అందిస్తున్నామన్నారు.  బ్రిటిష్ కాలం నాటి నుండి కొనసాగుతున్న దస్తావేజు లేఖర్ల వ్యవస్థను నిర్మూలించాలనే ఉద్దేశాన్ని తాము వ్యతిరేకిస్తున్నామని తెలిపారు.  ప్రయివేటు కరణ చేయుటకు ఇటివల ఇచ్చిన జి.ఓ. నెం396ని ఉపసంహరించుకోవాలని కోరారు. ఈ జివో కారణంగా ప్రజలుకి రిజిస్ట్రేషన్ జాప్యం, సమయం వృథా, మరియు అదన...

ఆక్వా రైతులకు అండగా కూటమి ప్రభుత్వం : ఎంపీ హరీష్ బాలయోగి ఆక్వా మేతల ధరలపై కేంద్ర మత్యశాఖ మంత్రి రంజన్ సింగ్ తో మంత్రులతో కలసి ఎంపీ హరీష్ చర్చలు

.          SRININIVAS SPL Correspondant  అమలాపురం, విశాఖ సందేసం....రాష్ట్రంలోని  ఆక్వా రైతులకు అండగా కూటమి ప్రభుత్వం నిలుస్తుందని  అమలాపురం ఎంపీ గంటి హరీష్ బాలయోగి అన్నారు. ఆక్వా మేతల ధరలు తగ్గించే చర్యలపై ఢిల్లీలోని మంత్రి కార్యాలయంలో ఆంధ్రప్రదేశ్ ఆక్వాకల్చర్ రంగం అభివృద్ధికి అత్యంత కీలకమైన ఆక్వా మేత ధరలను తగ్గించే చర్యలపై చర్చించడానికి,   కేంద్ర మత్స్య, పశుసంవర్ధక మరియు పాడిపరిశ్రమల శాఖ మంత్రి శ్రీ రాజీవ్ రంజన్ సింగ్ (లల్లన్ సింగ్) తో కేంద్ర మంత్రులు రామ్మోహన్ నాయుడు, శ్రీనివాసవర్మ , డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణంరాజు, రాష్ట్ర మంత్రులు అచ్చెన్నాయుడు, గొట్టిపాటి రవికుమార్,  సహచర ఎంపీలు, తదితరులతో కలసి చర్చించినట్లు ఎంపీ హరీష్ బాలయోగి చెప్పారు. ప్రధానంగా ఆక్వా మేతలకు ముడి పదార్థాల పెరుగుతున్న ధరలు మన రాష్ట్రవ్యాప్తంగా ఉన్న ఆక్వా రైతులపై గణనీయమైన భారాన్ని మోపాయని రాష్ట్ర ప్రభుత్వం పెట్టుబడి వ్యయాలను స్థిరీకరించడానికి మరియు ఈ రంగానికి మరింత స్థిరమైన ధరల విధానాన్ని నిర్ధారించడానికి గల  చర్యలపై ఈ సమావేశంలో చర్చించామన్నారు. ఆక్వా రైత...

విద్యార్థి సంఘ ప్ర‌తినిధుల వాఖ్యలను ఖండించిన ఆర్.ఎస్.యూ రాష్ట్ర సహాయ కార్యదర్శి నరేంద్ర..

.           SRINIVAS SPL Correspondant  అమలాపురం, విశాఖ సందేసం.....విద్యార్థి సంఘ ప్ర‌తినిధులు చేసిన  వాఖ్యలను   ఆర్.ఎస్.యూ రాష్ట్ర సహాయ కార్యదర్శి కాంటేపల్లి నరేంద్ర తీవ్రంగా ఖండించారు. విద్యార్థుల కోసం విద్యార్థుల ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకుని రెవల్యూషనరీ స్టూడెంట్ ఆర్గనైజేషన్ ఎల్లప్పుడూ  పోరాడుతుందని  నరేద్ర  అన్నారు. కొంతమంది వ్యక్తులు శనివారం వాగ్దేవి పాఠశాలలో  ప్రెస్ మీట్ లో మరొక విద్యార్థి సంఘంపై తప్పుడు వాక్యలు చేసారని వాటిని తీవ్రంగా ఖండిస్తున్నట్లు తెలిపారు. పాఠశాల  భవనాలు అన్నీ కూడా పెంకులతో ఉన్నాయని వర్షాలు వస్తే అవి కూలిపోయే ప్రమాదం ఉందని విద్యార్థుల భవిష్యత్తును దృష్టిలో పెట్టుకొని  ఆర్.ఎస్.యూ గళం ఎత్తిందని  నరేంద్ర   పేర్కొన్నారు.విద్యార్థుల భవిష్యత్తు పై నిరంతరం పోరాడుతుందని...శనివారం ప్రెస్ మీట్  పెట్టిన వ్యక్తులు  ఆర్.ఎస్.యూ రిజిస్ట్రేషన్ ను ప్రశ్నించడం హాస్యాస్పదమని పేర్కొన్నారు. విద్యార్థుల సమస్యలను ఎవరు తెలియజేసిన విద్యార్థులు తరఫున పోరాటం చేసేందుకు ఆర్.ఎస్.యూ ...

మహిళల భద్రతపై కూటమి ప్రభుత్వాన్ని నిలదీసిన మాజీ ఎంపీ చింతా అనురాధకూటమి పాలనలో మహిళలకు భద్రత లేదు....

                SRINIVAS SPL Correspondant  అమలాపురం, విశాఖ సందేసం....రాష్ట్రంలో మహిళలపై పెరుగుతున్న దాడులను ఖండిస్తూ అంబేద్కర్ కోనసీమ జిల్లా అమలాపురం రూరల్ మండలం ఈదరపల్లిలో వైఎస్సార్‌సీపీ మహిళా నేతలు  రాజ్యాంగ నిర్మాత డా. బిఆర్ అంబేద్కర్ విగ్రహం వద్ద  ఆందోళన చేపట్టారు. మాజీ ఎంపీ చింతా అనురాధ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ నిరసనలో గుంటూరులో మహిళపై జరిగిన దాడి ఘటనను తీవ్రంగా ఖండిస్తూ, బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. రాష్ట్ర హోంమంత్రి అనిత నైతిక బాధ్యత వహిస్తూ రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత రాష్ట్రంలో మహిళలపై దాడులు పెరిగిపోయాయని ఆరోపించిన నాయకులు, ఇలాంటి ఘటనలకు పాల్పడిన వారిని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. రాష్ట్రంలో మహిళల భద్రత ప్రశ్నార్థకంగా మారిందని, ఇలాంటి పరిస్థితుల్లో హోంమంత్రి అనిత నైతిక బాధ్యత వహించి వెంటనే రాజీనామా చేయాలని ఎమ్మెల్సీ బొమ్మి ఇజ్రాయిల్  డిమాండ్ చేశారు. మహిళల జోలికి వస్తే అదే వారి ఆఖరి రోజు అని గతంలో హెచ్చరించిన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, తాట...

మృతుడు నాగబాబు కుటుంబానికి దాతల ఔదర్యం... జి.ఎమ్.కె ట్రస్ట్, ఎస్.ఏ. ఎఫ్ ఆర్థిక సహాయం.

.           SRINIVAS SPL Correspondant  అమలాపురం, విశాఖ సందేసం...అమలాపురం రూరల్ మండలం పేరూరు గ్రామ పరిధిలోని తోట్ల పాలెంకు చెందిన దూనబోయిన వెంకట కృష్ణ (నాగబాబు) అతి చిన్న వయస్సులో మృతి చెందిన సంఘటన ఈ ఏడాది జూన్ 25న చోటుచేసు కుంది.ఇతనికి భార్య ఏడాది వయసుగల ఆడబిడ్డ ఉందన్న  విషయం తెలుసుకున్న శెట్టిబలిజ చారిటబుల్ ట్రస్ట్ వ్యవస్థాపక అధ్యక్షులు గుత్తుల మీరా కుమార్ సోమవారం మృతుని నివాసానికి స్వయంగా హాజరై పరామర్శించి సంతాపం తెలియజేశారు.ఆ కుటుంబానికి ఆయన తన వంతు సాయంగా 50వేల నగదును అందజేశారు.  అలాగే త్వరలో చిన్నారికి లక్ష రూపాయలు పోస్ట్ ఆఫీస్ లో డిపాజిట్ చేస్తున్నట్లు తెలిపారు. రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి వాసం శెట్టి సుభాష్ లక్ష రూపాయలు అందజేస్తున్నట్లు ఎస్.ఎ.ఎఫ్ నాయకులు చొల్లంగి వెంకట రమణ తెలిపారు.మృతుని స్నేహితులు గ్రామస్తులు సేకరించిన నాలుగు లక్షల పైబడి నగదు ను త్వరలో అందజేస్తున్నట్లు వెంకటరమణ తెలిపారు.వీటితో పాటు కౌరు ఫౌండేషన్ వ్యవస్థా పకులు కౌరు నరసింహస్వామి 10 వేల నగదు అందజేశారు. ఈ కార్యక్రమంలో రాయుడు శత్రుష్, దొంగ ఆంజనేయులు, గుత్తుల రాజు,బొంతు స...