Skip to main content

Posts

Featured Post

ప్రపంచ పర్యావరణ దినోత్సవం.

 పర్యావరణ  పరిరక్షణ  ప్రతీ పౌరుని  బాధ్యత. విశ్వ మానవాళి  భవిష్యత్తు, అభివృద్ధి  పర్యావరణం తో  ముడిపడి ఉంది. అను నిత్యం  ప్రతీ పౌరుని  ఇంటి ముంగిట/ ఆవరణ నుంచి  మొదలయ్యేది  పర్యావరణo, పరిశుభ్రత. ప్రపంచం లోని  ప్రతీ పౌరుని  విధి పర్యావరణ  పరి రక్షణ. ప్రకృతిని  ప్రేమించాలి, ఆరాధించాలి, అనుసరించాలి, ఆచరణ యోగ్యం  గా మరల్చాలి. ప్రకృతి సహజ  సిద్ధంగా మానవాళి  కి లభించిన వరం. ప్రకృతిని  పరిరక్షించు  కోక పోవడం  మూలాన  మానవాళి  అనర్ధాలకు, ప్రకృతి ప్రకో  పాలకు గురి  కాక తప్పడం  లేదు. మానవాళి  మొదటి దుశ్చర్య  ప్లాస్టిక్ వినియోగం. ప్లాస్టిక్ వినియోగాన్ని, వాడకాన్ని  అరికట్టలేని  నిస్సహాయత  మనందరిది. నిర్మూలనకు  నోచుకోని నేటి  మానవ జాతి. ప్రభుత్వ చర్యలు  లేవు, ప్రజల లో  చైతన్యం అంత  కన్నా కాన రాదు. ప్లాస్టిక్ భూతం  మానవాళి  మనుగడకు  గొడ్డలి పెట్టు. మనిషి  గాలి, నీరు, నింగి, నేల, నిప్పు ని  పంచ భూతా...
Recent posts

నేటి నుంచి రాజయోగ మెడిటేషన్ శిక్షణ* *బ్రహ్మకుమారిల ఆధ్వర్యంలో* *నాలుగు రోజులు పాటు నిర్వహణ* *జర్నలిస్టులంతా సద్వినియోగం చేసుకోండి* *మానసిక శారీరక ఆధ్యాత్మిక ప్రశాంతతను పొందండి* *బ్రహ్మకుమారి ల ఆధ్వర్యంలో నిర్వహణ*..

డాబాగార్డెన్స్.. జూన్ 4  ప్రజాపిత బ్రహ్మకుమారీస్ ఈశ్వరీయ విశ్వవిద్యాలయం ఆధ్వర్యంలో శుక్రవారం నుంచిరాజయోగ మెడిటేషన్ శిక్షణ శిబిరం నిర్వహించనున్నట్లు బ్రహ్మకుమారి బి కే రామేశ్వరి తెలిపారు.. గురువారం విశాఖలో ఏర్పాటుచేసిన ప్రత్యేక కార్యక్రమంలో రామేశ్వరి మాట్లాడుతూ  ప్రతి ఒక్కరూ ఆధ్యాత్మిక భక్తి భావంతో ముందుకు సాగాలన్నారు. తమ  మనోబలాన్ని పెంచుకుని ఆత్మవిశ్వాసంతో పరమేశ్వరుని స్మృతితో నిత్య కర్మలను చేస్తూ కుటుంబ బాధ్యతను నిర్వహించాలన్నారు.. ఉద్యోగ వ్యాపారాలు సంభాలిస్తూ నిరంతరము ధ్యానస్థితిని పొందేందుకు మానసిక ఏకాగ్రతను పొందేందుకు మనసుని ప్రశాంతంగా ఉంచుకునేందుకు రాజయోగ మెడిటేషన్ ఎంతగానో దోహదం చేస్తుందన్నారు.. శారీరక మానసిక అనారోగ్యాన్ని తొలగించుకునేందుకు స్వయంగా భగవంతుడు నేర్పిస్తున్న సహజ రాజయోగ  మెడిటేషన్ కోర్సు ఉపకరిస్తుందన్నారు..సీతమ్మధార హెచ్ బి కాలనీ సేవా కేంద్రంలో ఉదయం 8 గంటల నుంచి 9 గంటల వరకు సాయంకాలం 6 నుంచి 7:30 వరకు మెడిటేషన్ శిక్షణ ఇవ్వడం జరుగుతుందన్నారు.. ఈ కోర్సు వరుసగా శుక్రవారం నుంచి నాలుగు రోజులు నిర్వహించడం జరుగుతుందన్నారు.. కావున ప్రతి ఒక్కరూ ఈ అవకాశాన్ని స...

జారీచేసినవారు: డా.పి.జగదీశ్వర రావు, జిల్లా వైద్య మరియు ఆరోగ్య శాఖాధికారి, విశాఖపట్నం, తేది. 04.06.2026

ఈరోజు అనగా తేదీ 04.06.2026 న డా.పి.జగదీశ్వర రావు, జిల్లా వైద్య ఆరోగ్య శాఖాధికారి, విశాఖపట్నం వారు ఆనందపురం ప్రాథమిక ఆరోగ్య కేంద్రము, వేములవలస వి.హెచ్.సి. లను సందర్శించి అక్కడ జరుగుతున్న  ఇ.హెచ్.ఆర్., ఇ-ఔషది, ప్రసవాలు, ల్యాబ్ టెస్ట్లు, మందులు లభ్యత, అభ ఐడి రిజిస్ట్రేషన్, ఐ.వి.ఆర్.ఎస్. ద్వారా హాస్పిటల్ సేవలు అందుతున్నవి లేనివి తెలుసుకొనుట (పబ్లిక్ పెర్సప్షన్),  కె.పి.ఐ. ఇండికేటర్స్, ఎఫ్.ఆర్.ఎస్. హాజరు మొదలగు విషయాల గురించి సమీక్ష నిర్వహించారు. వైద్యాధికారులు, పారామెడికల్ సిబ్బంది అందరూ ఆరోగ్య కేంద్రములో ప్రజలకు అందుబాటులో ఉండాలని ఆదేశించారు. తీవ్ర వేసవి దృష్ట్యా ORS పాకెట్స్ అన్ని సచివలయల్లోను, అంగన్వాడి కేంద్రాలలోను, NREGS పని ప్రదేసల్లోను భారి నిర్మాణాలు జరుగుతున్నప్రదేసల్లోను అందుబాటు లో ఉంచాలి అని ఆదేశించారు. వేసవి లో తీసుకోవలసిన జాగ్రత్తల పట్ల ప్రజల్లో అవగహన కలిపించాలని సూచించారు. ఎపిడెమిక్ వ్యాధుల అవుట్ బ్రేక్ రాకుండా PHC పరిధి లో ఉన్న అన్ని తగు నీట వసతులు మరియు నీటి సరఫరా పైపు లు తరచూ తనఖి చేయాలనీ ఆదేశించారు.   అర్హులైన 14 ఏళ్ళ ఆడపిల్లలకు విధి గా HPV వాక్సిన్ ఇ...

భవన నిర్మాణాలు, ఎల్ఆర్ఎస్ మంజూరు లపై ప్రణాళికాధికారులు ప్రత్యేక శ్రద్ధ కనబరచండి. * విధుల నిర్వహణలో జాప్యం కనబరిచినా, అవినీతికి పాల్పడినా శాఖాపరమైన కఠిన చర్యలు తప్పవు. *జీవీఎంసీ కమిషనర్ కేతన్ గార్గ్

.                   K.V.SHARMA EDITOR  విశాఖపట్నం, జూన్ 4: విశాఖ నగర పరిధిలో గల భవన నిర్మాణాల అనుమతులు, ఎల్ఆర్ఎస్, టి డి ఆర్ ల మంజూరులపై జాప్యం లేకుండా నిర్ణీత కాలంలో పూర్తి చేసేందుకు ప్రత్యేక శ్రద్ధ కనబరచాలని ,విధుల నిర్వహణలో జాప్యం కనబరిచినా, అవినీతికి పాల్పడినా శాఖాపరమైన కఠిన చర్యలు తప్పవని జీవీఎంసీ కమిషనర్ కేతన్ గార్గ్ పట్టణ ప్రణాధికా అధికారులకు ఆదేశించారు. గురువారం ఆయన చీఫ్ సిటీ ప్లానర్ ఎ.ప్రభాకర రావు, ఇతర ప్లానింగ్ అధికారులతో కలిసి జీవీఎంసీ ప్రధాన కార్యాలయం సమావేశం హాల్లో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సమీక్షలో కమిషనర్ మాట్లాడుతూ నగర ప్రజలు తమ భవనాలు నిర్మించుకునేందుకు అనుమతులు కోరుతూ జీవీఎంసీ కి పలు అర్జీలు పెట్టిఉన్నారని వాటిని సకాలంలో పరిష్కరించడంలో చాలా జాప్యం టౌన్ ప్లానింగ్ అధికారులు కనబరుస్తున్నారని ,రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఎల్ఆర్ఎస్ పథకం ద్వారా ఎల్ఆర్ఎస్ మంజూరు ప్రక్రియలో కూడా జాప్యం కనపరుస్తున్నారని కమిషనర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. భవన నిర్మాణ అనుమతులు, ఎల్ఆర్ఎస్, టిడిఆర్ మంజూరుల ప్రక్రియలో ఎటువంటి అవినీతికి తావు...

విద్యా ప్రగతికి దిక్సూచి ఎస్. ఎఫ్.ఎస్. మేధా తయారీలో మేటిగా గుర్తింపు నూతన భవన ప్రారంభోత్సవంలో జి.ఎం. సురేష్ బాబు.

  సీతమ్మ దారులోని ఎస్.ఎఫ్.ఎస్ ఉన్నత పాఠశాల విద్యా,విజ్ఞాన, రంగాల ప్రగతికి దిక్సూచిగా నిలుస్తున్నదని ప్రోవిన్సీఎల్, ఎస్ఎఫ్ఎస్ స్కూల్స్ జనరల్ మేనేజర్ రెవరెండ్ ఫాదర్ బి. సురేష్ బాబు అన్నారు.  సీతమ్మధార స్కూల్ ప్రాంగణంలో గురువారం సాయంత్రం నూతన భవనాన్ని ఆయన ముఖ్యఅతిథిగా ప్రారంభించారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 1974లో సుమారు 245 మందితో ఆరంభమైన ఎస్ఎఫ్ఎస్ స్కూలు ఎంతోమంది జాతీయ, అంతర్జాతీయ మేధో సంపత్తిని ప్రపంచానికి అందించిందన్నారు.ఎస్.ఎఫ్. ఎస్. స్కూల్ ప్రిన్సిపాల్ రెవరెండ్ ఫాదర్ మనోజ్ మాట్లాడుతూ ఎంతో చరిత్ర గల ఎస్ఎఫ్ఎస్ స్కూల్ పాఠశాల దినదినాభివృద్ధి చెందుతున్నదన్నారు. ఎంతోమంది ఐ.ఏ.ఎస్ అధికారులను, ఇంజనీర్లు, వైద్యాధికారులను,  విజ్ఞానవేత్తలను ప్రపంచానికి అందించిన ఘనత ఎస్ఎఫ్ఎస్ స్కూలుదన్నారు. జాతీయ జర్నలిస్టుల సంఘం కార్యదర్శి గంట్ల శీను బాబు మాట్లాడుతూ ఎక్కడ మెరుగైన సౌకర్యాలు ఉంటాయో అక్కడ సత్ఫలితాలు శతశాతం ఉంటాయన్నారు.విద్యా, సాంస్కృతిక, క్రీడారంగాల్లో ఎస్ఎఫ్ఎస్ ప్రగతి స్లాగనీయమైనదన్నారు.  నూతన భవన గ్రౌండ్ ఫ్లోర్ ను సెయింట్ ఆలోసిస్ ప్రెసిడెంట్ థామస్ పెరుమల్లి ప్రారంభించగా,మొదటి...

కూటమి ప్రభుత్వానికి రెండేళ్లు... ప్రజా పాలన, అభివృద్ధికి నిదర్శనం* *▪️ ఇచ్చిన ప్రతి హామీ అమలు చేస్తూ ప్రజల విశ్వాసాన్ని నిలబెట్టుకున్న ప్రభుత్వం* *▪️ విధ్వంసం నుంచి వికాసం వైపు రాష్ట్రాన్ని నడిపించిన చంద్రబాబు నాయకత్వం* *-- టిడిపి రాష్ట్ర అధ్యక్షులు పల్లా శ్రీనివాసరావు*

.                     K.V.SHARMA EDITOR    అమరావతి: విశాఖ సందేశం : జూన్ 4: * కూటమి ప్రభుత్వం ఏర్పడి నేటికి రెండేళ్లు పూర్తైన సందర్భంగా తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధ్యక్షులు, గాజువాక ఎమ్మెల్యే శ్రీ పల్లా శ్రీనివాసరావు గారు ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు. జూన్ 4 కేవలం ప్రభుత్వ ఏర్పాటుకు గుర్తు మాత్రమే కాదని, ప్రజల ఆకాంక్షలు, ఆశయాలు గెలిచిన చారిత్రాత్మక దినమని పేర్కొన్నారు. రాష్ట్ర పునర్నిర్మాణానికి ప్రజలు ఇచ్చిన చారిత్రక తీర్పుతో ఏర్పడిన కూటమి ప్రభుత్వం గత రెండేళ్లుగా సంక్షేమం, అభివృద్ధి, సుపరిపాలనకు సమాన ప్రాధాన్యత ఇస్తూ ముందుకు సాగుతోందన్నారు. ఈ సందర్భంగా పల్లా శ్రీనివాసరావు మాట్లాడుతూ... ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు బాధ్యతలు చేపట్టిన తొలి రోజునే మెగా డీఎస్సీ, ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రద్దు, పెన్షన్ పెంపు, అన్న క్యాంటీన్ల పునరుద్ధరణ వంటి ప్రజా ప్రయోజన నిర్ణయాలతో పాలనకు శ్రీకారం చుట్టారని గుర్తు చేశారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన సూపర్ సిక్స్ హామీల అమలులో ప్రభుత్వం దేశానికే ఆదర్శంగా నిలిచిందన్నారు. అన్నదాత సుఖీభవ, త...

దక్షిణ కోస్తా రైల్వే జనరల్ మేనేజర్ విశాఖపట్నం–ఇచ్చాపురం* విభాగాన్ని పరిశీలించారు

.                    K.V.SHARMA EDITOR   విశాఖపట్నం :విశాఖ సందేశం :దక్షిణ కోస్తా రైల్వే జనరల్ మేనేజర్ శ్రీ సందీప్ మాథుర్ బాధ్యతలు స్వీకరించిన అనంతరం తన తొలి తనిఖీలో భాగంగా నేడువిశాఖపట్నం–ఇచ్చాపురం రైల్వే విభాగాన్ని సమగ్రంగా పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మౌలిక సదుపాయాల అభివృద్ధి పనులు, ప్రయాణికుల సౌకర్యాలు, భద్రతా చర్యలు మరియు నిర్వహణ సామర్థ్యాన్ని సమీక్షించారు. ఈ తనిఖీ సింహాచలం రైల్వే స్టేషన్‌లో ప్రారంభమైంది. అక్కడ అమృత్ భారత్ స్టేషన్ పథకం కింద జరుగుతున్న అభివృద్ధి పనుల పురోగతిని శ్రీ సందీప్ మాథుర్ పరిశీలించారు. ప్రయాణికుల సౌకర్యాల మెరుగుదల మరియు స్టేషన్ మౌలిక సదుపాయాల అభివృద్ధికి చేపడుతున్న వివిధ పనులను ఆయన సమీక్షించారు. తనిఖీ సందర్భంగా జనరల్ మేనేజర్ కొత్తవలస, శ్రీకాకుళం రోడ్, నౌపడా, పలాస మరియు ఇచ్చాపురం రైల్వే స్టేషన్లను కూడా సందర్శించారు. ఈ స్టేషన్లలో అమృత్ భారత్ స్టేషన్ పథకం కింద కొనసాగుతున్న పునర్వికాస పనులు, ప్రయాణికుల సౌకర్యాలు, భద్రతా చర్యలు మరియు నిర్వహణ మెరుగుదలలపై ప్రత్యేకంగా దృష్టి సారించారు. స్టేషన్‌ల సర్క్యులేటింగ్ ఏరి...