పర్యావరణ పరిరక్షణ ప్రతీ పౌరుని బాధ్యత. విశ్వ మానవాళి భవిష్యత్తు, అభివృద్ధి పర్యావరణం తో ముడిపడి ఉంది. అను నిత్యం ప్రతీ పౌరుని ఇంటి ముంగిట/ ఆవరణ నుంచి మొదలయ్యేది పర్యావరణo, పరిశుభ్రత. ప్రపంచం లోని ప్రతీ పౌరుని విధి పర్యావరణ పరి రక్షణ. ప్రకృతిని ప్రేమించాలి, ఆరాధించాలి, అనుసరించాలి, ఆచరణ యోగ్యం గా మరల్చాలి. ప్రకృతి సహజ సిద్ధంగా మానవాళి కి లభించిన వరం. ప్రకృతిని పరిరక్షించు కోక పోవడం మూలాన మానవాళి అనర్ధాలకు, ప్రకృతి ప్రకో పాలకు గురి కాక తప్పడం లేదు. మానవాళి మొదటి దుశ్చర్య ప్లాస్టిక్ వినియోగం. ప్లాస్టిక్ వినియోగాన్ని, వాడకాన్ని అరికట్టలేని నిస్సహాయత మనందరిది. నిర్మూలనకు నోచుకోని నేటి మానవ జాతి. ప్రభుత్వ చర్యలు లేవు, ప్రజల లో చైతన్యం అంత కన్నా కాన రాదు. ప్లాస్టిక్ భూతం మానవాళి మనుగడకు గొడ్డలి పెట్టు. మనిషి గాలి, నీరు, నింగి, నేల, నిప్పు ని పంచ భూతా...
నేటి నుంచి రాజయోగ మెడిటేషన్ శిక్షణ* *బ్రహ్మకుమారిల ఆధ్వర్యంలో* *నాలుగు రోజులు పాటు నిర్వహణ* *జర్నలిస్టులంతా సద్వినియోగం చేసుకోండి* *మానసిక శారీరక ఆధ్యాత్మిక ప్రశాంతతను పొందండి* *బ్రహ్మకుమారి ల ఆధ్వర్యంలో నిర్వహణ*..
డాబాగార్డెన్స్.. జూన్ 4 ప్రజాపిత బ్రహ్మకుమారీస్ ఈశ్వరీయ విశ్వవిద్యాలయం ఆధ్వర్యంలో శుక్రవారం నుంచిరాజయోగ మెడిటేషన్ శిక్షణ శిబిరం నిర్వహించనున్నట్లు బ్రహ్మకుమారి బి కే రామేశ్వరి తెలిపారు.. గురువారం విశాఖలో ఏర్పాటుచేసిన ప్రత్యేక కార్యక్రమంలో రామేశ్వరి మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ ఆధ్యాత్మిక భక్తి భావంతో ముందుకు సాగాలన్నారు. తమ మనోబలాన్ని పెంచుకుని ఆత్మవిశ్వాసంతో పరమేశ్వరుని స్మృతితో నిత్య కర్మలను చేస్తూ కుటుంబ బాధ్యతను నిర్వహించాలన్నారు.. ఉద్యోగ వ్యాపారాలు సంభాలిస్తూ నిరంతరము ధ్యానస్థితిని పొందేందుకు మానసిక ఏకాగ్రతను పొందేందుకు మనసుని ప్రశాంతంగా ఉంచుకునేందుకు రాజయోగ మెడిటేషన్ ఎంతగానో దోహదం చేస్తుందన్నారు.. శారీరక మానసిక అనారోగ్యాన్ని తొలగించుకునేందుకు స్వయంగా భగవంతుడు నేర్పిస్తున్న సహజ రాజయోగ మెడిటేషన్ కోర్సు ఉపకరిస్తుందన్నారు..సీతమ్మధార హెచ్ బి కాలనీ సేవా కేంద్రంలో ఉదయం 8 గంటల నుంచి 9 గంటల వరకు సాయంకాలం 6 నుంచి 7:30 వరకు మెడిటేషన్ శిక్షణ ఇవ్వడం జరుగుతుందన్నారు.. ఈ కోర్సు వరుసగా శుక్రవారం నుంచి నాలుగు రోజులు నిర్వహించడం జరుగుతుందన్నారు.. కావున ప్రతి ఒక్కరూ ఈ అవకాశాన్ని స...