Skip to main content

ఆక్వా రైతులకు అండగా కూటమి ప్రభుత్వం : ఎంపీ హరీష్ బాలయోగి ఆక్వా మేతల ధరలపై కేంద్ర మత్యశాఖ మంత్రి రంజన్ సింగ్ తో మంత్రులతో కలసి ఎంపీ హరీష్ చర్చలు

.          SRININIVAS SPL Correspondant 
అమలాపురం, విశాఖ సందేసం....రాష్ట్రంలోని  ఆక్వా రైతులకు అండగా కూటమి ప్రభుత్వం నిలుస్తుందని 


అమలాపురం ఎంపీ గంటి హరీష్ బాలయోగి అన్నారు. ఆక్వా మేతల ధరలు తగ్గించే చర్యలపై ఢిల్లీలోని మంత్రి కార్యాలయంలో ఆంధ్రప్రదేశ్ ఆక్వాకల్చర్ రంగం అభివృద్ధికి అత్యంత కీలకమైన ఆక్వా మేత ధరలను తగ్గించే చర్యలపై చర్చించడానికి,  


కేంద్ర మత్స్య, పశుసంవర్ధక మరియు పాడిపరిశ్రమల శాఖ మంత్రి శ్రీ రాజీవ్ రంజన్ సింగ్ (లల్లన్ సింగ్) తో కేంద్ర మంత్రులు రామ్మోహన్ నాయుడు, శ్రీనివాసవర్మ , డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణంరాజు, రాష్ట్ర మంత్రులు అచ్చెన్నాయుడు, గొట్టిపాటి రవికుమార్,


 సహచర ఎంపీలు, తదితరులతో కలసి చర్చించినట్లు ఎంపీ హరీష్ బాలయోగి చెప్పారు. ప్రధానంగా ఆక్వా మేతలకు ముడి పదార్థాల పెరుగుతున్న ధరలు మన రాష్ట్రవ్యాప్తంగా ఉన్న ఆక్వా రైతులపై గణనీయమైన భారాన్ని మోపాయని రాష్ట్ర ప్రభుత్వం పెట్టుబడి వ్యయాలను స్థిరీకరించడానికి మరియు ఈ రంగానికి మరింత స్థిరమైన ధరల విధానాన్ని నిర్ధారించడానికి గల  చర్యలపై ఈ సమావేశంలో చర్చించామన్నారు. ఆక్వా రైతులను ఆదుకోవడానికి కూటమి ప్రభుత్వం ఎప్పుడు  కట్టుబడి ఉందని ఎంపీ హరీష్ తెలిపారు.

Comments