అమలాపురం, :విశాఖ సందేసం....స్థిరాస్తులు మరియు ఆస్తి దస్తావేజుల రిజిస్ట్రేషన్ల సేవలు ప్రయివేటీకరణను రద్దు చేయాలని దస్తావేజు లేఖర్లు, సహయకులు, టైపిస్ట్ లు
ముమ్మిడివరం లేఖర్లు అన్నారు. ముమ్మిడివరం సబ్ రిజిస్ట్రార్ కార్యాలయం వద్ద
జి.ఓ. నెం.396 ను నిరసిస్తూ సమ్మెను ప్రారంభించారు. సోమవారం నుండి ఈ నెల 31వరకూ సమ్మెను కొనసాగిస్తామని అన్నారు. రిజిస్ట్రేషన్ సేవలు ప్రయివేటి కరణ నిలుపుదల చేయాలని, దస్తావేజు లేఖర్లుకి లైసెన్సులు పునరుద్దీంచాలని లేఖర్లు కోరారు.అలాగే
ఎలాంటి వివాదాలు లేకుండా ప్రజలకు రిజిస్ట్రేషన్ తాలుకు సేవలను దస్తావేజు లేఖర్లు తమ తమ తరతరాల అనుభవంతో క్రయ విక్రయ దారులకు
తమ సేవలను అందిస్తున్నామన్నారు.
బ్రిటిష్ కాలం నాటి నుండి కొనసాగుతున్న దస్తావేజు లేఖర్ల వ్యవస్థను నిర్మూలించాలనే ఉద్దేశాన్ని తాము వ్యతిరేకిస్తున్నామని తెలిపారు.
ప్రయివేటు కరణ చేయుటకు ఇటివల ఇచ్చిన జి.ఓ. నెం396ని ఉపసంహరించుకోవాలని కోరారు. ఈ జివో కారణంగా
ప్రజలుకి రిజిస్ట్రేషన్ జాప్యం, సమయం వృథా, మరియు అదనపు సొమ్ములను
చెల్లించి నష్టపోవలసిన పరిస్థితులు ఏర్పాడతాయని
దస్తావేజు లేఖర్లు తెలియజేసారు. అనంతరం ముమ్మిడివరం తహశీల్దార్ సుభాష్ కి వినతిపత్రం అందజేశారు. ఈ కార్యక్రమంలో లేఖర్లు,

Comments
Post a Comment