Skip to main content

జారీచేసినవారు: డా.పి.జగదీశ్వర రావు, జిల్లా వైద్య మరియు ఆరోగ్య శాఖాధికారి, విశాఖపట్నం, తేది. 02.04.2026

అనగా తేదీ 02.04.2026 న డా.పి.జగదీశ్వర రావు, జిల్లా వైద్య ఆరోగ్య శాఖాధికారి, విశాఖపట్నం వారి అద్వర్యంలో కేజీహచ్ చిన్న పిల్లల విభాగం-వరల్డ్ ఆటిజం డే అవగాహన సదస్సును మెడికల్ సూపరింటెండెంట్ డా.ఐ.వాణి వారు, ఆంధ్రా మెడికల్ కాలేజీ ప్రిన్సిపాల్ డా.సంధ్యాదేవి వారు, పిడియాట్రిక్స్ విభాగాధిపతి డా.బి.ఎస్.చక్రవర్తి గార్ల సమక్షంలో ర్యాలీ ప్రారంభించారు. 

ఈ ర్యాలీలో ఆటిజం గురించి అవగాహన నినాదాలు చేస్తూ ఆంధ్రా వైద్య విద్యాలయం నుంచి కలెక్టర్ ఆఫీస్ వరకు ర్యాలీ నిర్వహించడం జరిగింది. పెడియాట్రిక్స్  ప్ప్రొఫెసర్స్, డిగ్రీ/పి.జి. వైద్య విద్యార్థులు, డిస్ట్రిక్ట్ ఎర్లీ ఇంటర్వేన్సన్ సెంటర్ వైద్యులు మరియు సిబ్బంది ఆటిజం ర్యాలీ లొ పాల్గొనడం జరిగింది. తదుపరి ఆశ కార్యకర్తల కు ఆటిజం పై సెన్సిటైజేషన్ ప్రోగ్రామ్ DEIC లో నిర్వహించడం జరిగింది. మానసిక, శారీరక సమస్యలు, మానసిక: అభివృద్ధిలో ఆలస్యం వంటి సమస్యలు కలిగిన పిల్లలకు సమయానికి సరైన చికిత్స అందిస్తే మెరుగైన ఫలితాలు సాధ్యమవుతాయని వైద్యులు తెలిపారు. ఆటిజం అనే వ్యాధి చిన్నపిల్లలలో ఎక్కువగా కనిపిస్తోందని పేర్కొన్నారు. పిల్లలు మాట్లాడటంలో ఆలస్యం, ఇతరులతో కలవకపోవడం, తనలో తాను ఉండడం వంటి లక్షణాలు కనిపిస్తాయని తెలిపారు. ఈ లక్షణాలు గమనించిన వెంటనే వైద్యులను సంప్రదించాలని సూచించారు. తల్లిదండ్రులు పిల్లలపై ప్రత్యేక శ్రద్ధ వహించాలని, ప్రేమతో చూసుకోవాలని అన్నారు. సమాజంలో ఆటిజంపై అవగాహన పెంపొందించాల్సిన అవసరం ఉందన్నారు.

ఈ కార్యక్రమం జిల్లా బాలల సత్వర చికిత్సా కేంద్రం - డిస్ట్రిక్ట్ ఎర్లీ ఇంటర్వెంక్షన్ సెంటర్ వైద్య బృందం పాల్గొని ఆటిజం తో ఉన్న పిల్లల కు థెరఫీ లు ఏ విధం గా ఇస్తారన్న దాని మీద అవగాహన కల్పించారు.

ఈ కార్యక్రమం ను జిల్లా RBSK ప్రోగ్రామ్ ఆఫీసర్ డా.బి.హారిక పర్యవేక్షణ లో నిర్వహించారు.

అనగా తేదీ 02.04.2026 న డా.పి.జగదీశ్వర రావు, జిల్లా వైద్య ఆరోగ్య శాఖాధికారి, విశాఖపట్నం వారి అద్వర్యంలో కేజీహచ్ చిన్న పిల్లల విభాగం-వరల్డ్ ఆటిజం డే అవగాహన సదస్సును మెడికల్ సూపరింటెండెంట్ డా.ఐ.వాణి వారు, ఆంధ్రా మెడికల్ కాలేజీ ప్రిన్సిపాల్ డా.సంధ్యాదేవి వారు, పిడియాట్రిక్స్ విభాగాధిపతి డా.బి.ఎస్.చక్రవర్తి గార్ల సమక్షంలో ర్యాలీ ప్రారంభించారు. ఈ ర్యాలీలో ఆటిజం గురించి అవగాహన నినాదాలు చేస్తూ ఆంధ్రా వైద్య విద్యాలయం నుంచి కలెక్టర్ ఆఫీస్ వరకు ర్యాలీ నిర్వహించడం జరిగింది. పెడియాట్రిక్స్  ప్ప్రొఫెసర్స్, డిగ్రీ/పి.జి. వైద్య విద్యార్థులు, డిస్ట్రిక్ట్ ఎర్లీ ఇంటర్వేన్సన్ సెంటర్ వైద్యులు మరియు సిబ్బంది ఆటిజం ర్యాలీ లొ పాల్గొనడం జరిగింది. 

తదుపరి ఆశ కార్యకర్తల కు ఆటిజం పై సెన్సిటైజేషన్ ప్రోగ్రామ్ DEIC లో నిర్వహించడం జరిగింది. మానసిక, శారీరక సమస్యలు, మానసిక: అభివృద్ధిలో ఆలస్యం వంటి సమస్యలు కలిగిన పిల్లలకు సమయానికి సరైన చికిత్స అందిస్తే మెరుగైన ఫలితాలు సాధ్యమవుతాయని వైద్యులు తెలిపారు. ఆటిజం అనే వ్యాధి చిన్నపిల్లలలో ఎక్కువగా కనిపిస్తోందని పేర్కొన్నారు. పిల్లలు మాట్లాడటంలో ఆలస్యం, ఇతరులతో కలవకపోవడం, తనలో తాను ఉండడం వంటి లక్షణాలు కనిపిస్తాయని తెలిపారు. ఈ లక్షణాలు గమనించిన వెంటనే వైద్యులను సంప్రదించాలని సూచించారు. తల్లిదండ్రులు పిల్లలపై ప్రత్యేక శ్రద్ధ వహించాలని, ప్రేమతో చూసుకోవాలని అన్నారు. సమాజంలో ఆటిజంపై అవగాహన పెంపొందించాల్సిన అవసరం ఉందన్నారు.

ఈ కార్యక్రమం జిల్లా బాలల సత్వర చికిత్సా కేంద్రం - డిస్ట్రిక్ట్ ఎర్లీ ఇంటర్వెంక్షన్ సెంటర్ వైద్య బృందం పాల్గొని ఆటిజం తో ఉన్న పిల్లల కు థెరఫీ లు ఏ విధం గా ఇస్తారన్న దాని మీద అవగాహన కల్పించారు.

ఈ కార్యక్రమం ను జిల్లా RBSK ప్రోగ్రామ్ ఆఫీసర్ డా.బి.హారిక పర్యవేక్షణ లో నిర్వహించారు.

   జిల్లా వైద్య ఆరోగ్య శాఖాధికారి

విశాఖపట్నం


             

Comments