Skip to main content

సోమవారం జివిఎంసి లో ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమం . *పునర్వ్యవస్థీకరణ చెందిన 10 జోన్ లలో పి జి ఆర్ ఎస్ కార్యక్రమం నిర్వహణ. -జివిఎంసి కమిషనర్ కేతన్ గార్గ్.


విశాఖపట్నం, ఏప్రిల్ 19 : మహా విశాఖపట్నం నగరపాలక సంస్థ ప్రధాన కార్యాలయంలోను, పునర్వ్యవస్థీకరణ చెందిన  భీమిలి, మధురవాడ , ఈస్ట్, వెస్ట్, సౌత్ ,నార్త్, పెందుర్తి ,గాజువాక, అగనంపూడి అనకాపల్లి  జోన్ల కార్యాలయాల్లోనూ "ప్రజా సమస్యల పరిష్కార వేదిక ( Public Grievance Redressal system-PGRS )కార్యక్రమం" 2026 ఏప్రిల్ 20 వ తేదీ  సోమవారం ఉదయం 11.00 గంటల నుండి మధ్యాహ్నం 1.00 గంట వరకు నిర్వహించబడునని  జివిఎంసి కమిషనర్ కేతన్ గార్గ్ పత్రికా ప్రకటన ద్వారా ఆదివారం తెలిపారు.

కావున, నగరంలో పారిశుద్ధ్యం, పట్టణ ప్రణాళిక విభాగం, నీటి సరఫరా, వీధి దీపాలు,హారికల్చర్, రెవిన్యూ, యు సి డి, ఇంజినీరింగ్ మొదలగు జీవీఎంసీ విభాగాలకు సంబంధించిన సమస్యలపై 2026 ఏప్రిల్ 20వ తేదీ సోమవారం ఉదయం 11.00 గంటల నుండి మధ్యాహ్నం 1.00 గంట వరకు ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక కార్యక్రమంలో నగర ప్రజలు అర్జీల ద్వారా సమస్యలను తెలియపరుచుకోవచ్చునని నగర ప్రజలకు జివిఎంసి కమిషనర్ కేతన్ గార్గ్ తెలియచేశారు. 

గమనిక: 1) జీవీఎంసీ వెస్ట్ జోన్ కార్యాలయం 52 వ వార్డు లో గల ఎన్. ఎ .డి కొత్త రోడ్డు , గౌరీ నగర్ లో పశ్చిమ నియోజకవర్గం కార్యాలయం నందు ఏర్పాటు చేయడమైనది. 

2) నార్త్ జోన్ కార్యాలయం 51 వ వార్డులో  మాధవధార ఉడా లేఅవుట్, ఆర్ . టి. ఎ ఆఫీస్ రోడ్డు, పంప్ హౌస్ వెనుక  ఉత్తర నియోజకవర్గం కార్యాలయం లో ఏర్పాటు చేయడమైనది. 

3) అగనంపూడి జోన్ కార్యాలయం 85వ వార్డులో పెదమడక, శివాలయం రోడ్డు , వినాయక టెంపుల్  సమీపములో గల రాజీవ్ గాంధీ కళ్యాణ మండపంలో ఏర్పాటు చేయడమైనది. 

కావున ప్రజలు ఈ పై జోన్ల ప్రదేశాలను గమనించవలసిందిగా కోరుచూ ,మిగిలిన అన్ని జోన్ల కార్యాలయాలు యధాస్థానంలో ఉన్నవని తెలియపరచడమైనది.

పౌర సంబంధాల అధికారి, జివిఎంసి

                K.V.SHARMA EDITOR 

Comments

Popular posts from this blog

ప్రాణాలను కాపాడే సేవలో ఉక్కు సంకల్పం – RINL , విశాఖ ఉక్కు కర్మాగారం మాజీ జనరల్ మేనేజర్(VRS) శ్రీ జేవీవీఎస్ శర్మ 39 వ సారి అరుదైన ఓ- నెగటివ్ రక్తదానం*

భగవాన్ శ్రీ సత్య సాయి బాబా వారి దివ్య కృపతో, RINL,   విశాఖ ఉక్కు కర్మాగారం లో  థర్మల్ పవర్ ప్లాంట్‌లో జనరల్ మేనేజర్ (ప్రాజెక్ట్స్)గా పనిచేసి వాలంటరీ రిటైర్మెంట్ (VRS) తీసుకున్న శ్రీ జేవీవీఎస్ శర్మ గారు మరోసారి తన సేవా భావాన్ని చాటుకున్నారు. మెడికవర్ హాస్పిటల్‌లో హృదయ శస్త్రచికిత్స పొందవలసిన ఒక వ్యక్తికి  అరుదైన O-నెగటివ్ రక్తాన్ని దానం చేసి ప్రాణరక్షణలో భాగస్వాములయ్యారు. శ్రీ శర్మ గారు సేవా స్పూర్తి, మానవతా విలువలకు ప్రతీకగా నిలుస్తున్నారు. వీఆర్‌ఎస్ అనంతరం కూడా అవసరమైన వారికి సహాయం చేస్తూ సమాజానికి ఆదర్శంగా నిలుస్తున్నారు. ఇది ఆయన చేసిన 39వ రక్తదానం కావడం విశేషం. ప్రతి మూడు నెలలకు ఒకసారి రక్తదానం చేస్తూ, ఇతరులకు కూడా స్ఫూర్తినిస్తున్నారు. శ్రీ సత్య సాయి సాయి కుటుంబ సభ్యులు మరియు విశాఖ ఉక్కు కర్మాగారం సహచరులు ఆయన ఈ మహత్తర సేవను అభినందిస్తూ, శ్రీ శర్మ గారు, వారి సతీమణి మరియు పిల్లలపై భగవాన్ ఆశీస్సులు ఎల్లప్పుడూ ఉండాలని ప్రార్థించారు. సమాజ సేవలో మరింత ముందుకు సాగేందుకు ఆయనకు ఆరోగ్యం, ఆనందం, ఐశ్వర్యం కలగాలని ఆకాంక్షించారు.