కోడూరుపాడు సీతారాంపేటలో ఘనంగా డా.బిఆర్ అంబేద్కర్135వ జయంతి, బాబు జగజ్జివన్ రావు 119వ జయంతి వేడుకలు....
అల్లవరం, విశాఖ సందేసం....డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా అల్లవరం మండలం కోడూరుపాడు సీతారాంపేట ఎమ్మార్పీఎస్ యువకుల ఆధ్వర్యంలో డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ 135 వ జయంతి బాబు జగజ్జివన్ రావు 119వ జయంతి వేడుకలను ఆదివారం ఘనంగా నిర్వహించారు.
ఈ వేడుకలకు ముఖ్య అతిథులుగా అమలాపురం శాసనసభ్యులు అయితాబత్తుల ఆనందరావు, ఎమ్మెల్సీ బొమ్మి ఇజ్రాయిల్, సీఐ ప్రశాంత్ కుమార్ పాల్గొని
డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ విగ్రహానికి బాబు జగజ్జీవన్ రావు విగ్రహానికి పూలదండల అలంకరించి జ్యోతి ప్రజ్వలన చేశారు.ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ అంబేద్కర్ ఒక వర్గానికి పరిమితం కాకుండా ఎస్సీ ఎస్టీ మరియు బీసీ వర్గాల సామాజిక సామర్థ్యం కోసం వారి హక్కుల కోసం తన జీవితాంతం అలుపెరుగని పోరాటం చేశారని ఆయన కొనియాడారు. అదేవిధంగా సీఎం చంద్రబాబు నాయుడు అంబేద్కర్ బాబు జగజ్జివన్ రావు వంటి మహనీయులను పూర్తిగా తీసుకుని దళితుల అభ్యున్నతికి నిరంతర కృషి చేస్తున్నారని ఎమ్మెల్యే తెలిపారు.
దళిత సామాజిక అంతా విభేదాలు విడి ఐక్యతగా ఉండాలని ఆయన పిలుపునిచ్చారు. ఎమ్మెల్సీ బొమ్మి ఇజ్రాయిల్ మాట్లాడుతూ డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ రాజ్యాంగంలో ఇచ్చిన రిజర్వేషన్ ఫలాల వల్లే బడుగు బలహీన వర్గాల ప్రజలు ఎమ్మెల్యే ఎమ్మెల్సీ పంచాయతీ సర్పంచ్ గ్రామ వార్డు వివిధ రకాల రిజర్వేషన్ ఫలాలు పొందుతున్నామని యువకులు ఆయన స్ఫూర్తిగా తీసుకుని ముందుకు సాగాలని తెలియజేశారు
Srinivas Spl Correspondant




Comments
Post a Comment