Skip to main content

జీవీఎంసీలో 15 మంది కి కారుణ్య నియామకం పత్రాలు అందించిన కమిషనర్.


విశాఖపట్నం, ఏప్రిల్ 22
: జివిఎంసిలో కారుణ్య నియామకంలో ఉద్యోగం పొందిన ప్రతి ఒక్కరూ తమ సంస్థ కొరకు నిబద్దతతో విధులు నిర్వహించి జివిఎంసి కి మంచి గుర్తింపు తీసుకురావాలని జీవీఎంసీ కమిషనర్ కేతన్ గార్గ్ పేర్కొన్నారు


. బుధవారం జీవీఎంసీ ప్రధాన కార్యాలయంలోని ఆయన ఛాంబర్ లో జీవీఎంసీలో విధులు నిర్వహిస్తూ మరణించిన 15 మంది కుటుంబ సభ్యులకు 4వ తరగతి ఉద్యోగులుగా నియామక పత్రాలను జీవీఎంసీ అదనపు కమిషనర్ పీఎం సత్యవేణి తో కలిసి అందించారు.


ఈ సందర్భంగా జీవీఎంసీ కమిషనర్ మాట్లాడుతూ జీవీఎంసీ లో ఉద్యోగం చేస్తూ మరణం పొందిన కుటుంబ సభ్యులకు 15 మందికి జివిఎంసిలో నాలుగో తరగతి ఉద్యోగులుగా నీయామాపకం పత్రాలను అందించామని తెలిపారు. ఉద్యోగం పొందిన ప్రతి ఒక్కరూ సంస్థ కొరకు నిబద్దతతో పని చేయాలని తెలిపారు. 


జీవీఎంసీ అంటే ప్రజలకు సర్వీసులు అందించే సంస్థని, నిత్యం ప్రజా సేవ కొరకు అధికారులు చెప్పిన ప్రతి పనిని సకాలంలో పూర్తిచేసి సంస్థకు, అధికారులకు మంచి పేరు తీసుకురావాలని, అలాగే చిత్తశుద్ధి తో విధులు నిర్వహిస్తూ విధి నిర్వహణ లో ప్రత్యెక నైపుణ్యతను పెంపొందించుకోవాలని కమీషనర్ వారికి ఆదేశించారు.

ఈ కార్యక్రమంలో జీవీఎంసీ అడ్మినిస్ట్రేటివ్ అధికారి పి. పద్మజ తదితరులు పాల్గొన్నారు పౌర సంబంధాల అధికారి, జివిఎంసి

                   K.V.SHARMA EDITOR 

Comments

Popular posts from this blog

ప్రాణాలను కాపాడే సేవలో ఉక్కు సంకల్పం – RINL , విశాఖ ఉక్కు కర్మాగారం మాజీ జనరల్ మేనేజర్(VRS) శ్రీ జేవీవీఎస్ శర్మ 39 వ సారి అరుదైన ఓ- నెగటివ్ రక్తదానం*

భగవాన్ శ్రీ సత్య సాయి బాబా వారి దివ్య కృపతో, RINL,   విశాఖ ఉక్కు కర్మాగారం లో  థర్మల్ పవర్ ప్లాంట్‌లో జనరల్ మేనేజర్ (ప్రాజెక్ట్స్)గా పనిచేసి వాలంటరీ రిటైర్మెంట్ (VRS) తీసుకున్న శ్రీ జేవీవీఎస్ శర్మ గారు మరోసారి తన సేవా భావాన్ని చాటుకున్నారు. మెడికవర్ హాస్పిటల్‌లో హృదయ శస్త్రచికిత్స పొందవలసిన ఒక వ్యక్తికి  అరుదైన O-నెగటివ్ రక్తాన్ని దానం చేసి ప్రాణరక్షణలో భాగస్వాములయ్యారు. శ్రీ శర్మ గారు సేవా స్పూర్తి, మానవతా విలువలకు ప్రతీకగా నిలుస్తున్నారు. వీఆర్‌ఎస్ అనంతరం కూడా అవసరమైన వారికి సహాయం చేస్తూ సమాజానికి ఆదర్శంగా నిలుస్తున్నారు. ఇది ఆయన చేసిన 39వ రక్తదానం కావడం విశేషం. ప్రతి మూడు నెలలకు ఒకసారి రక్తదానం చేస్తూ, ఇతరులకు కూడా స్ఫూర్తినిస్తున్నారు. శ్రీ సత్య సాయి సాయి కుటుంబ సభ్యులు మరియు విశాఖ ఉక్కు కర్మాగారం సహచరులు ఆయన ఈ మహత్తర సేవను అభినందిస్తూ, శ్రీ శర్మ గారు, వారి సతీమణి మరియు పిల్లలపై భగవాన్ ఆశీస్సులు ఎల్లప్పుడూ ఉండాలని ప్రార్థించారు. సమాజ సేవలో మరింత ముందుకు సాగేందుకు ఆయనకు ఆరోగ్యం, ఆనందం, ఐశ్వర్యం కలగాలని ఆకాంక్షించారు.