Skip to main content

పూర్ణా మార్కెట్ లో అగ్ని ప్రమాదానికి గురైన 16 షాపుల యజమానులకు 10 వేల చొప్పున చెక్కులు అందజేసిన ఎమ్మెల్యే వంశీకృష్ణ శ్రీనివాస్ గారు* *కార్యక్రమంలో పాల్గొన్న టీడీపీ సౌత్ ఇన్చార్జ్, రాష్ట్ర ఛైర్మన్ సుధాకర్ గారు, ఎమ్మార్వో పాత్రుడు గారు, కూటమి నేతలు*

గత కొన్ని నెలల క్రితం పూర్ణా మార్కెట్లో 16 షాపులు అగ్ని ప్రమాదానికి గురైన నేపద్యంలో ఈరోజు దక్షిణ నియోజకవర్గం సభ్యులు శ్రీ వంశీకృష్ణ శ్రీనివాస్ గారు, టిడిపి  సౌత్ ఇన్చార్జ్ శ్రీ సీతంరాజు సుధాకర్ గారి చేతులమీదుగా 16 షాపుల యజమానులకు పదివేల రూపాయలు చొప్పున చెక్కులను అందజేశారు . గతం లో ఈ ప్రమాదం జరిగిన వెంటనే ఎమ్మెల్యే వంశీకృష్ణ శ్రీనివాస్ గారు వెంటనే సంఘటన  స్థలాన్ని సందర్శించి వారికి ధైర్యాన్ని కల్పించడంతో పాటు తమవంతు సహకారం  ఎల్లప్పుడూ ఉంటుందని  హామీ ఇచ్చిన విషయాన్ని గుర్తు చేశారు. పూర్ణా మార్కెట్ అభివృద్ధి తో పాటు ,నిరంతరం సీసీ కెమెరా ద్వారా పర్యవేక్షణ జరుగుతుందని గుర్తు చేశారు. వ్యాపారస్తులకు , చిరు వ్యాపారస్తులకు తాను అండగా ఎల్లప్పుడూ ఉంటానని ఈ సందర్భంగా గుర్తుచేశారు.  అదేవిధంగా మార్కెట్లో స్థానిక దుకాణదారులను తో స్వయంగా మాట్లాడి వారి సమస్యలపై ఆరా తీశారు.  మార్కెట్  పరిసర  ప్రాంతాల్లో పర్యటన చేపట్టి స్థానిక లా అండ్ ఆర్డర్,ట్రాఫిక్ సి ఐ లతో మాట్లాడారు. చిరు వ్యాపారులకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా చర్యలు తీసుకోవాలని కోరారు. కార్యక్రమంలో ఎమ్మార్వో పాత్రుడు గారు, స్థానిక టిడిపి ,జనసేన, బిజెపి నాయకులు , యూనియన్ నేతలు పాల్గొన్నారు....

Comments