గౌరవ శాసనసభ్యులు వారు మాట్లాడుతూ టిబి రహిత భారత దేశాన్ని నిర్మించాలంటే ప్రజలందరూ ఈ కార్యక్రమలో భాగస్వామ్యులు కావాలని పిలుపునిచ్చారు. ప్రజలందరూ ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని అలాగే ఎవరైనా రెండు వారాలకు మించిన దగ్గు, జ్వరం, బరువు తగ్గడం, ఆకలి మందగించడం, రాత్రి సమయంలో చెమటలు పట్టడం, అలసట, ఖఫంలో రక్తపుచారలు కనబడుట వంటి లక్షణములు ఉన్నట్లయితే సమీపములో గల ఆరోగ్య కేంద్రమును సందర్శించి తగు పరీక్షలు చేయిచుకోవాలని సూచించారు.
TBMBA 2.0 కార్యక్రమంలో ధూమపానం అలవాటు ఉన్నవారు 60 సం”ల వయస్సు పైబడిన వారు, డయాబెటిస్ వ్యాదిగ్రస్తులు, పాత టిబి వ్యాధి సోకినవారు మరియు BMI 18 కంటే తక్కువ ఉన్నవారు టిబి వ్యాధి నిర్ధారణ పరీక్షల కోసం ఖఫం మరియు ఎక్ష్-రే పరీక్షలు చేయించుకోవాలని సూచించారు
ఈ కార్యక్రమంలో జిల్లా టిబి నివారణ అధికారి డా.రోణంకి రమేష్ వారు మరియు వారి కార్యాలయ సిబ్బంది పాల్గొన్నారు.
సం/-డా.పి..జగదీశ్వర రావు
జిల్లా వైద్య ఆరోగ్య శాఖాధికారి
విశాఖపట్నం

Comments
Post a Comment