Skip to main content

ఆంధ్ర‌విశ్వ‌విద్యాల‌యం, ఏప్రియ‌ల్ 16: ఆంధ్ర‌విశ్వ‌విద్యాల‌యం శ‌తాబ్ధి ఉత్స‌వాల‌లో భాగంగా గురువారం ఏయూ అనుబంధ క‌ళాశాల ఎలియ‌న్స్ కాలేజ్ ఆఫ్ హోట‌ల్ మేనేజ్‌మెంట్ విద్యార్థులు వినూత్నంగా ఏయూకు శుభాకంక్ష‌లు అందిచారు.

                  K.V.SHARMA EDITOR 


ఆంధ్ర‌విశ్వ‌విద్యాల‌యం,ఏప్రియ‌ల్16:ఆంధ్ర‌విశ్వ‌విద్యాల‌యం శ‌తాబ్ధి ఉత్స‌వాల‌లో భాగంగా గురువారం ఏయూ అనుబంధ క‌ళాశాల ఎలియ‌న్స్ కాలేజ్ ఆఫ్ హోట‌ల్ మేనేజ్‌మెంట్ విద్యార్థులు వినూత్నంగా ఏయూకు శుభాకంక్ష‌లు అందిచారు. ఆంధ్ర‌విశ్వ‌విద్యాల‌యం వంద సంవ‌త్స‌రాలు పూర్తిచేసుకుంటున్న సంద‌ర్భాన్ని పుర‌స్క‌రించుకుని ఎంతోక‌ళాత్మ‌కంగా ఫుడ్ కార్వింగ్ తీర్చిదిద్దారు. వివిధ రకాల పండ్లు, కూర‌గాయ‌ల‌ను ఉప‌యోగించి దీనికి త‌యారు చేశారు. పండ్లు, కూర‌గాయ‌ల‌ను ఉప‌యోగించి అంద‌మైన పుష్ప‌గుచ్చాలు, హంస‌లు, కేక్ వంటివి సిద్దం చేశారు. ఈ సంద‌ర్భంగా హోట‌ల్ మేనేజ్‌మెంట్ చేస్తున్న విద్యార్థుల‌ను ఏయూ వీసీ ఆచార్య జి.పి రాజ‌శేఖ‌ర్ ప్ర‌త్యేకంగా అభినందించారు. తాము నేర్చుకున్న అంశాల‌ను కార్య‌రూపంలో చూప‌డంతో పాటు, ఎంతో క‌ళాత్మ‌కంగా విశ్వ‌విద్యాల‌య వందేళ్ల వేడుక‌ను చూపే ప్ర‌య‌త్నాన్ని ప్ర‌శంసించారు. 

కార్య‌క్ర‌మంలో రెక్టార్ ఆచార్య పి.కింగ్‌, రిజిస్ట్రార్ ఆచార్య కె.రాంబాబు, ప్రిన్సిపాల్స్ ఆచార్య జాలాది ర‌వి, ఎం.శ‌శి, జి.గిరిజా శంక‌ర్‌, కె.న‌గ‌రాజ కుమారి, ఆర్‌.ప‌ద్మ‌శ్రీ‌, కె.సీతామాణిక్యం, ఎలియ‌న్స్ క‌ళాశాల డైరెక్ట‌ర్ కె.స‌తీష్‌, ప్రిన్సిపాల్ బి.శ్రీ‌నివాస్‌, ఏయూ డీన్‌లు, ఆచార్యులు, ఉద్యోగులు, విద్యార్థులు త‌దిత‌రులు పెద్ద‌సంఖ్య‌లో పాల్గొన్నారు.

Comments

Popular posts from this blog

ప్రాణాలను కాపాడే సేవలో ఉక్కు సంకల్పం – RINL , విశాఖ ఉక్కు కర్మాగారం మాజీ జనరల్ మేనేజర్(VRS) శ్రీ జేవీవీఎస్ శర్మ 39 వ సారి అరుదైన ఓ- నెగటివ్ రక్తదానం*

భగవాన్ శ్రీ సత్య సాయి బాబా వారి దివ్య కృపతో, RINL,   విశాఖ ఉక్కు కర్మాగారం లో  థర్మల్ పవర్ ప్లాంట్‌లో జనరల్ మేనేజర్ (ప్రాజెక్ట్స్)గా పనిచేసి వాలంటరీ రిటైర్మెంట్ (VRS) తీసుకున్న శ్రీ జేవీవీఎస్ శర్మ గారు మరోసారి తన సేవా భావాన్ని చాటుకున్నారు. మెడికవర్ హాస్పిటల్‌లో హృదయ శస్త్రచికిత్స పొందవలసిన ఒక వ్యక్తికి  అరుదైన O-నెగటివ్ రక్తాన్ని దానం చేసి ప్రాణరక్షణలో భాగస్వాములయ్యారు. శ్రీ శర్మ గారు సేవా స్పూర్తి, మానవతా విలువలకు ప్రతీకగా నిలుస్తున్నారు. వీఆర్‌ఎస్ అనంతరం కూడా అవసరమైన వారికి సహాయం చేస్తూ సమాజానికి ఆదర్శంగా నిలుస్తున్నారు. ఇది ఆయన చేసిన 39వ రక్తదానం కావడం విశేషం. ప్రతి మూడు నెలలకు ఒకసారి రక్తదానం చేస్తూ, ఇతరులకు కూడా స్ఫూర్తినిస్తున్నారు. శ్రీ సత్య సాయి సాయి కుటుంబ సభ్యులు మరియు విశాఖ ఉక్కు కర్మాగారం సహచరులు ఆయన ఈ మహత్తర సేవను అభినందిస్తూ, శ్రీ శర్మ గారు, వారి సతీమణి మరియు పిల్లలపై భగవాన్ ఆశీస్సులు ఎల్లప్పుడూ ఉండాలని ప్రార్థించారు. సమాజ సేవలో మరింత ముందుకు సాగేందుకు ఆయనకు ఆరోగ్యం, ఆనందం, ఐశ్వర్యం కలగాలని ఆకాంక్షించారు.