ఈ రోజు అనగా 18.04.2026 న టిబి ముక్త్ భారత్ అభయాన్ 2.0 (TBMBA) కార్యక్రమంలో భాగంగా ఈరోజు భీమిలి నియోజకవర్గం “MLA - గారు “శ్రీ గంటా శ్రీనివాస రావు" గారు టిబి వ్యాధి పై అవగహన కార్యక్రమం లో పాల్గొని గోడపత్రికలను ఆవిష్కరించడం జరిగింది.
MLA గారు మాట్టాడుతు టిబీ రహిత భారతదేశాన్నినిర్మించాలంటే ప్రజలందరు ఈ కార్యక్రమంలో భాగస్వామ్యం కావాలని పిలుపునిచ్చారు. ప్రజలందరు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని, అలాగే ఎవరికైన రెండు వారాలకి మించిన దగ్గు, జ్వరం, బరువుతగ్గడం, అకలి మందరించడం, రాత్రి చెమటలు పట్టడం, అలసట, కఫంలో రక్తపు చారలు కనబడిన యెడల వెంటనే దగ్గరలో ఉన్నటువంటి ఆరోగ్య కేంద్రాన్నిసందర్శించి తగు పరిక్షలు చేయించుకోవాలని సూచించారు.
TBMBA 2.0 కార్యక్రమంలో ధూమపానo అలవాటు ఉన్నవారు, 60 సంవత్సరాల వయస్సు పైబడినవారు, డయాబటిక్ వ్యాదిగ్రస్తులు, పాత టిబి వ్యాధి సోకిన వారు మరియు BMI 18 కoటే తక్కువ ఉన్నవారు టిబి వ్యాధి నిర్థారణ పరిక్షల కోసం కఫం మరియు X- Ray పరిక్షలు చేయించుకోవాలని సూచించారు.
ఈ కార్యాక్రమంలో జిల్లా టిబి వివారణ అధికారి డా.రోణంకి రమేష్ వారు యొక్క సిబ్బంది పాల్గోన్నారు
జిల్లా వైద్య ఆరోగ్య శాఖాధికారి
విశాఖపట్నం
K.V.SHARMA EDITOR

Comments
Post a Comment