ఉక్కునగరం శ్రీ సత్య సాయి సేవా సమితి 19.04.2026 ఎండలో నీడగా… దాహంలో చల్లదనంగా… సాయి యువత సేవ” - మానవసేవయే మాధసేవ అన్న భగవాన్ శ్రీ సత్య సాయి బాబా వారి సందేశాన్ని ఆచరణలో చూపిన ఉక్కునగరం శ్రీ సత్య సాయి యువత
భగవాన్ శ్రీ సత్య సాయి బాబా వారి “అందరినీ ప్రేమించు – అందరినీ సేవించు” అన్న దివ్య సందేశం స్ఫూర్తిగా, 15వ ఆరాధన మహోత్సవాన్ని పురస్కరించుకుని శ్రీ సత్య సాయి సేవా సమితి ఉక్కునగరం యువజన విభాగం ఆధ్వర్యంలో ఈ రోజు విశిష్టమైన సేవా కార్యక్రమాలు నిర్వహించబడ్డాయి.
ఎండ తీవ్రతతో అలసిపోయిన బాటసారులకు ఉపశమనం కలిగించాలనే తపనతో దేశపాత్రునిపాలెం, అగనంపూడి, రాజీవ్ నగర్ (కూర్మన్నపాలెం), ఉక్కునగరం జంక్షన్ ప్రాంతాలలో శ్రీ సత్య సాయి యువత, సేవాదళ్ సభ్యులు ప్రేమతో సేవ అందించారు.
ఈ సేవలో విశేషత ఏమిటంటే — సేవాదళ సభ్యులు స్వయంగా బాటసారులకు కొత్త చెప్పులు తొడిగించి, వారి పాదాలకు ఉపశమనం కలిగించారు. అలాగే కొత్త గొడుగులను అందించి, ఎండ తీవ్రత నుండి రక్షణ కలిగించారు. ఇది కేవలం సేవ కాదు — అది ప్రేమకు ప్రతిరూపం.
అదేవిధంగా పులిహార ప్రసాదాన్ని పంపిణీ చేయడం జరిగింది. సుమారు 20 లీటర్ల పెరుగుతో చల్లటి మజ్జిగ తయారుచేసి, ఎండలో ప్రయాణించే వారికి పంచి వారి దాహాన్ని తీర్చారు.
ఈ సేవా కార్యక్రమంలో ఉక్కునగరం యువజన విభాగం లీడర్ శ్రీ కె. ప్రకాష్, శ్రీ కె. రామచంద్రరావు, జాయింట్ కన్వీనర్ శ్రీ కె.వి. రమణ, మహిళా యువజన నాయకురాలు కుమారి సాయి విద్య, అలాగే శ్రీ కె. దివాకర్, పరశురాం, పాండురంగ తదితరులు పాల్గొన్నారు.
ఈ సేవా కార్యక్రమం భగవాన్ శ్రీ సత్య సాయి బాబా వారి ప్రార్ధించే పెదవుల కన్నా సేవించే చేతులు మిన్న అన్న దివ్య సందేశంకు సజీవ సాక్ష్యంగా నిలిచింది.
K.V.SHARMA EDITOR




Comments
Post a Comment