Skip to main content

శ్రీ వెంకటేశ్వర కాలేజీలో మెగా జాబ్ మేళా.... జాబ్ మేళాలో 200 నిరుద్యోగులకు ఉద్యోగాలు


అమలాపురం: విశాఖ సందేసం
:నిరుద్యోగ యువతకు భవిష్యత్తును అందించడమే లక్ష్యంగా కూటమి ప్రభుత్వం ఆధ్వర్యంలో వికాస, స్కిల్ డెవలప్మెంట్ జాబ్ మేళాలను నిర్వహిస్తుంది. అమలాపురం శ్రీ వెంకటేశ్వర డిగ్రీ కళాశాలలో వికాస స్కిల్ డెవలప్మెంట్ సంయుక్త ఆధ్వర్యంలో జిల్లా కలెక్టర్ ఆర్ మహేష్ కుమార్ ఆదేశాల మేరకు మెగా జాబ్ మేళాను శనివారం  నిర్వహించారు.

ఈ సందర్భంగా వికాస డైరెక్టర్ రమేష్ మాట్లాడుతూ జిల్లా కలెక్టర్ ఆర్ మహేష్ కుమార్ మరియు కూటమి ప్రభుత్వంలో సీఎం చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ సారధ్యంలో అన్నిచోట్ల నిరుద్యోగ యువతీ యువకులకు జాబ్ మేళా నిర్వహిస్తున్నామని, 17 కంపెనీల హెచ్ఆర్ లతో  శ్రీ వెంకటేశ్వర డిగ్రీ కళాశాలలో సుమారు 500 మంది నిరుద్యోగ యువతీ యువకులకు ఇంటర్వ్యూ నిర్వహించగా 200 మంది ఉద్యోగాలు సాధించి కంపెనీ జాయినింగ్  లెటర్స్ అందుకున్నారని  తెలిపారు.  జిల్లాలో జరిగే జాబ్ మేళాలను నిరుద్యోగ యువతీ యువకులు సద్వినియోగం చేసుకోవాలని కాలేజీ ప్రిన్సిపాల్ మనోహర్  అన్నారు. కరాటం ప్రవీణ్ మాట్లాడుతూ శ్రీ వెంకటేశ్వర డిగ్రీ కళాశాలలో చాలా జాబ్ మేళాలు నిర్వహించిమని, ఈ జాబ్ మేళాను తమ కళాశాలలో నిర్వహించడం చాలా సంతోషంగా ఉందన్నారు. 

జాబ్ మేళా నిర్వహించిన అధికారులు ధన్యవాదములు తెలియజేశారు.ఈ కార్యక్రమంలో సెక్రటరీ అండ్ కరెస్పాండెంట్ కెవిఆర్ నరసింహారావు, ప్లేస్మెంట్ అధికారులు ప్లేస్మెంట్ అధికారులు వై. వరప్రసాద్, బి. శ్రీనివాస్ సిహెచ్ జాన్ పాల్,  స్కిల్ డెవలప్మెంట్ అధికారి రాజేంద్ర ప్రసాద్, హరి, శంసున్, కె శ్రేవాంధలి అధిక సంఖ్యలో నిరుద్యోగ యువతి యువకులు పాల్గొన్నారు.

            Srinivas Spl Correspondant 

Comments

Popular posts from this blog

ప్రాణాలను కాపాడే సేవలో ఉక్కు సంకల్పం – RINL , విశాఖ ఉక్కు కర్మాగారం మాజీ జనరల్ మేనేజర్(VRS) శ్రీ జేవీవీఎస్ శర్మ 39 వ సారి అరుదైన ఓ- నెగటివ్ రక్తదానం*

భగవాన్ శ్రీ సత్య సాయి బాబా వారి దివ్య కృపతో, RINL,   విశాఖ ఉక్కు కర్మాగారం లో  థర్మల్ పవర్ ప్లాంట్‌లో జనరల్ మేనేజర్ (ప్రాజెక్ట్స్)గా పనిచేసి వాలంటరీ రిటైర్మెంట్ (VRS) తీసుకున్న శ్రీ జేవీవీఎస్ శర్మ గారు మరోసారి తన సేవా భావాన్ని చాటుకున్నారు. మెడికవర్ హాస్పిటల్‌లో హృదయ శస్త్రచికిత్స పొందవలసిన ఒక వ్యక్తికి  అరుదైన O-నెగటివ్ రక్తాన్ని దానం చేసి ప్రాణరక్షణలో భాగస్వాములయ్యారు. శ్రీ శర్మ గారు సేవా స్పూర్తి, మానవతా విలువలకు ప్రతీకగా నిలుస్తున్నారు. వీఆర్‌ఎస్ అనంతరం కూడా అవసరమైన వారికి సహాయం చేస్తూ సమాజానికి ఆదర్శంగా నిలుస్తున్నారు. ఇది ఆయన చేసిన 39వ రక్తదానం కావడం విశేషం. ప్రతి మూడు నెలలకు ఒకసారి రక్తదానం చేస్తూ, ఇతరులకు కూడా స్ఫూర్తినిస్తున్నారు. శ్రీ సత్య సాయి సాయి కుటుంబ సభ్యులు మరియు విశాఖ ఉక్కు కర్మాగారం సహచరులు ఆయన ఈ మహత్తర సేవను అభినందిస్తూ, శ్రీ శర్మ గారు, వారి సతీమణి మరియు పిల్లలపై భగవాన్ ఆశీస్సులు ఎల్లప్పుడూ ఉండాలని ప్రార్థించారు. సమాజ సేవలో మరింత ముందుకు సాగేందుకు ఆయనకు ఆరోగ్యం, ఆనందం, ఐశ్వర్యం కలగాలని ఆకాంక్షించారు.