ఆంధ్ర విశ్వవిద్యాలయం శతాబ్ది ఉత్సవాల్లో భాగంగా డా. దుర్గాబాయి దేశ ముఖ్ సెంటర్ ఫర్ ఉమెన్స్ ఆధ్వర్యంలో ఈనెల 24వ తేదీన 'వనిత వేవ్ @100' ది శతాబ్ది వాక్ కార్యక్రమం నిర్వహించనున్నారు
K.V.SHARMA EDITOR
ఆంధ్ర విశ్వవిద్యాలయం శతాబ్ది ఉత్సవాల్లో భాగంగా డా. దుర్గాబాయి దేశ ముఖ్ సెంటర్ ఫర్ ఉమెన్స్ ఆధ్వర్యంలో ఈనెల 24వ తేదీన 'వనిత వేవ్ @100' ది శతాబ్ది వాక్ కార్యక్రమం నిర్వహించనున్నారు. ఈ కార్యక్రమం బీచ్ రోడ్ నందు గల కాళీమాత మందిరం నుండి ఉదయం 6.30 గంటలకు ప్రారంభం కానుంది. ఈ కార్యక్రమానికి సంబంధించిన పోస్టర్ ను ఆంధ్ర విశ్వవిద్యాలయం ఉపకులపతి ఆచార్య జి.పి రాజశేఖర్ నేడు ఈసీ సమావేశ మందిరంలో విడుదల చేశారు. ఈ కార్యక్రమంలో రెక్టార్ ఆచార్య పీ.కింగ్, రిజిస్ట్రార్ ఆచార్య కె.రాంబాబు , దుర్గాబాయి దేశ్ముఖ్ సెంటర్ ఫర్ ఉమెన్ స్టడీస్ సంచాలకులు ఆచార్య పల్లవి మరియు ఆంధ్ర విశ్వవిద్యాలయ ప్రాంగణ కళాశాలల ప్రిన్సిపాల్స్, పలువురు డీన్లు, ఆచార్యులు తదితరులు పాల్గొన్నారు.

Comments
Post a Comment