Skip to main content

ఆంధ్ర విశ్వవిద్యాలయం శతాబ్ది ఉత్సవాల్లో భాగంగా డా. దుర్గాబాయి దేశ ముఖ్ సెంటర్ ఫర్ ఉమెన్స్ ఆధ్వర్యంలో ఈనెల 24వ తేదీన 'వనిత వేవ్ @100' ది శతాబ్ది వాక్ కార్యక్రమం నిర్వహించనున్నారు

                    K.V.SHARMA EDITOR 


ఆంధ్ర విశ్వవిద్యాలయం శతాబ్ది ఉత్సవాల్లో భాగంగా  డా. దుర్గాబాయి దేశ ముఖ్ సెంటర్ ఫర్ ఉమెన్స్ ఆధ్వర్యంలో ఈనెల 24వ తేదీన 'వనిత వేవ్ @100' ది శతాబ్ది వాక్  కార్యక్రమం నిర్వహించనున్నారు. ఈ కార్యక్రమం బీచ్ రోడ్ నందు గల కాళీమాత మందిరం నుండి   ఉదయం 6.30 గంటలకు ప్రారంభం కానుంది. ఈ కార్యక్రమానికి సంబంధించిన పోస్టర్ ను ఆంధ్ర విశ్వవిద్యాలయం ఉపకులపతి ఆచార్య జి.పి రాజశేఖర్ నేడు ఈసీ సమావేశ మందిరంలో విడుదల చేశారు. ఈ కార్యక్రమంలో రెక్టార్ ఆచార్య పీ.కింగ్, రిజిస్ట్రార్ ఆచార్య  కె.రాంబాబు , దుర్గాబాయి దేశ్ముఖ్ సెంటర్ ఫర్ ఉమెన్ స్టడీస్ సంచాలకులు ఆచార్య పల్లవి మరియు ఆంధ్ర విశ్వవిద్యాలయ ప్రాంగణ కళాశాలల ప్రిన్సిపాల్స్, పలువురు డీన్లు, ఆచార్యులు తదితరులు పాల్గొన్నారు.

Comments

Popular posts from this blog

ప్రాణాలను కాపాడే సేవలో ఉక్కు సంకల్పం – RINL , విశాఖ ఉక్కు కర్మాగారం మాజీ జనరల్ మేనేజర్(VRS) శ్రీ జేవీవీఎస్ శర్మ 39 వ సారి అరుదైన ఓ- నెగటివ్ రక్తదానం*

భగవాన్ శ్రీ సత్య సాయి బాబా వారి దివ్య కృపతో, RINL,   విశాఖ ఉక్కు కర్మాగారం లో  థర్మల్ పవర్ ప్లాంట్‌లో జనరల్ మేనేజర్ (ప్రాజెక్ట్స్)గా పనిచేసి వాలంటరీ రిటైర్మెంట్ (VRS) తీసుకున్న శ్రీ జేవీవీఎస్ శర్మ గారు మరోసారి తన సేవా భావాన్ని చాటుకున్నారు. మెడికవర్ హాస్పిటల్‌లో హృదయ శస్త్రచికిత్స పొందవలసిన ఒక వ్యక్తికి  అరుదైన O-నెగటివ్ రక్తాన్ని దానం చేసి ప్రాణరక్షణలో భాగస్వాములయ్యారు. శ్రీ శర్మ గారు సేవా స్పూర్తి, మానవతా విలువలకు ప్రతీకగా నిలుస్తున్నారు. వీఆర్‌ఎస్ అనంతరం కూడా అవసరమైన వారికి సహాయం చేస్తూ సమాజానికి ఆదర్శంగా నిలుస్తున్నారు. ఇది ఆయన చేసిన 39వ రక్తదానం కావడం విశేషం. ప్రతి మూడు నెలలకు ఒకసారి రక్తదానం చేస్తూ, ఇతరులకు కూడా స్ఫూర్తినిస్తున్నారు. శ్రీ సత్య సాయి సాయి కుటుంబ సభ్యులు మరియు విశాఖ ఉక్కు కర్మాగారం సహచరులు ఆయన ఈ మహత్తర సేవను అభినందిస్తూ, శ్రీ శర్మ గారు, వారి సతీమణి మరియు పిల్లలపై భగవాన్ ఆశీస్సులు ఎల్లప్పుడూ ఉండాలని ప్రార్థించారు. సమాజ సేవలో మరింత ముందుకు సాగేందుకు ఆయనకు ఆరోగ్యం, ఆనందం, ఐశ్వర్యం కలగాలని ఆకాంక్షించారు.