Skip to main content

సింహగిరిపై చందనోత్సవం ఏర్పాట్లు పరిశీలించిన హోం మంత్రి అనిత* *పార్కింగ్, తాగునీరు, వైద్య సదుపాయాలపై ప్రత్యేక దృష్టి పెట్టాలి* *ఎన్‌డిఆర్ఎఫ్, ఎస్‌డిఆర్ఎఫ్ బృందాలు ఆలయం వద్ద సిద్ధంగా ఉండాలి* *సీసీటీవీ కెమెరాల ద్వారా కమాండ్ కంట్రోల్ రూమ్ నుంచి నిరంతర పర్యవేక్షణ* *ఈ సంవత్సరం దాదాపు 2 లక్షల మంది భక్తులు వస్తారని అంచనా* *సామాన్య భక్తుల దర్శనాలకు ప్రాధాన్యత ఇస్తున్నాం*..*హోం మంత్రి అనిత*.


సింహాచలం, ఏప్రిల్ 13:- ఆంధ్రప్రదేశ్ హోం మంత్రి వంగలపూడి అనిత, ప్రముఖ పుణ్యక్షేత్రం సింహాచలం శ్రీ వరాహ లక్ష్మీ నరసింహ స్వామి వారిని సోమవారం దర్శించుకున్నారు. ఆలయానికి విచ్చేసిన మంత్రికి అధికారులు ఆలయ మర్యాదలతో ఘన స్వాగతం పలికారు. స్వామివారి దర్శనం అనంతరం ఆమెకు వేద పండితులు ఆశీర్వచనం అందించారు. ఈ నెల 20న జరగనున్న స్వామివారి చందనోత్సవాన్ని పురస్కరించుకుని సింహగిరిపై జరుగుతున్న ఏర్పాట్లను మంత్రి సమీక్షించారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అన్ని మౌలిక వసతులు కల్పించాలని అధికారులకు పలు సూచనలు చేశారు. ముఖ్యంగా పార్కింగ్, తాగునీరు, వైద్య సదుపాయాలపై ప్రత్యేక దృష్టి పెట్టాలని ఆదేశించారు. చందనోత్సవం సందర్భంగా భారీగా భక్తులు రానున్న నేపథ్యంలో ట్రాఫిక్ సమస్యలు తలెత్తకుండా పోలీసులు అప్రమత్తంగా ఉండాలని మంత్రి సూచించారు. అదేవిధంగా ఎన్‌డిఆర్ఎఫ్, ఎస్‌డిఆర్ఎఫ్ బృందాలను ఆలయం వద్ద సిద్ధంగా ఉంచాలని ఆదేశించారు. 


సీసీటీవీ కెమెరాల ద్వారా కమాండ్ కంట్రోల్ రూమ్ నుంచి నిరంతర పర్యవేక్షణ నిర్వహించడంతో పాటు, ఆధునిక ఏఐ టెక్నాలజీని వినియోగించాలన్నారు.భక్తులకు ఓఆర్‌ఎస్ ప్యాకెట్లు విస్తృతంగా పంపిణీ చేయాలని సూచించారు. ఈ ఏర్పాట్లు పరిశీలనలో విశాఖ నగర పోలీస్ కమిషనర్ శంక బ్రత బాగ్చి, జాయింట్ కలెక్టర్ విద్యాధరి, సింహాచలం ఆలయ ఈవో వెంకటరావు తదితరులు పాల్గొన్నారు. 


ఈ సందర్భంగా మంత్రి వంగలపూడి అనిత మాట్లాడుతూ, చందనోత్సవం ఒక అపురూపమైన ఘట్టమన్నారు. రాష్ట్రవ్యాప్తంగా భక్తులు స్వామివారి నిజరూప దర్శనం కోసం వస్తారని చెప్పారు. గత సంవత్సరం సుమారు 1.20 లక్షల మంది భక్తులు హాజరయ్యారని, ఈసారి దాదాపు 2 లక్షల మంది భక్తులు రానున్నారని అంచనా వేస్తున్నాం అని తెలిపారు. సామాన్య భక్తుల దర్శనాలకు ప్రాధాన్యత ఇస్తున్నామన్నారు. తెల్లవారుజామున 3 గంటల నుంచి దర్శనాలు ప్రారంభమవుతాయని,అంతరాలయ దర్శనం ఉదయం 5 గంటల వరకు మాత్రమే ఉంటుందని పేర్కొన్నారు. భక్తుల సౌకర్యార్థం 10 ప్రాంతాల్లో మెడికల్ క్యాంపులు, తాగునీరు, మజ్జిగ వంటి సదుపాయాలు కల్పిస్తున్నాం అని మంత్రి వెల్లడించారు.

Comments

Popular posts from this blog

ప్రాణాలను కాపాడే సేవలో ఉక్కు సంకల్పం – RINL , విశాఖ ఉక్కు కర్మాగారం మాజీ జనరల్ మేనేజర్(VRS) శ్రీ జేవీవీఎస్ శర్మ 39 వ సారి అరుదైన ఓ- నెగటివ్ రక్తదానం*

భగవాన్ శ్రీ సత్య సాయి బాబా వారి దివ్య కృపతో, RINL,   విశాఖ ఉక్కు కర్మాగారం లో  థర్మల్ పవర్ ప్లాంట్‌లో జనరల్ మేనేజర్ (ప్రాజెక్ట్స్)గా పనిచేసి వాలంటరీ రిటైర్మెంట్ (VRS) తీసుకున్న శ్రీ జేవీవీఎస్ శర్మ గారు మరోసారి తన సేవా భావాన్ని చాటుకున్నారు. మెడికవర్ హాస్పిటల్‌లో హృదయ శస్త్రచికిత్స పొందవలసిన ఒక వ్యక్తికి  అరుదైన O-నెగటివ్ రక్తాన్ని దానం చేసి ప్రాణరక్షణలో భాగస్వాములయ్యారు. శ్రీ శర్మ గారు సేవా స్పూర్తి, మానవతా విలువలకు ప్రతీకగా నిలుస్తున్నారు. వీఆర్‌ఎస్ అనంతరం కూడా అవసరమైన వారికి సహాయం చేస్తూ సమాజానికి ఆదర్శంగా నిలుస్తున్నారు. ఇది ఆయన చేసిన 39వ రక్తదానం కావడం విశేషం. ప్రతి మూడు నెలలకు ఒకసారి రక్తదానం చేస్తూ, ఇతరులకు కూడా స్ఫూర్తినిస్తున్నారు. శ్రీ సత్య సాయి సాయి కుటుంబ సభ్యులు మరియు విశాఖ ఉక్కు కర్మాగారం సహచరులు ఆయన ఈ మహత్తర సేవను అభినందిస్తూ, శ్రీ శర్మ గారు, వారి సతీమణి మరియు పిల్లలపై భగవాన్ ఆశీస్సులు ఎల్లప్పుడూ ఉండాలని ప్రార్థించారు. సమాజ సేవలో మరింత ముందుకు సాగేందుకు ఆయనకు ఆరోగ్యం, ఆనందం, ఐశ్వర్యం కలగాలని ఆకాంక్షించారు.