*శ్రీ సత్య సాయి విద్యా విహార్* సెక్టార్-8, ఎం.వి.పి కాలనీ, విశాఖపట్నం తేదీ: 16, April, 2026 *2026 ‘ఆల్ ఇండియా సెకండరీ స్కూల్ ఎగ్జామినేషన్’ పదవ తరగతి ఫలితాల్లో మరోసారి 100% ఉత్తీర్ణత ఫలితాలతో ప్రతిభ చాటిన శ్రీ సత్య సాయి విద్యా విహార్ విద్యార్థులు*
భగవాన్ శ్రీ సత్య సాయి బాబా వారి దివ్య అనుగ్రహంతో, ఈ ఏడాది(2026) కూడా అఖిల భారత స్థాయి ఆల్ ఇండియా సెకండరీ స్కూల్ ఎగ్జామినేషన్’ పదవ తరగతి పరీక్షా ఫలితాల్లో (2025–26 విద్యా సంవత్సరానికిగాను) శ్రీ సత్య సాయి విద్యా విహార్, విశాఖపట్నం విద్యార్థులు అత్యుత్తమ ఫలితాలు సాధించి 100% విజయం సాధించిన విషయాన్నిమీకు ఆనందంగా తెలియజేస్తున్నాం.
ఈ పరీక్షలకుశ్రీ సత్య సాయి విద్యా విహార్ నుండి హాజరైన *మొత్తం200 మంది విద్యార్థులూ (నూటికి నూరు శాతం ఉత్తీర్ణతతో ) ఉత్తీర్ణులయ్యారు . ఇందులో 36 మంది విద్యార్థులు 90% పైగా మార్కులు సాధించగా , 125 మంది విద్యార్థులు డిస్టింక్షన్ (అంటే 75%కి పైగా మార్కులు) సాధించగా, 194 మంది విద్యార్థులు ప్రథమ శ్రేణిలో ఉత్తీర్ణులయ్యారు*.
పాఠశాల సగటు మార్కు శాతం 78.09 % గా నమోదు అయింది.
ఈ పరీక్షా ఫలితాల్లో
🎖️ *కుమారి ఆర్ జాస్మిత 97.5% మార్కులతో పాఠశాలలో ప్రథమ స్థానం సాధించగా , కుమారి ఐ నిషిత 96.5% మార్కులతో ద్వితీయ స్థానం సాధించగా, ముగ్గురు విద్యార్థులు మాస్టర్ ఎం లలిత్ ఆదిత్య , మాస్టర్ డి హేమ చంద్ర రాజు మరియు కుమారి ఆర్ ఎన్ సాయి దిత్య 95.8 % మార్కులతో తృతీయ స్థానం సాధించారు*.
ఇక సబ్జెక్టుల వారీగా కూడా విద్యార్థులు విశిష్ట ప్రతిభ కనబరిచారు. *ఇద్దరు విద్యార్థులు కుమారి ఆర్ యెన్ సాయి దిత్య , కుమారి అమోలి పాండే ఇంగ్లీష్లో, కుమారి ఐ నిశిత తెలుగులో, కుమారి ఆర్ యెన్ సాయి దిత్య ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్లో తలో 100%(నూటికి నూరు మార్కులు) మార్కులు సాధించగా*,సోషల్ సైన్స్లో 3 ముగ్గురు 99% మార్కులు సాధించగా, సంస్కృతంలో ఇద్దరువిద్యార్థులు మరియు సైన్స్లో ఇద్దరువిద్యార్థులు 98 %మార్కులు పొందారు. ఇది కాకుండా ,
, హిందీలో 1 విద్యార్థి 96% మార్కులు, గణితంలో 4 గురు విద్యార్థులు 95% మార్కులు సాధించి తమ ప్రతిభను చాటుకున్నారు.
ఈ అపూర్వ విజయం సాధించినందుకు , *శ్రీ సత్య సాయి విద్యా విహార్ కన్వీనర్ మరియు ప్రశాంతినిలయం శ్రీ సత్య సాయి సెంట్రల్ ట్రస్ట్ అడ్మిన్ కోఆర్డినేటర్ శ్రీ ఎస్.జి. చలం, ప్రిన్సిపాల్ శ్రీమతి చేకూరి వరలక్ష్మి* , మరియు గవర్నింగ్ బాడీ సభ్యులు విద్యార్థులను, అధ్యాపక సిబ్బందిని హృదయపూర్వకంగా అభినందించి, విద్యార్థులందరికీ మెరుగైన ఉజ్వల భవిష్యత్తు కలగాలని ఆకాంక్షిస్తూ శుభాకాంక్షలు తెలియచేసారు.
శ్రీ సత్య సాయి విద్యా విహార్ స్కూలు టాప్పర్(1st రాంక్ ) - కుమారి ఆర్ జాస్మిత
శ్రీ సత్య సాయి విద్యా విహార్ స్కూలు సెకండ్ టాప్పర్- కుమారి ఐ నిషిత
శ్రీ సత్య సాయి విద్యా విహార్ స్కూలు సంయుక్త థర్డ్ టాప్పర్లు - మాస్టర్ ఎం లలిత్ ఆదిత్య , మాస్టర్ డి హేమ చంద్ర రాజు మరియు కుమారి ఆర్ ఎన్ సాయి దిత్య
K.V.SHARMA. EDITOR





Comments
Post a Comment