Skip to main content

జేఈఈ మెయిన్స్‌ ఫలితాల్లో 99.57 పర్సంటైల్ తో సత్తా చాటిన భోగవిల్లి నిష్మిత్


 జాతీయ స్థాయిలో ప్రతిష్ఠాత్మకమైన జేఈఈ మెయిన్‌ ఫలితాల్లో విశాఖ విద్యార్థులు అద్భుత ప్రదర్శనతో ప్రభంజనం సృష్టించారు.ఈడబ్ల్యుఎస్  విభాగంలో  భోగవిల్లి నిష్మిత్  99.57 పర్సంటైల్ తో సత్తా చాటారు. ఆల్ ఇండియా ర్యాంకు 6881 ర్యాంకు, క్యాటగిరి ర్యాంకు 818 తో జయకేతనం ఎగురవేశారు.ఈ సందర్భంగా నిష్మిత్ మాట్లాడుతూ  ప్రస్తుతం జేఈఈ అడ్వాన్స్ పరీక్షకు ప్రిపేర్ అవుతున్నానని తెలిపారు,మంచి ఐఐటీలో సీటు సంపాందించాలన్నదే తన లక్ష్యమని తెలిపారు. కళాశాల ఫ్యాకల్టీ, తల్లిదండ్రుల ప్రోత్సాహంతోనే మంచి ర్యాంకు సాధించగలిగానని తెలిపారు. భవిష్యత్లో మంచి కంప్యూటర్ ఇంజనీర్ కావాలని తెలిపారు. తన తండ్రి రాజేష్ మెడికల్ అండ్ హెల్త్ డిపార్ట్మెంట్ లో విధులు నిర్వహిస్తున్నారని, అమ్మ శ్రీఅనిత జర్నలిస్టుగా పనిచేస్తున్నట్లు నిష్మిత్ తెలిపారు.

Comments

Popular posts from this blog

ప్రాణాలను కాపాడే సేవలో ఉక్కు సంకల్పం – RINL , విశాఖ ఉక్కు కర్మాగారం మాజీ జనరల్ మేనేజర్(VRS) శ్రీ జేవీవీఎస్ శర్మ 39 వ సారి అరుదైన ఓ- నెగటివ్ రక్తదానం*

భగవాన్ శ్రీ సత్య సాయి బాబా వారి దివ్య కృపతో, RINL,   విశాఖ ఉక్కు కర్మాగారం లో  థర్మల్ పవర్ ప్లాంట్‌లో జనరల్ మేనేజర్ (ప్రాజెక్ట్స్)గా పనిచేసి వాలంటరీ రిటైర్మెంట్ (VRS) తీసుకున్న శ్రీ జేవీవీఎస్ శర్మ గారు మరోసారి తన సేవా భావాన్ని చాటుకున్నారు. మెడికవర్ హాస్పిటల్‌లో హృదయ శస్త్రచికిత్స పొందవలసిన ఒక వ్యక్తికి  అరుదైన O-నెగటివ్ రక్తాన్ని దానం చేసి ప్రాణరక్షణలో భాగస్వాములయ్యారు. శ్రీ శర్మ గారు సేవా స్పూర్తి, మానవతా విలువలకు ప్రతీకగా నిలుస్తున్నారు. వీఆర్‌ఎస్ అనంతరం కూడా అవసరమైన వారికి సహాయం చేస్తూ సమాజానికి ఆదర్శంగా నిలుస్తున్నారు. ఇది ఆయన చేసిన 39వ రక్తదానం కావడం విశేషం. ప్రతి మూడు నెలలకు ఒకసారి రక్తదానం చేస్తూ, ఇతరులకు కూడా స్ఫూర్తినిస్తున్నారు. శ్రీ సత్య సాయి సాయి కుటుంబ సభ్యులు మరియు విశాఖ ఉక్కు కర్మాగారం సహచరులు ఆయన ఈ మహత్తర సేవను అభినందిస్తూ, శ్రీ శర్మ గారు, వారి సతీమణి మరియు పిల్లలపై భగవాన్ ఆశీస్సులు ఎల్లప్పుడూ ఉండాలని ప్రార్థించారు. సమాజ సేవలో మరింత ముందుకు సాగేందుకు ఆయనకు ఆరోగ్యం, ఆనందం, ఐశ్వర్యం కలగాలని ఆకాంక్షించారు.