భారతీయ జనతా పార్టీ విశాఖపట్నం జిల్లా అధ్యక్షులు ఎం.ఎం.ఎన్. పరశురామరాజు విజయవాడ క్యాంప్ కార్యాలయంలో గౌరవనీయులైన ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ని మర్యాదపూర్వకంగా కలిశారు.
ఈ సందర్భంగా, అమరావతి రాజధానికి లోక్సభ మరియు రాజ్యసభలలో ఆమోదం లభించడం పట్ల హర్షం వ్యక్తం చేస్తూ, ఇది రాష్ట్ర ప్రజలందరికీ గర్వకారణమని మరియు ఆనందదాయకమని పేర్కొన్నారు.
రాష్ట్ర ప్రజలందరి తరపున ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కి హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేశారు.
అమరావతి నిర్మాణానికి పూర్తి మద్దతు ప్రకటించిన కేంద్ర ప్రభుత్వానికి మరియు గౌరవ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ కి ఈ సందర్భంగా పరశురామరాజు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు.
అమరావతి నగరం చెంది, దేశంలోనే ఒక ఆదర్శవంతమైన రాజధానిగా నిలవాలని వారు ఈ సందర్భంగా ఆశాభావం వ్యక్తం చేశారు.

Comments
Post a Comment