Skip to main content

అంబేద్కర్ ఆశయ సాధనకు అందరూ కృషి చేయాలి.... అల్లవరంలో ఘనంగా అంబేద్కర్ జయంతి వేడుకలు......

.                Srinivas Spl Correspondant 
 అల్లవరం, విశాఖ సందేసం...భారత రాజ్యాంగ నిర్మాత, భారతరత్న డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ 135 వ జయంతి సందర్భంగా అల్లవరం మండలం మొగళ్లమూరు, సిరిగట్లపల్లి గ్రామాలలోని అంబేద్కర్ విగ్రహాలకు మంగళవారం అమలాపురం మాజీ పార్లమెంట్ సభ్యులు చింతా అనురాధ, ఎంపీపీ ఇళ్ల శేషగిరిరావు   పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. 


ఈ సందర్భంగా అనురాధ మాట్లాడుతూ అణగారిన వర్గాల ఆశాజ్యోతి అంబేద్కర్ అని, ఆయన ఆశయాలను ప్రతి ఒక్కరు గౌరవించాలనిఅన్నారు. అంబేద్కర్ రచించిన రాజ్యాంగం వల్ల అన్ని వర్గాల వారికి విద్యా, ఉద్యోగ, రాజకీయ ఫలాలు అందుతున్నాయని, అంబేద్కర్ ఆశయాలను నేటి యువత ఆదర్శంగా తీసుకోవాలన్నారు. ఎంపీపీ శేషగిరిరావు ఆధ్వర్యంలో మండల పరిషత్ కార్యాలయం నందు, అల్లవరం సామజిక ఆరోగ్య కేంద్రంలో సూపరింటెండెంట్ డాక్టర్ ఎన్ రాకేష్ ఆధ్వర్యంలో ప్రపంచ మేధావి డాక్టర్ బి ఆర్ అంబెడ్కర్  135 వ జయంతి వేడుకలు నిర్వహించారు.


 ఈ వేడుకలకు ముఖ్యఅతిధిగా అల్లవరం సబ్ ఇన్స్పెక్టర్ సంపత్ కుమార్ హాజరై  డాక్టర్ బి ఆర్ అంబెడ్కర్  చిత్ర పటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. జిత్తుక సత్యనారాయణ,జల్లి దొరబాబు హాస్పటల్ కు అంబెడ్కర్ చిత్రపటాన్ని బహుకరించారు.


 ఈ కార్యక్రమంలో కాశీ చిరంజీవి, మద్దా వినోద్ రావు, చింతాభాస్కరరావు , కోరుకొండ చిట్టిబాబు,గూటం సత్యనారాయణ ,రొక్కల చిన్ని,రాయడు విష్ణు ,చింతా గణేష్ ,చింతా ప్రసాద్, గోగు కామేష్ ,కటారి రతన్ రాజు,సాపే సారధి,  పోలమూరు వినోద్ హాస్పిటల్ స్టాఫ్,పలువురు పాల్గున్నారు.

Comments

Popular posts from this blog

ప్రాణాలను కాపాడే సేవలో ఉక్కు సంకల్పం – RINL , విశాఖ ఉక్కు కర్మాగారం మాజీ జనరల్ మేనేజర్(VRS) శ్రీ జేవీవీఎస్ శర్మ 39 వ సారి అరుదైన ఓ- నెగటివ్ రక్తదానం*

భగవాన్ శ్రీ సత్య సాయి బాబా వారి దివ్య కృపతో, RINL,   విశాఖ ఉక్కు కర్మాగారం లో  థర్మల్ పవర్ ప్లాంట్‌లో జనరల్ మేనేజర్ (ప్రాజెక్ట్స్)గా పనిచేసి వాలంటరీ రిటైర్మెంట్ (VRS) తీసుకున్న శ్రీ జేవీవీఎస్ శర్మ గారు మరోసారి తన సేవా భావాన్ని చాటుకున్నారు. మెడికవర్ హాస్పిటల్‌లో హృదయ శస్త్రచికిత్స పొందవలసిన ఒక వ్యక్తికి  అరుదైన O-నెగటివ్ రక్తాన్ని దానం చేసి ప్రాణరక్షణలో భాగస్వాములయ్యారు. శ్రీ శర్మ గారు సేవా స్పూర్తి, మానవతా విలువలకు ప్రతీకగా నిలుస్తున్నారు. వీఆర్‌ఎస్ అనంతరం కూడా అవసరమైన వారికి సహాయం చేస్తూ సమాజానికి ఆదర్శంగా నిలుస్తున్నారు. ఇది ఆయన చేసిన 39వ రక్తదానం కావడం విశేషం. ప్రతి మూడు నెలలకు ఒకసారి రక్తదానం చేస్తూ, ఇతరులకు కూడా స్ఫూర్తినిస్తున్నారు. శ్రీ సత్య సాయి సాయి కుటుంబ సభ్యులు మరియు విశాఖ ఉక్కు కర్మాగారం సహచరులు ఆయన ఈ మహత్తర సేవను అభినందిస్తూ, శ్రీ శర్మ గారు, వారి సతీమణి మరియు పిల్లలపై భగవాన్ ఆశీస్సులు ఎల్లప్పుడూ ఉండాలని ప్రార్థించారు. సమాజ సేవలో మరింత ముందుకు సాగేందుకు ఆయనకు ఆరోగ్యం, ఆనందం, ఐశ్వర్యం కలగాలని ఆకాంక్షించారు.