Srinivas Spl Correspondant
అమలాపురం, విశాఖ సందేసం....డా. బి.ఆర్. అంబేద్కర్ 135వ జయంతి వేడుకలను కిమ్స్ ఆసుపత్రిలో మంగళవారం ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో కిమ్స్ మేనేజింగ్ డైరెక్టర్ రవి కిరణ్ వర్మ మాట్లాడుతూ భారత రాజ్యాంగ రూపకర్తగా డా. అంబేద్కర్ దేశానికి చేసిన సేవను గుర్తుచేశారు.అంబేద్కర్ రచించిన రాజ్యాంగం వల్లే భారతదేశం వైవిధ్యంలో ఏకత్వాన్ని కాపాడుకుంటూ ముందుకు సాగుతోందని పేర్కొన్నారు. ప్రతి ఒక్కరూ ఆయనను స్ఫూర్తిగా తీసుకొని తమ తమ విధులను సక్రమంగా నిర్వహించిన నాడు మన దేశ పురోగతిలో భాగస్వాములం కాగలమన్నారు.ఈ సందర్భంగా కిమ్స్ వైస్ ప్రెసిడెంట్ మోహన రాజు మాట్లాడుతూ.
అంబేద్కర్ సమాజంలో సమానత్వం, న్యాయం, విద్య ప్రాముఖ్యతలను బలంగా ప్రతిపాదించిన మహనీయుడని అన్నారు. ఆయన ఆలోచనలు ప్రతి ఒక్కరికీ మార్గదర్శకమని తెలిపారు. ఈ కార్యక్రమంలో కిమ్స్ డీన్ డా.ఆనంద్ ఆచార్య, మెడికల్ డైరెక్టర్ డా.హరి కిరణ్ వర్మ , సి.ఏ.ఓ. రఘు, మానవ వనరుల జి.ఎం. రాధా మనోహర్ , విజిలెన్సు మరియు సెక్యూరిటీ జి.ఎం.కిరణ్ , కిమ్స్ వైద్యులు, వైద్య విద్యార్థులు మరియు సిబ్బంది పాల్గొని డా. అంబేద్కర్ చిత్రపటానికి పూలమాలలు అర్పించి నివాళులు అర్పించారు.


Comments
Post a Comment