Skip to main content

జర్నలిస్టులకు సంపూర్ణ సహకారం* *హెల్త్ ఇన్సూరెన్స్ ప్రీమియం చెల్లింపు పరిశీలిస్తా* *పెండింగ్ సమస్యలు సత్వరం పరిష్కరిస్తా* *ఏపీ వర్కింగ్ జర్నలిస్టుల ఫెడరేషన్ నేతలతో* *జిల్లా కలెక్టర్ అభిసిక్త్ కిషోర్*


విశాఖపట్నం ఏప్రిల్ 23  విశాఖ జిల్లాలో వర్కింగ్ జర్నలిస్టులకు తమ వంతు సంపూర్ణ సహకారం అందించడం జరుగుతుందని జిల్లా కలెక్టర్ అభిసిక్త్ కిషోర్ అన్నారు. గురువారము  ఏపీ వర్కింగ్ జర్నలిస్టుల ఫెడరేషన్.. బ్రాడ్ కాస్ట్.. స్మాల్ అండ్ మీడియం న్యూస్ పేపర్స్ అసోసియేషన్లకు చెందిన పలువురు జర్నలిస్టు నేతలు జిల్లా కలెక్టర్ ను ఆయన చాంబర్ లో మర్యాదపూర్వకంగా కలుసుకున్నారు.. ఈ సందర్భంగా జాతీయ జర్నలిస్టుల సంఘం కార్యదర్శి ఎన్ఏజే ..ఏపీ వర్కింగ్ జర్నలిస్టుల ఫెడరేషన్ రాష్ట్ర నాయకులు గంట్ల శ్రీనుబాబు విశాఖ జిల్లా అధ్యక్షులు 


పి నారాయణ లు జర్నలిస్టులకు సంబంధించిన  పలు అంశాలను జిల్లా కలెక్టర్ కు విపులంగా వివరించారు.... జిల్లాలో జర్నలిస్టులందరికీ హెల్త్ ఇన్సూరెన్స్ ప్రీమియం  సి ఎస్ ఆర్ నిధులతో జిల్లా అధికార యంత్రాంగం ద్వారా చెల్లించాలని..


కోరారు.. గతంలో కూడా పలువురు కలెక్టర్లు  ఈ విధంగానే  చెల్లించారని వీరు తెలియజేశారు.. ఇందులో.. వెటరన్ జర్నలిస్టులను కూడా పరిగణలోకి తీసుకోవాలని వీరు కోరారు.. ఈ విషయంపై కలెక్టర్ సానుకూలంగా స్పందించినట్లు గంట్ల శ్రీను బాబు నారాయణలు తెలిపారు.. అలాగే పెండింగ్ అక్రిడేషన్లు.. ఇతర అంశాలను కూడా పరిగణలోకి తీసుకోవాలని తాము కోరడం జరిగిందన్నారు.. జర్నలిస్టుల అన్ని 


పెండింగ్  సమస్యలను తెలుసుకుని దశలవారీగా పరిష్కరిస్తామని కలెక్టర్ హామీ ఇవ్వడం జరిగింది అని వీరు చెప్పారు.. ఈ సందర్భంగా గంట్ల శ్రీనుబాబు .. జర్నలిస్టు నేతలు కలెక్టర్ కు సింహాద్రి నాథుడి జ్ఞాపిక అందించి ఘనంగా సత్కరించారు.. 


అలాగే ఏపీ వర్కింగ్ జర్నలిస్టులు ఫెడరేషన్ రాష్ట్ర డైరీ ని జిల్లా అధ్యక్షులు నారాయణ కలెక్టర్ కు అందజేశారు

ఈ కార్యక్రమంలో బ్రాడ్ కాస్ట్ అధ్యక్షులు ఇరోతి ఈశ్వరరావు 

కార్యదర్శి కింతాడ మదన్.. చిన్న 

మధ్యతరహా పత్రికల సంఘం అధ్యక్షులు జగన్మోహన్... బొబ్బర ప్రసాద్. ఫెడరేషన్.. ఉపాధ్యక్షులు.. ఎన్. రామక్రిష్ణ.. పి..నగేష్ బాబు తదితరులు పాల్గొన్నారు..

                 K.V.SHARMA EDITOR 

Comments

Popular posts from this blog

ప్రాణాలను కాపాడే సేవలో ఉక్కు సంకల్పం – RINL , విశాఖ ఉక్కు కర్మాగారం మాజీ జనరల్ మేనేజర్(VRS) శ్రీ జేవీవీఎస్ శర్మ 39 వ సారి అరుదైన ఓ- నెగటివ్ రక్తదానం*

భగవాన్ శ్రీ సత్య సాయి బాబా వారి దివ్య కృపతో, RINL,   విశాఖ ఉక్కు కర్మాగారం లో  థర్మల్ పవర్ ప్లాంట్‌లో జనరల్ మేనేజర్ (ప్రాజెక్ట్స్)గా పనిచేసి వాలంటరీ రిటైర్మెంట్ (VRS) తీసుకున్న శ్రీ జేవీవీఎస్ శర్మ గారు మరోసారి తన సేవా భావాన్ని చాటుకున్నారు. మెడికవర్ హాస్పిటల్‌లో హృదయ శస్త్రచికిత్స పొందవలసిన ఒక వ్యక్తికి  అరుదైన O-నెగటివ్ రక్తాన్ని దానం చేసి ప్రాణరక్షణలో భాగస్వాములయ్యారు. శ్రీ శర్మ గారు సేవా స్పూర్తి, మానవతా విలువలకు ప్రతీకగా నిలుస్తున్నారు. వీఆర్‌ఎస్ అనంతరం కూడా అవసరమైన వారికి సహాయం చేస్తూ సమాజానికి ఆదర్శంగా నిలుస్తున్నారు. ఇది ఆయన చేసిన 39వ రక్తదానం కావడం విశేషం. ప్రతి మూడు నెలలకు ఒకసారి రక్తదానం చేస్తూ, ఇతరులకు కూడా స్ఫూర్తినిస్తున్నారు. శ్రీ సత్య సాయి సాయి కుటుంబ సభ్యులు మరియు విశాఖ ఉక్కు కర్మాగారం సహచరులు ఆయన ఈ మహత్తర సేవను అభినందిస్తూ, శ్రీ శర్మ గారు, వారి సతీమణి మరియు పిల్లలపై భగవాన్ ఆశీస్సులు ఎల్లప్పుడూ ఉండాలని ప్రార్థించారు. సమాజ సేవలో మరింత ముందుకు సాగేందుకు ఆయనకు ఆరోగ్యం, ఆనందం, ఐశ్వర్యం కలగాలని ఆకాంక్షించారు.