ముడసర్లోవలో పాత స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ భవనాన్ని పరిశీలించిన జీవీఎంసీ కమిషనర్ . * భవనం అభివృద్ధి దిశగా ఆదాయ మార్గాలను అన్వేషించండి. -జీవీఎంసీ కమిషనర్ కేతన్ గార్గ్.
విశాఖపట్నం ,ఏప్రిల్ 22: విశాఖ నగరం లోగల ముడసర్లోవ సమీపంలో గల పాత స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ భవనాన్ని అభివృద్ధిపరిచి జీవీఎంసీ కి ఆదాయ మార్గాలను అన్వేషించాలని అదనపు కమిషనర్ ఎస్ఎస్ వర్మకు, ప్రధాన ఇంజనీర్ పీవీ సత్యనారాయణ రాజు , ఈస్ట్ జోన్ జోనల్ కమిషనర్ శివప్రసాదు లకు కమిషనర్ ఆదేశించారు. బుధవారం ఆయనముడసర్లోవ సమీపంలో గల పాత స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ భవనాన్ని , పరిసరాలను క్షుణంగా పరిశీలించారు
ఈ పరిశీలనలో కమిషనర్ మాట్లాడుతూ జీవీఎంసీ కి అతిపెద్ద ఆస్తిగా పాత స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ ప్రదేశం ఉందని, ఆ భవనాన్ని అభివృద్ధి పరిచి జీవీఎంసీ కి ఆదాయ మార్గంగా చేకూరేలా చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు. ఆ ప్రాంతమంతా కలియతిరిగి భవనం యొక్క పూర్తి వివరాలను , విస్తీర్ణం, భవనాల కొలతలు, ఇదివరకు నెలకు అద్దె రూపంలో ఎంత ఆదాయం జీవీఎంసీ కి సమకూరిందని జోనల్ కమిషనర్ కె. శివ ప్రసాద్ ను అడిగి తెలుసుకుని , భవనంలో,భవనం చుట్టూ వ్యర్ధాలు, తుప్పలు పేరుకుపోయి ఉన్నందున వెంటనే వాటిని తొలగించే కార్యక్రమం చేపట్టాలన్నారు.
ఆ భవనాలలో నీటి సరఫరా, ఎలక్ట్రిసిటీ ,సివరేజ్, శానిటేషన్, టాయిలెట్స్ తదితర మౌలిక సదుపాయాల పై కమిషనర్ అడిగి తెలుసుకున్నారు. 33 వేల చదరపు అడుగులు గల భవనాలను అద్దెకు ఇవ్వడం ద్వారా జీవీఎంసీ కి ఆర్థిక లబ్ధి చేకూరుతుందని ఆ దిశగా పరిశ్రమలకు గాని, ఐటీ, కార్పొరేట్ సంస్థలకు గాని అద్దెకు ఇచ్చేదా రిక్వెస్ట్ ఫర్ ప్రపోజల్ కొరకు ఆసక్తిదారులను ఆహ్వానించేందుకు తగిన చర్యలు చేపట్టాలని అదనపు కమిషనర్ వర్మకు, ప్రధాన ఇంజనీర్ కు, జోనల్ కమిషనర్ కే శివప్రసాద్ కు కమిషనర్ ఆదేశించారు. అలాగే ఆ ప్రాంగణంలో ఏ ఏ కార్యాలయాలు నిర్వహిస్తే జీవీఎంసీకి లాభదాయకంగా ఉంటుందని తగు సూచనలను అందించవలసిందిగా వారికి కమిషనర్ తెలిపారు.
ఈ కార్యక్రమంలో పర్యవేక్షక ఇంజనీర్ శాంతిరాజ్, కార్యనిర్వాహక ఇంజనీర్ గంగాధర్, రెవెన్యూ అధికారి ఏ అప్పలరాజు, వార్డు కార్యదర్శులు తదితరులు పాల్గొన్నారు.
పౌర సంబంధాల అధికారి ,జీవీఎంసీ
K.V.SHARMA EDITOR
.jpeg)
.jpeg)
.jpeg)
.jpeg)
Comments
Post a Comment