Skip to main content

డిప్యూటీ ఎంపీడీవోగా పదోన్నతి పొందిన సూరపరాజుకు ఘనంగా సన్మానం..


 అమలాపురం:విశాఖ సందేసం:అమలాపురం రూరల్ మండలం కామనగరువు పంచాయతీ కార్యదర్శిగా విధులు నిర్వహిస్తూ  పదోన్నతి పై డిప్యూటీ ఎంపీడీవో అయిన రుద్రరాజు ఎస్ఎస్ సూరపరాజును కామానగరువు ఇంచార్జ్ కార్యదర్శి బి. ఆదినారాయణ ఆధ్వర్యంలో శనివారం  ఘనంగా సత్కరించారు. కామనగరువు పంచాయితీ కార్యాలయం నందు  నిర్వహించిన సన్మాన కార్యక్రమానికి  డి.ఎల్.పి.ఓ  పి.బొజ్జరాజు  ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు. పంచాయతీ విభాగంలో పలు శాఖలలో పనిచేసిన సూరపరాజు చేసిన సేవలను  పలువురు  వక్తలు కొనియాడారు. ఇటీవల పదోన్నతిలో భాగంగా మలికిపురం డిప్యూటీ ఎంపీడీవోగా బాధ్యతలు స్వీకరించిన సూరపరాజు  ప్రజలకు  మరిన్ని  సేవలను అందించాలని ఆకాంక్షించారు. 

నిబద్ధతతో పని చేసి పదోన్నతి పొందిన సూరపరాజును పలువురు  పూలమాలలు వేసి పుష్పగుచ్చలను అందించి దుస్సాలువాలతో ఘనంగా  అభినందించారు. ఈ  కార్యక్రమంలో డిప్యూటీ ఎంపీడీవోలు,జిల్లా పంచాయతీ కార్యదర్శుల సంఘం ప్రతినిధులు శాస్త్రి, రెడ్డి శిరీష, కోడూరి వెంకటేశ్వరరావు, సుబ్బలక్ష్మి,  ఆదినారాయణ, పి శ్రీనివాస్, దారా రామకృష్ణ, అడబాల ఎస్వీఎస్ రాజేశ్వరరావు, కృష్ణ తదితరులు పాల్గొన్నారు...

               Srinivas Spl Correspondant 

Comments

Popular posts from this blog

ప్రాణాలను కాపాడే సేవలో ఉక్కు సంకల్పం – RINL , విశాఖ ఉక్కు కర్మాగారం మాజీ జనరల్ మేనేజర్(VRS) శ్రీ జేవీవీఎస్ శర్మ 39 వ సారి అరుదైన ఓ- నెగటివ్ రక్తదానం*

భగవాన్ శ్రీ సత్య సాయి బాబా వారి దివ్య కృపతో, RINL,   విశాఖ ఉక్కు కర్మాగారం లో  థర్మల్ పవర్ ప్లాంట్‌లో జనరల్ మేనేజర్ (ప్రాజెక్ట్స్)గా పనిచేసి వాలంటరీ రిటైర్మెంట్ (VRS) తీసుకున్న శ్రీ జేవీవీఎస్ శర్మ గారు మరోసారి తన సేవా భావాన్ని చాటుకున్నారు. మెడికవర్ హాస్పిటల్‌లో హృదయ శస్త్రచికిత్స పొందవలసిన ఒక వ్యక్తికి  అరుదైన O-నెగటివ్ రక్తాన్ని దానం చేసి ప్రాణరక్షణలో భాగస్వాములయ్యారు. శ్రీ శర్మ గారు సేవా స్పూర్తి, మానవతా విలువలకు ప్రతీకగా నిలుస్తున్నారు. వీఆర్‌ఎస్ అనంతరం కూడా అవసరమైన వారికి సహాయం చేస్తూ సమాజానికి ఆదర్శంగా నిలుస్తున్నారు. ఇది ఆయన చేసిన 39వ రక్తదానం కావడం విశేషం. ప్రతి మూడు నెలలకు ఒకసారి రక్తదానం చేస్తూ, ఇతరులకు కూడా స్ఫూర్తినిస్తున్నారు. శ్రీ సత్య సాయి సాయి కుటుంబ సభ్యులు మరియు విశాఖ ఉక్కు కర్మాగారం సహచరులు ఆయన ఈ మహత్తర సేవను అభినందిస్తూ, శ్రీ శర్మ గారు, వారి సతీమణి మరియు పిల్లలపై భగవాన్ ఆశీస్సులు ఎల్లప్పుడూ ఉండాలని ప్రార్థించారు. సమాజ సేవలో మరింత ముందుకు సాగేందుకు ఆయనకు ఆరోగ్యం, ఆనందం, ఐశ్వర్యం కలగాలని ఆకాంక్షించారు.