గ్రామాల అభివృద్ధికి అవంతి ఫౌండేషన్ కృషి : చైర్మన్ అల్లూరి ఇంద్రకుమార్ గోడిలంకలో సోలార్ లైట్లు ప్రారంభోత్సవం....
.
అవంతి ఫౌండేషన్ ఆధ్వర్యంలో గ్రామాలలో అభివృద్ధికి ఎల్లప్పుడూ కృషిచేస్తుందని అవంతి మేనేజింగ్ డైరెక్టర్ మరియు అవంతి ఫౌండేషన్ చైర్మన్ అల్లూరి ఇంద్రకుమార్ అన్నారు. గోడిలంక మాజీ సర్పంచ్ రుద్రరాజు పవిత్ర లక్ష్మిపతి రాజు పంచాయతీ కార్యదర్శి వై. ఎమ్ శ్రీనివాసరావు ఆధ్వర్యంలో సోలార్ లైట్ల ప్రారభోత్సవ కార్యక్రమం పంచాయతీ కార్యాలయం వద్ద బుధవారం ఘనంగా నిర్వహించారు.
ఈ కార్యక్రమానికి ముఖ్యతిధులుగా అవంతి మేనేజింగ్ డైరెక్టర్ మరియు అవంతి ఫౌండేషన్ చైర్మన్ అల్లూరి ఇంద్రకుమార్, రుద్రరాజు గోపాల కృష్ణరాజు (గోపిరాజు) లు పాల్గొని సోలార్ లైట్లను ప్రారంభించారు. చైర్మన్ ఇంద్రకుమార్ మాట్లాడుతూ గోడిలంక గ్రామంలో రూ. 12 లక్షలతో 54 సోలార్ లైట్లు ఏర్పాటు చేయడం జరిగిందని, గ్రామాలలో మౌళిక సదుపాయాలు కల్పనలో అవంతి ఫౌండేషన్ ముందుంటుందని అన్నారు.
అనంతరం ఇంద్రకుమార్, ఆర్.వి. ఎస్ ఎన్ రాజు, రుద్రరాజు బాబులను లక్ష్మిపతి రాజు, వేగిరాజు శ్రీనురాజు పుష్పగుచ్చాలు, వెంకటేశ్వర స్వామి చిత్రపటాలను అందజేసి దుస్సాలువాలతో ఘనంగా సత్కరించారు. గోడిలంక గ్రామం అభివృద్ధికి కృషిచేసిన మాజీ సర్పంచ్ రుద్రరాజు పవిత్ర లక్ష్మిపతి రాజుకు గ్రామస్తులు అభినందనలు తెలియజేశారు
. ఈ కార్యక్రమంలో ఆర్.వి. ఎస్ ఎన్ రాజు, రుద్రరాజు బాబు, రుద్రరాజు సురేష్ రాజు, రుద్రరాజు దత్తుడు రాజు, , నాతి శ్రీనివాసరావు, వాసర్ల బాబురావు, పంచాయతీ సిబ్బంది, గ్రామస్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.
Srinivas Spl Correspondant




Comments
Post a Comment