అంబేద్కర్ జయంతిని పురస్కరించుకొని 39 వ వార్డు, దక్షిణ నియోజకవర్గంలో వివేకానంద సంస్థ వారు అంబేద్కర్ జయంతి కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి వివేకానంద సంస్థ గౌరవ అధ్యక్షులు డాక్టర్.C.M.A. జహీర్ అహ్మద్, రౌండ్ టేబుల్ సంస్థ సభ్యులు మక్సుద్ అహ్మద్ అంబేద్కర్ చిత్రపటానికి పూలమాలను సమర్పించి నివాళులర్పించారు.
ఈ సందర్భంగా డాక్టర్ మాట్లాడుతూ, అంబేద్కర్ జయంతిని “సమానత్వ దినోత్సవం” గా కూడా పిలుస్తారని, అంబేద్కర్ భారతీయ రాజకీయవేత్త, సంఘసంస్కర్త అని తెలియజేశారు. మక్సుద్ మాట్లాడుతూ, అంటరానితనం నిర్మూలించడంలో ఎనలేని కృషి చేశారని, ప్రజలందరూ దేశభక్తితో, సమస్యలను ఎదుర్కొని, సమాజంలో మార్పులు తీసుకురావాలని తెలిపారు. అనంతరం పేద మహిళలకు చీరలను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో వివేకానంద సంస్థ అధ్యక్షులు సూరాడ. అప్పారావు, ప్రముఖ సంఘ సేవకులుT. కృష్ణ మరియు మహిళలు పాల్గొన్నారు.


Comments
Post a Comment