K.V.SHARMA EDITOR
ప్రముఖ పర్యాటక ప్రాంతమైన కైలాసగిరి పై పర్యాటకులను ఆకర్షించేలా రూపుదిద్దుకుంటున్న త్రిశూల్ ను త్వరలో అందుబాటులోకి తీసుకువస్తున్నామని వి ఎం ఆర్ డి ఎ చైర్మన్ శ్రీ ఎం వి ప్రణవ్ గోపాల్ గారు అన్నారు. బుధవారం ఉదయం కైలాసగిరి పై త్రిశూల్ నిర్మాణ పనుల ప్రగతిని ఆయన పరిశీలించారు.
ఈ నెలాఖరులోగా త్రిశూల్ ను ప్రారంభించేందుకు తగిన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. త్రిశూల్ పరిసరాలు మరింత సుందరంగా ఉండేలా పచ్చదనం పెంపొందించాలని ఆదేశించారు. సందర్శకులకు మెరుగైన సదుపాయాలు కల్పించాలని, బెంచీలు, తాగునీరు వంటి సదుపాయాలను కల్పించాలని ఆదేశించారు. సందర్శకులను ఆకర్షించే విధంగా శివ లింగాకార నమూనాలో వర్టికల్ గార్డెనింగ్ పెంపొందించాలని ఆదేశించారు.
అదేవిధంగా భద్రతకు అత్యంత ప్రాధాన్యత ఇవ్వాలని, సి సి కెమెరాలను అమర్చాలని సూచించారు. అధ్యాత్మిక వాతావరణం ఉట్టిపడేలా ఈ ప్రాంతం మొత్తం తీర్చిదిద్దాలని సూచించారు.
వేసవి సెలవులు నేపథ్యంలో కైలాసగిరి కి వచ్చే సందర్శకులు పెరిగే అవకాశం ఉందని, అందువల్ల ఘాట్ రోడ్డు ఆఖరి మలుపు నుంచి తెలుగు మ్యూజియం వరకు నిర్మించిన రహదారిని సత్వరమే అందుబాటులోకి తీసుకురావాలని ఆదేశించారు. ఘాట్ రోడ్డు లో అదనపు సిబ్బందిని నియమించాలని సూచించారు. కార్యక్రమంలో కార్యదర్శి శ్రీ మురళీ కృష్ణ గారు, ప్రధాన ఇంజనీర్ శ్రీ వినయ్ కుమార్ గారు, కార్యనిర్వహక ఇంజనీర్లు శ్రీ భవాని శంకర్ గారు, శ్రీ మధు గారు, DFO శ్రీమతి శిరీష అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.




Comments
Post a Comment