అమలాపురం, విశాఖ సందేసం....డా. బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా స్వర్ణ గ్రామం స్వర్ణ వార్డు అధికారిగా విజయలక్ష్మి నూతనంగా పదవీ బాధ్యతలను స్వీకరించారు. ఈ సందర్బంగా విజయలక్ష్మి మాట్లాడుతూ వార్డు గ్రామ పరిధిలో పచ్చదనం పెంచే కార్యక్రమాలను ప్రోత్సహించడం జరుగుతుందని, పరిపాలన
సిబ్బంది ప్రజలకు అందుబాటులో ఉండేలా వ్యవస్థను మెరుగుపరచడం జరుగుతుందన్నారు. నైపుణ్యాభివృద్ధి ద్వారా సిబ్బందికి ఎప్పటికప్పుడు కొత్త సాంకేతికతపై శిక్షణ ఇస్తామన్నారు. నగదు నిల్వలు, స్టాక్ రిజిస్టర్లు మరియు ప్రభుత్వ ఆస్తుల రికార్డులను కాలానుగుణంగా తనిఖీ చేయడం, జిల్లా స్థాయి స్పందనలో వచ్చే ఫిర్యాదులను స్వర్ణ సచివాలయ అధికారుల ద్వారా త్వరితగతిన పరిష్కరించడం జరుగు తుందన్నారు. వారానికి కనీసం రెండు సార్లు క్షేత్రస్థాయిలో పర్యటించి ప్రజల సమస్యలను నేరుగా తెలుసుకోవడం జరుగుతుందన్నారు.
స్వర్ణ గ్రామం స్వర్ణ వార్డు ప్రత్యేక లక్ష్యాలైన పౌరులకు సంక్షేమ పథకాల అమలు మరియు చెత్త సేకరణ అంశంలో నూటికి నూరు శాతం నాణ్యమైన సేవలు సమయానుకూలంగా అందిస్తానన్నారు. బహిరంగ మలవిసర్జన రహిత గ్రామాలను సాధించడం జరుగుతుందన్నారు. ఆస్తి నీటి పన్ను వసూళ్లు సమర్థవంతంగా నిర్వహించేలా చర్యలు తీసుకోవడం జరుగుతుంద న్నారు. సంక్షేమ పథకాల లబ్ధిదారుల జాబితాలను పారదర్శకత కోసం సచివాలయాల్లో ప్రదర్శించడం జరుగుతుందన్నారు. బాధ్యతలు స్వీకరించిన అధికారికి సిబ్బంది పుష్పగుచ్చాలను అందజేసి అభినందనలు తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా కోఆర్డినేటర్ సువిజయ్, సిబ్బంది పాల్గొన్నారు.
Srinivas Spl Correspondant



Comments
Post a Comment