పార్టీ తూర్పు నియోజకవర్గ మండల అధ్యక్షుల సమావేశం నియోజకవర్గ ఇన్చార్జ్ రవి రాజ్ అధ్యక్షతన బీజేపీ విశాఖపట్నం జిల్లా కార్యాలయంలో జరిగింది. ఈ సమావేశానికి బిజెపి జిల్లా అధ్యక్షులు శ్రీ MMN పరశురామరాజు గారు ముఖ్య అతిధిగా విచ్చేసారు.
ఈ సందర్భంగా పరశురామరాజు గారు మాట్లాడుతూ త్వరలో జరగబోయే ఎస్ఐఆర్ గురించి మండల అధ్యక్షులకు పలు సూచనలు చేసి ఖచ్చితమైన ఓటర్ల జాబితా తయారయ్యే విధంగా సమర్థవంతమైన కార్యకర్తలను బిఎల్ఎ -2 లుగా నియమించాలని తెలియజేశారు.
ఈ కార్యక్రమంలో బీజేపీ జిల్లా ప్రధాన కార్యదర్శి శ్రీరంగం ధనేశ్వర రావు, బీజేపీ ST మోర్చా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి SRLN మురళి మోహన్ రాజు, బీజేపీ జిల్లా కార్యదర్శి లెంక శ్రీరామ్ మరియు నియోజకవర్గ మండల అధ్యక్షులు మరియు పలువురు నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.
K.V.SHARMA EDITOR

Comments
Post a Comment