ఆంధ్ర విశ్వవిద్యాలయం విద్యార్థులకు ఉపయుక్తంగా నిలిచే విధంగా నూతనంగా ఏర్పాటు చేసిన ఫ్లడ్ లైట్లు ను ఏయు వైస్ ఛాన్సలర్ ఆచార్య జి.పి రాజశేఖర్ ఈరోజు ప్రారంభించారు.
ఆంధ్ర విశ్వవిద్యాలయం విద్యార్థులకు ఉపయుక్తంగా నిలిచే విధంగా నూతనంగా ఏర్పాటు చేసిన ఫ్లడ్ లైట్లు ను ఏయు వైస్ ఛాన్సలర్ ఆచార్య జి.పి రాజశేఖర్ ఈరోజు ప్రారంభించారు. హోమియో వైద్యశాల నుంచి నాగార్జున హాస్టల్ కి వెళ్లే మార్గంలో, అర్థశాస్త్ర విభాగం నుంచి కలెక్టర్ బంగాళాకి వెళ్లే మార్గంలో మధ్యలో ఉన్న కూడలిలో నూతనంగా వీటిని ఏర్పాటు చేశారు. రాత్రి వేళల్లో విద్యార్థులు సురక్షితంగా విభాగాల నుంచి హాస్టల్స్ కు వెళ్లడానికి ఇది ఈ ఫ్లడ్ లైట్లు ఉపయుక్తంగా నిలుస్థాయి. కొత్తగా ఏర్పాటు చేసిన ఫ్లడ్ లైట్లు వెలుగులో ఈ కూడలి మార్గం ఎంతో ప్రకాశవంతంగా మారింది.
అదేవిధంగా ఏయూలో వివిధ ప్రాంతాలలో ఏర్పాటు చేస్తున్న విద్యుత్ దీపాలను అధికారులు ప్రత్యక్షంగా పరిశీలించారు. కార్యక్రమంలో రిజిస్ట్రార్ ఆచార్య కె. రాంబాబు, ఇంజనీరింగ్ అధికారులు, డీన్ లు తదితరులు పాల్గొన్నారు.
K.V.SHARMA EDITOR

Comments
Post a Comment