భారతీయ జనతా పార్టీ జిల్లా అధ్యక్షులు శ్రీ ఏమ్ ఏమ్ ఎన్ పరుశురామరాజు గారి అధ్యక్షతన, బిజెపి ఎస్సీ మోర్చా ఆధ్వర్యంలో విశాఖ ధాబా గార్డెన్స్ లో అంబేద్కర్ జయంతి వేడుకలు లో పాల్గొన్న బిజెపి చీఫ్ పివిఎన్ మాధవ్*
ఈసందర్భంగా మాధవ్మీడియాతోమాట్లాడుతూ....సమాజ సమానత్వానికి ప్రాణం పోసిన మహనీయుడు డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ గారి జయంతి సందర్భంగా…భారతీయ జనతా పార్టీ ఘనంగా నివాళులు అర్పించింది.
ఈ సందర్భంగా బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు పివిఎన్ మాధవ్ గారు మాట్లాడుతూ…అంబేద్కర్ గారు చూపిన మార్గమే దేశానికి దిక్సూచి అని అన్నారు.
సామాజిక న్యాయం, సమాన హక్కుల సాధనలోఅంబేద్కర్ గారి ఆలోచనలు శాశ్వత స్ఫూర్తిగా నిలుస్తాయని పేర్కొన్నారు.ప్రతి ఒక్కరూ ఆయన సిద్దాంతాలను ఆచరిస్తూసమానత్వ సమాజ నిర్మాణానికి కృషి చేయాలని పిలుపునిచ్చారు.
అంబేద్కర్ గారి ఆశయాలను సాకారం చేయడమేమా పార్టీ ప్రధాన లక్ష్యమని స్పష్టం చేశారు.”ఈ కార్యక్రమంలో ఉత్తర నియోజకవర్గం శాసనసభ్యులు మరియు బిజెపి ఫ్లోర్ లీడర్ శ్రీ పి విష్ణుకుమార్ రాజు గారితో పాటు అధిక సంఖ్యలో బిజెపి నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు




Comments
Post a Comment