*రాష్ట్ర హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి పర్యటనకు పటిష్ట ఏర్పాట్లు* *అధికారులను ఆదేశించిన జిల్లా కలెక్టర్ ఎం. అభిషిక్త్ కిశోర్
విశాఖపట్టణం, ఏప్రిల్ 16 ః ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి పర్యటనకు పటిష్ట ఏర్పాట్లు చేయాలని, కార్యక్రమాలను సమన్వయం చేసుకొని విజయవంతం చేయాలని జిల్లా కలెక్టర్ ఎం. అభిషిక్త్ కిశోర్ అధికారులను ఆదేశించారు. ఈ నెల 17, 18వ తేదీల్లో విశాఖపట్టణంలో హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ధీరజ్ సింగ్ ఠాకూర్ పర్యటన ఉన్న నేపథ్యంలో సంబంధిత ఏర్పాట్లపై కలెక్టరేట్ మీటింగు హాలులో గురువారం సమీక్షించారు. అధికారులందరూ సమన్వయం చేసుకోవాలని, ఎక్కడా ఎలాంటి లోపాలు తలెత్తకుండా, అసౌకర్యం కలగకుండా జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. 17వ తేదీ రాత్రికి ఆయన విశాఖపట్టణం చేరుకొని, 18వ తేదీ ఉదయం నుంచి విశాఖపట్టణంలో జరిగే కార్యక్రమాల్లో పాల్గొంటారని ఆ మేరకు ఏర్పాట్లు చేసుకోవాలని సూచించారు. పర్యటనలో భాగంగా ఎండాడ పరిధి రుషికొండ ఇస్కాన్ టెంపుల్ వెనుక భాగంలో నిర్మించతలపెట్టిన జ్యూడీషియల్ గెస్ట్ హౌస్ నిర్మాణానికి శంకుస్థాపన ఆయన చేతుల మీదుగా జరుగుతుందని, దీని నిర్వహణలో జిల్లా అధికారులు, న్యాయ శాఖ అధికారులతో సమన్వయం చేసుకోవాలని చెప్పారు. ప్రోటోకాల్, భద్రత, బందోబస్తు, ట్రాఫిక్ మేనేజ్మెంట్, వసతి ఇతర ఏర్పాట్లలో లోపాలు తలెత్తకుండా జాగ్రత్తలు తీసుకోవాలని కలెక్టర్ అధికారులకు సూచించారు. ఫస్ట్ ఏడీజే ఎం. వెంకట రమణ, జీవీఎంసీ కమిషనర్ కేతన్ గార్గ్, ఇతర అధికారులు పాల్గొన్నారు.
K.V.SHARMA EDITOR

Comments
Post a Comment