Srinivas Spl Correspondant
ఎస్సి ,ఎస్టీ ,బీసీ ,ఓ సి , మైనారిటీ, మహిళా సంఘాలు, అంబేద్కర్ యువజన సంఘల అధ్వర్యంలో135వ డా. బిఆర్ అంబేద్కర్ జయంతి వేడుకలు మంగళవారం అంబరాన్నాంటాయి.
డా. బి.ఆర్. అంబేద్కర్ కోనసీమ జిల్లా అమలాపురం నియోజకవర్గంలోని పేరూరు వై జంక్షన్ వద్ద ఏర్పాటు చేసిన అంబేద్కర్ జయంతి వేడుకల్లో అమలాపురం నియోజకవర్గ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు కుంచే రమణారావు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ స్టేట్ ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్ మెంబర్ కుడుపూడి భరత్ భూషణ్ ముఖ్యతిదులుగా పాల్గొన్నారు.డా. బి.ఆర్. అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు అర్పించి, ఆయన సేవలను స్మరించుకున్నారు.
ఈ సందర్భంగా నేతలు మాట్లాడుతూ అంబేద్కర్ దేశానికి చేసిన సేవలను కొనియాడుతూ, ఆయన ఆశయాలను యువత ముందుకు తీసుకెళ్లాలని పిలుపునిచ్చారు. ఈ వేడుకల్లో మాజీ సర్పంచ్ నక్క సంపత్ కుమార్,మండల ప్రధాన కార్యదర్శి పినిపే జయరాజ్, పందిరి సుబ్బరాజు, నేరేడుమెల్లి శ్రీనివాసరావు,పరమట రాజేష్, వార్డు ప్రధాన కార్యదర్శి ముత్తాబత్తుల గణేష్, మణికంఠ తదితరులు పాల్గొన్నారు.


Comments
Post a Comment