స్నేహ సంధ్యా సభ్యులు సత్యవంతరావు దంపతులు, ఆదిభట్ల రామకృష్ణ , రావు వివేకానంద ఆశ్రమమునందు గో సేవ , నారాయణ సేవను నిర్వహించారు. గో సేవలో భాగంగా గోవులకు తవుడు, చిట్టును అందించి గోమాతకు పూజలు నిర్వహించి, ఆశ్రమ వాసులకు బియ్యం ,పప్పులు, ఆయిల్ మొదలైన నిత్యవసర వస్తువులను అందించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, మా స్నేహ సంధ్య సంస్థ నారాయణ సేవ, పలు సేవా కార్యక్రమాలను వివేకానంద ఆశ్రమం లోనే, అనేక సందర్భాల్లో నిర్వహించడం జరుగుతుందని, అక్షయ తృతీయ సందర్భంగా ఈరోజు కూడా సేవ కార్యక్రమాలు వివేకానంద ఆశ్రమంలో నిర్వహించడం, మాకు చాలా ఆనందంగా ఉందని, ఎందుకంటే వివేకానంద సంస్థ వారు నిత్య అన్నదానాలతో అన్నార్తుల ఆకలి తీరుస్తున్నారని, ఈ సేవలలో మాకు భాగస్వామ్యం కల్పించినందుకు సంస్థ వారికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నామని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో వివేకానంద సంస్థ అధ్యక్షులు అప్పారావు, స్నేహ సంధ్య సభ్యులు పాల్గొన్నారు.
K.V.SHARMA EDITOR

Comments
Post a Comment