Skip to main content

హారి మనోవికాస కేంద్రంలో ముఖ్యమంత్రి చంద్రబాబు పుట్టినరోజు వేడుకలు.... రక్తదానం చేసిన ఆకుమర్తి రమేష్..


అమలాపురం, విశాఖ సందేసం.
అంద్రప్రదేశ్ రాష్ట్ర  ముఖ్య మంత్రి వర్యులు  నారా చంద్రబాబు నాయుడు  పుట్టినరోజు సందర్భంగా అమలాపురం నియోజకవర్గం ఎమ్మార్పీఎస్  ఇంచార్జ్ ఆకుమర్తి రమేష్ మాదిగ అధ్యక్షతన కొంకపల్లి  హరి మనో వికాస స్కూల్ నందు వికలాంగుల సమక్షంలో కేక్ కట్ చేసి పండ్లు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిధిగా జిల్లా ఎమ్మార్పీఎస్  అధ్యక్షులు సవరపు బైరవమూర్తి, ఉప్పలగుప్తం మండల  ఎమ్మార్పీఎస్  అధ్యక్షులు సత్తాల దుర్గారావు, అంబాజీపేట మండలం


ఎమ్మార్పీఎస్ అధ్యక్షులు, తొత్తరముడి గోవింద్, నూటికుర్తి మూర్తి,  నాయకులు పాల్గొన్నారు. స్థానిక కూటమి శాసన సభ్యులు అయితాబత్తుల అనందరావు ఏర్పాటు చేసిన రక్తదాన శిబిరంలో ఆకుమర్తి రమేష్ పాల్గొని రక్తదానం చేశారు. 


మాదిగలకు ఏబీసీడీ రిజర్వేషన్ చేసినందుకు కృతజ్ఞతగా చంద్రబాబు నాయుడు  ఎల్లవేళలా ప్రజా జీవితంలో మంచి సుపరిపాలనదక్షులుగా ఉండాలని ఆకుమర్తి రమేష్ అన్నారు. మాదిగలు వర్గీకరణ చేసిన చంద్రబాబు నాయుడుకి  పద్మ శ్రీ మంద కృష్ణ మాదిగ  సారద్యంలో కృతజ్ఞతగా ఉంటామని సవరపు బైరవ మూర్తి అన్నారు.

             Srinivas Spl Correspondant 

Comments

Popular posts from this blog

ప్రాణాలను కాపాడే సేవలో ఉక్కు సంకల్పం – RINL , విశాఖ ఉక్కు కర్మాగారం మాజీ జనరల్ మేనేజర్(VRS) శ్రీ జేవీవీఎస్ శర్మ 39 వ సారి అరుదైన ఓ- నెగటివ్ రక్తదానం*

భగవాన్ శ్రీ సత్య సాయి బాబా వారి దివ్య కృపతో, RINL,   విశాఖ ఉక్కు కర్మాగారం లో  థర్మల్ పవర్ ప్లాంట్‌లో జనరల్ మేనేజర్ (ప్రాజెక్ట్స్)గా పనిచేసి వాలంటరీ రిటైర్మెంట్ (VRS) తీసుకున్న శ్రీ జేవీవీఎస్ శర్మ గారు మరోసారి తన సేవా భావాన్ని చాటుకున్నారు. మెడికవర్ హాస్పిటల్‌లో హృదయ శస్త్రచికిత్స పొందవలసిన ఒక వ్యక్తికి  అరుదైన O-నెగటివ్ రక్తాన్ని దానం చేసి ప్రాణరక్షణలో భాగస్వాములయ్యారు. శ్రీ శర్మ గారు సేవా స్పూర్తి, మానవతా విలువలకు ప్రతీకగా నిలుస్తున్నారు. వీఆర్‌ఎస్ అనంతరం కూడా అవసరమైన వారికి సహాయం చేస్తూ సమాజానికి ఆదర్శంగా నిలుస్తున్నారు. ఇది ఆయన చేసిన 39వ రక్తదానం కావడం విశేషం. ప్రతి మూడు నెలలకు ఒకసారి రక్తదానం చేస్తూ, ఇతరులకు కూడా స్ఫూర్తినిస్తున్నారు. శ్రీ సత్య సాయి సాయి కుటుంబ సభ్యులు మరియు విశాఖ ఉక్కు కర్మాగారం సహచరులు ఆయన ఈ మహత్తర సేవను అభినందిస్తూ, శ్రీ శర్మ గారు, వారి సతీమణి మరియు పిల్లలపై భగవాన్ ఆశీస్సులు ఎల్లప్పుడూ ఉండాలని ప్రార్థించారు. సమాజ సేవలో మరింత ముందుకు సాగేందుకు ఆయనకు ఆరోగ్యం, ఆనందం, ఐశ్వర్యం కలగాలని ఆకాంక్షించారు.