Skip to main content

పర్యాటకానికి సరికొత్త చిరునామాగా త్రిశూల్ * నిర్మాణ పనులను పరిశీలించిన వి ఎం ఆర్ డి ఎ చైర్మన్ శ్రీ ఎం వి ప్రణవ్ గోపాల్


విశాఖ పర్యాటకానికి సరికొత్త చిరునామాగా కైలాసగిరి పై నూతనంగా నిర్మించిన త్రిశూల్ ప్రాజెక్ట్ మారనుందని వి ఎం ఆర్ డి ఎ చైర్మన్ శ్రీ ఎం వి ప్రణవ్ గోపాల్  అన్నారు. బుధవారం సాయంత్రం కైలాసగిరి పై నిర్మాణంలో ఉన్న త్రిశూల్ పనులను ఆయన పరిశీలించి, పలు సూచనలు చేశారు. 


సుమారు 65 అడుగుల ఎత్తున డమరుకం తో కూడిన త్రిశూల్ పరిసరాలు ఆహ్లాదకర వాతావరణం ఉండేలా పచ్చదనం పెంపొందించాలని ఆదేశించారు. త్రిశూలం సమీపంలో డెకరేటెడ్ విద్యుత్ స్తంభాలను ఏర్పాటు చెయ్యాలని సూచించారు. 


నిరంతరం త్రిశూల్ పరిసరాలు ఆధ్యాత్మికత వాతావరణం ఉట్టిపడేలా పబ్లిక్ అడ్రస్ సిస్టమ్ ద్వారా ఓంకార నాదం వినిపించే ఏర్పాట్లు చేయాలని సూచించారు. సందర్శకులు సేదతీరే విధంగా బెంచీలను ఏర్పాటు చేయాలన్నారు. వచ్చే వారంలో త్రిశూల్ ను ప్రారంభించేందుకు చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. 


త్రిశూల్ ప్రాజెక్టు గురించి విస్తృత ప్రచారం కల్పించాలని ఆదేశించారు. కార్యక్రమంలో వి ఎం ఆర్ డి ప్రధాన ఇంజినీర్ శ్రీ వినయ్ కుమార్, పర్యవేక్షక ఇంజినీర్ శ్రీ భవాని శంకర్, కార్యనిర్వహక ఇంజనీర్ శ్రీ JCP సింగ్, డి ఎఫ్ ఓ శ్రీమతి శిరీష తదితరులు పాల్గొన్నారు

                  K.V.SHARMA EDITOR 

Comments

Popular posts from this blog

ప్రాణాలను కాపాడే సేవలో ఉక్కు సంకల్పం – RINL , విశాఖ ఉక్కు కర్మాగారం మాజీ జనరల్ మేనేజర్(VRS) శ్రీ జేవీవీఎస్ శర్మ 39 వ సారి అరుదైన ఓ- నెగటివ్ రక్తదానం*

భగవాన్ శ్రీ సత్య సాయి బాబా వారి దివ్య కృపతో, RINL,   విశాఖ ఉక్కు కర్మాగారం లో  థర్మల్ పవర్ ప్లాంట్‌లో జనరల్ మేనేజర్ (ప్రాజెక్ట్స్)గా పనిచేసి వాలంటరీ రిటైర్మెంట్ (VRS) తీసుకున్న శ్రీ జేవీవీఎస్ శర్మ గారు మరోసారి తన సేవా భావాన్ని చాటుకున్నారు. మెడికవర్ హాస్పిటల్‌లో హృదయ శస్త్రచికిత్స పొందవలసిన ఒక వ్యక్తికి  అరుదైన O-నెగటివ్ రక్తాన్ని దానం చేసి ప్రాణరక్షణలో భాగస్వాములయ్యారు. శ్రీ శర్మ గారు సేవా స్పూర్తి, మానవతా విలువలకు ప్రతీకగా నిలుస్తున్నారు. వీఆర్‌ఎస్ అనంతరం కూడా అవసరమైన వారికి సహాయం చేస్తూ సమాజానికి ఆదర్శంగా నిలుస్తున్నారు. ఇది ఆయన చేసిన 39వ రక్తదానం కావడం విశేషం. ప్రతి మూడు నెలలకు ఒకసారి రక్తదానం చేస్తూ, ఇతరులకు కూడా స్ఫూర్తినిస్తున్నారు. శ్రీ సత్య సాయి సాయి కుటుంబ సభ్యులు మరియు విశాఖ ఉక్కు కర్మాగారం సహచరులు ఆయన ఈ మహత్తర సేవను అభినందిస్తూ, శ్రీ శర్మ గారు, వారి సతీమణి మరియు పిల్లలపై భగవాన్ ఆశీస్సులు ఎల్లప్పుడూ ఉండాలని ప్రార్థించారు. సమాజ సేవలో మరింత ముందుకు సాగేందుకు ఆయనకు ఆరోగ్యం, ఆనందం, ఐశ్వర్యం కలగాలని ఆకాంక్షించారు.