Skip to main content

కిమ్స్ లో శ్రీ వేంకటేశ్వర స్వామి వారి దేవాలయంలో ఏకాదశ వార్షిక బ్రహ్మోత్సవములు. అంగరంగ వైభవంగా శ్రీ వేంకటేశ్వర స్వామి వారి కళ్యాణ మహోత్సవం... నేడు స్వామి వారి గ్రామోత్సవం...

 


అమలాపురం, విశాఖ సందేసం....కిమ్స్ వైద్య కళాశాల ప్రాంగణంలో  శ్రీదేవి, భూదేవి సమేత శ్రీవేంకటేశ్వర స్వామి వారి దేవాలయంలో మూడు రోజుల పాటు జరుగుచున్న ఏకాదశ వార్షిక బ్రహ్మోత్సవములలో భాగంగా రెండవ రోజు అనగా 22వ తేదీ బుధవారం ఉదయం 5 గంటల నుండి అర్చన, లక్ష్మి హోమం, నీరాజనం మరియు మంత్రపుష్పం, తదుపరి 8 గంటలకు స్త్రీలచే సామూహిక కుంకుమ పూజ కార్యక్రమాలు జరిగాయి. సుమారు 100 మంది మహిళలలు ఈ కుంకుమ పూజ కార్యక్రమంలో పాల్గొన్నారు. సాయంత్రం 6 గంటలకు శ్రీ వెంకటేశ్వర స్వామి వారి కళ్యాణ మహోత్సవము అంగరంగా  వైభవంగా జరిగింది. సుమారు  వెయ్యి మంది భక్తులు, పలువురు రాజకీయ నాయకులు మరియు పుర ప్రముఖులు స్వామి వారి కల్యాణాన్ని తిలకించి తరించారు. తదుపరి తీర్ధ ప్రసాద వితరణ జరిగింది. 


మూడవ రోజు అనగా 23 వ తేదీ గురు వారం ఉదయం సుదర్శన హోమమం, పూర్ణాహుతి, చక్ర స్నానం తదితర కార్యక్రమాలు జరుగును. మధ్యాహ్నం 3 గంటలకు స్వామి వారి గ్రామోత్సవం జరుగును. సాయంత్రం 5 గంటలకు పర్యంక శయనోత్సవం, ఆశీర్వచనం, పండిత సత్కారం, నీరాజనం, మంత్రపుష్పం మరియు తీర్ధ ప్రసాద వితరణ జరుగును. 


ఈ కార్యక్రమాలకు అందరూ ఆహ్వానితులే అని, అమలాపురం పరిసర ప్రాంతముల భక్త మహాశయులందరూ ఈ బ్రహ్మోత్సవాలలో పాల్గొని, శ్రీ స్వామి వారి సేవలో తరించవలసినదిగా కిమ్స్ ఛైర్మన్  కె.వి.వి.సత్యనారాయణ రాజు (చైతన్య రాజు) తెలియజేసారు.

              Srinivas Spl Correspondant 

Comments

Popular posts from this blog

ప్రాణాలను కాపాడే సేవలో ఉక్కు సంకల్పం – RINL , విశాఖ ఉక్కు కర్మాగారం మాజీ జనరల్ మేనేజర్(VRS) శ్రీ జేవీవీఎస్ శర్మ 39 వ సారి అరుదైన ఓ- నెగటివ్ రక్తదానం*

భగవాన్ శ్రీ సత్య సాయి బాబా వారి దివ్య కృపతో, RINL,   విశాఖ ఉక్కు కర్మాగారం లో  థర్మల్ పవర్ ప్లాంట్‌లో జనరల్ మేనేజర్ (ప్రాజెక్ట్స్)గా పనిచేసి వాలంటరీ రిటైర్మెంట్ (VRS) తీసుకున్న శ్రీ జేవీవీఎస్ శర్మ గారు మరోసారి తన సేవా భావాన్ని చాటుకున్నారు. మెడికవర్ హాస్పిటల్‌లో హృదయ శస్త్రచికిత్స పొందవలసిన ఒక వ్యక్తికి  అరుదైన O-నెగటివ్ రక్తాన్ని దానం చేసి ప్రాణరక్షణలో భాగస్వాములయ్యారు. శ్రీ శర్మ గారు సేవా స్పూర్తి, మానవతా విలువలకు ప్రతీకగా నిలుస్తున్నారు. వీఆర్‌ఎస్ అనంతరం కూడా అవసరమైన వారికి సహాయం చేస్తూ సమాజానికి ఆదర్శంగా నిలుస్తున్నారు. ఇది ఆయన చేసిన 39వ రక్తదానం కావడం విశేషం. ప్రతి మూడు నెలలకు ఒకసారి రక్తదానం చేస్తూ, ఇతరులకు కూడా స్ఫూర్తినిస్తున్నారు. శ్రీ సత్య సాయి సాయి కుటుంబ సభ్యులు మరియు విశాఖ ఉక్కు కర్మాగారం సహచరులు ఆయన ఈ మహత్తర సేవను అభినందిస్తూ, శ్రీ శర్మ గారు, వారి సతీమణి మరియు పిల్లలపై భగవాన్ ఆశీస్సులు ఎల్లప్పుడూ ఉండాలని ప్రార్థించారు. సమాజ సేవలో మరింత ముందుకు సాగేందుకు ఆయనకు ఆరోగ్యం, ఆనందం, ఐశ్వర్యం కలగాలని ఆకాంక్షించారు.