భారతీయ జనతా పార్టీ కార్యాలయంలో రాష్ట్ర వ్యాప్తంగా బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు శ్రీ పివిఎన్ మాధవ్ గారి సారధ్యంలో నిర్వహిస్తున్న జనతా వారధి ప్రజలకు ప్రభుత్వానికి వారధి కార్యక్రమం లో భాగంగా బీజేపీ విశాఖపట్నం జిల్లా అధ్యక్షులు శ్రీ MMN పరశు రామ రాజు గారి ఆధ్వర్యంలో ఉత్తరాంధ్ర కార్యాలయంలో బిజెపి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మట్ట ప్రసాద్ గారు కలసి ప్రజల నుండి వినతులు స్వీకరించారు.ఈ సందర్భంగా బిజెపి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మట్ట ప్రసాద్ మాట్లాడుతూ ప్రజలకు ఎంతో కాలంగా పరిష్కారం కాని సమస్యలను అర్జీలను స్వీకరించి ఈ జనతా వారధి కార్యక్రమం ద్వారా ప్రభుత్వ అధికారుల దృష్టికి తీసుకొని వెళ్లి పరిష్కరించే దిశగా కృషి చేస్తామని తెలిపారు.
ఈ జనతా వారధి కార్యాలయంలో ప్రతి శుక్రవారం ఒక ప్రజా ప్రతినిధులు అందుబాటులో ఉంటూ ప్రజల నుండి అర్జీలను స్వీకరించడం జరుగుతుందని, ఈ అవకాశాన్ని ఉత్తరాంధ్ర ప్రజలు వినియోగించుకోవాలని కోరారు.
ఈ కార్యాలయంలో జనతా వారధి కార్యక్రమం కన్వీనర్ పొలిమేర శ్రీనివాస రావు, జనతా వారధి కో కన్వీనర్ మూల వెంకట్రావు, బీజేపీ మాజీ జిల్లా ప్రధాన కార్యదర్శి J దామోదర్ యాదవ్, బీజేపీ జిల్లా కార్యదర్శి కారాల మహేష్, మీడియా కన్వీనర్ T కోటేశ్వర రావు, బీజేపీ తూర్పు నియోజకవర్గ ఇంచార్జి K రవిరాజ్ తో పాటు పలువురు కార్యకర్తలు పాల్గొనడం జరిగింది.



Comments
Post a Comment