Skip to main content

అనకాపల్లి జిల్లాల్లో భూకంపం!*

 


అమరావతి:ఏప్రిల్ 17: ఆంధ్రప్రదేశ్‌లోని అనకాపల్లి జిల్లా ఎలమంచిలి పరిస రాల ప్రాంతాల్లో స్వల్ప భూకంపం సంభవించింది, అర్ధరాత్రి 12: 30 గంటల సమయంలో కొన్ని సెకన్లు పాటు... భూమి కంపించిం దని, స్థానికులు చెబుతు న్నారు. ఎలమంచిలి పట్ట ణంతో పాటు..మండలం లోని పలు గ్రామాల్లో భూప్రకంపనలు చోటుచేసుకున్నాయి.

రాంబిల్లి మండలం పరిసర ప్రాంతాల్లో భూమి స్వల్పంగా కంపించడంతో స్థానికులు భయాందోళనకు గురయ్యారు. శుక్రవారం అర్ధరాత్రి దాటిన తర్వాత 12:30 గంటల సమయం లో ఈ ప్రకంపనలు సంభ వించాయి. రిక్టర్ స్కేల్‌పై భూకంప తీవ్రత 3.7గా నమోదైనట్లు అధికారులు ప్రాథమికంగా నిర్ధారించా రు. నిద్రలో ఉన్న ప్రజలు ఒక్కసారిగా ప్రకంపనలు రావడంతో ఇళ్లలోంచి బయటకు పరుగులు తీశారు. 

అయితే, ఇప్పటివరకు ఎటువంటి ఆస్తి నష్టం లేదా ప్రాణనష్టం జరిగినట్లు సమాచారం లేదు. స్థానిక అధికారులు మరియు జియోలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా బృందాలు ప్రకంపనలకు గల కారణా లను విశ్లేషిస్తున్నాయి. ఇలాంటి తక్కువ తీవ్రత గల ప్రకంపనలు సాధా రణంగా ఆందోళన చెందా ల్సిన విషయం కాదని, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచిస్తున్నారు.

                   K.V.SHARMA EDITOR 

Comments

Popular posts from this blog

ప్రాణాలను కాపాడే సేవలో ఉక్కు సంకల్పం – RINL , విశాఖ ఉక్కు కర్మాగారం మాజీ జనరల్ మేనేజర్(VRS) శ్రీ జేవీవీఎస్ శర్మ 39 వ సారి అరుదైన ఓ- నెగటివ్ రక్తదానం*

భగవాన్ శ్రీ సత్య సాయి బాబా వారి దివ్య కృపతో, RINL,   విశాఖ ఉక్కు కర్మాగారం లో  థర్మల్ పవర్ ప్లాంట్‌లో జనరల్ మేనేజర్ (ప్రాజెక్ట్స్)గా పనిచేసి వాలంటరీ రిటైర్మెంట్ (VRS) తీసుకున్న శ్రీ జేవీవీఎస్ శర్మ గారు మరోసారి తన సేవా భావాన్ని చాటుకున్నారు. మెడికవర్ హాస్పిటల్‌లో హృదయ శస్త్రచికిత్స పొందవలసిన ఒక వ్యక్తికి  అరుదైన O-నెగటివ్ రక్తాన్ని దానం చేసి ప్రాణరక్షణలో భాగస్వాములయ్యారు. శ్రీ శర్మ గారు సేవా స్పూర్తి, మానవతా విలువలకు ప్రతీకగా నిలుస్తున్నారు. వీఆర్‌ఎస్ అనంతరం కూడా అవసరమైన వారికి సహాయం చేస్తూ సమాజానికి ఆదర్శంగా నిలుస్తున్నారు. ఇది ఆయన చేసిన 39వ రక్తదానం కావడం విశేషం. ప్రతి మూడు నెలలకు ఒకసారి రక్తదానం చేస్తూ, ఇతరులకు కూడా స్ఫూర్తినిస్తున్నారు. శ్రీ సత్య సాయి సాయి కుటుంబ సభ్యులు మరియు విశాఖ ఉక్కు కర్మాగారం సహచరులు ఆయన ఈ మహత్తర సేవను అభినందిస్తూ, శ్రీ శర్మ గారు, వారి సతీమణి మరియు పిల్లలపై భగవాన్ ఆశీస్సులు ఎల్లప్పుడూ ఉండాలని ప్రార్థించారు. సమాజ సేవలో మరింత ముందుకు సాగేందుకు ఆయనకు ఆరోగ్యం, ఆనందం, ఐశ్వర్యం కలగాలని ఆకాంక్షించారు.