Skip to main content

వనితా వేవ్ నడక ను విజయవంతం చేయాలి * వి ఎం ఆర్ డి ఎ చైర్మన్ శ్రీ ఎం వి ప్రణవ్ గోపాల్


 ఆంధ్రా యూనివర్సిటీ శతాబ్ది ఉత్సవాల్లో భాగంగా డాక్టర్ దుర్గాబాయి దేశ్ ముఖ్ సెంటర్ ఆధ్వర్యంలో వనిత వేవ్ 100 పేరిట నిర్వహిస్తున్న నడక కార్యక్రమంలో మహిళలు, విద్యార్థినిలు పాల్గొని విజయవంతం చేయాలని వి ఎం ఆర్ డి ఎ చైర్మన్ శ్ఎం వి ప్రణవ్ గోపాల్  కోరారు. బుధవారం ఉదయం ఆయన ఛాంబర్ లో ఏయూ ఉమెన్ స్టడీస్ డైరెక్టర్ శ్రీమతి ఆచార్య పల్లవి గారు వనితా వేవ్ నడక లో పాల్గొనాలని ఆహ్వానం అందజేశారు.  ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈ నెల 24 న (శుక్రవారం) ఉదయం ఆర్ కే బీచ్ కాళీమాత దేవాలయం నుంచి నడక సాగుతుందని తెలిపారు. ఆంధ్రా యూనివర్సిటీ శతాబ్ది ఉత్సవాలు రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తుందని పేర్కొన్నారు. అత్యంత 

వైభవంగా జరుగుతున్న  ఈ ఉత్సవాల్లో ఎయు పరిధిలోని అనుబంధ కళాశాల ల కు చెందిన మహిళా సిబ్బంది, విద్యార్థినులు, వివిధ విభాగాల మహిళా ఉద్యోగినులు ప్రతీ ఒక్కరూ భాగస్వాములు కావాలని కోరారు. ఆరోగ్యవంతమైన జీవనానికి నడక అవసరమని, నడక కు ఉన్న ప్రాధాన్యత ను దృష్టి లో ఉంచుకొని ఈ వనితా వేవ్ నడక కార్యక్రమం నిర్వహిస్తున్నారని తెలిపారు. కార్యక్రమంలో ఆంధ్రా యూనివర్సిటీ ఉమెన్ స్టడీస్ డైరెక్టర్ శ్రీమతి ఆచార్య పల్లవి పాల్గొన్నారు.

                    K.V.SHARMA. EDITOR 

Comments

Popular posts from this blog

ప్రాణాలను కాపాడే సేవలో ఉక్కు సంకల్పం – RINL , విశాఖ ఉక్కు కర్మాగారం మాజీ జనరల్ మేనేజర్(VRS) శ్రీ జేవీవీఎస్ శర్మ 39 వ సారి అరుదైన ఓ- నెగటివ్ రక్తదానం*

భగవాన్ శ్రీ సత్య సాయి బాబా వారి దివ్య కృపతో, RINL,   విశాఖ ఉక్కు కర్మాగారం లో  థర్మల్ పవర్ ప్లాంట్‌లో జనరల్ మేనేజర్ (ప్రాజెక్ట్స్)గా పనిచేసి వాలంటరీ రిటైర్మెంట్ (VRS) తీసుకున్న శ్రీ జేవీవీఎస్ శర్మ గారు మరోసారి తన సేవా భావాన్ని చాటుకున్నారు. మెడికవర్ హాస్పిటల్‌లో హృదయ శస్త్రచికిత్స పొందవలసిన ఒక వ్యక్తికి  అరుదైన O-నెగటివ్ రక్తాన్ని దానం చేసి ప్రాణరక్షణలో భాగస్వాములయ్యారు. శ్రీ శర్మ గారు సేవా స్పూర్తి, మానవతా విలువలకు ప్రతీకగా నిలుస్తున్నారు. వీఆర్‌ఎస్ అనంతరం కూడా అవసరమైన వారికి సహాయం చేస్తూ సమాజానికి ఆదర్శంగా నిలుస్తున్నారు. ఇది ఆయన చేసిన 39వ రక్తదానం కావడం విశేషం. ప్రతి మూడు నెలలకు ఒకసారి రక్తదానం చేస్తూ, ఇతరులకు కూడా స్ఫూర్తినిస్తున్నారు. శ్రీ సత్య సాయి సాయి కుటుంబ సభ్యులు మరియు విశాఖ ఉక్కు కర్మాగారం సహచరులు ఆయన ఈ మహత్తర సేవను అభినందిస్తూ, శ్రీ శర్మ గారు, వారి సతీమణి మరియు పిల్లలపై భగవాన్ ఆశీస్సులు ఎల్లప్పుడూ ఉండాలని ప్రార్థించారు. సమాజ సేవలో మరింత ముందుకు సాగేందుకు ఆయనకు ఆరోగ్యం, ఆనందం, ఐశ్వర్యం కలగాలని ఆకాంక్షించారు.