Skip to main content

రాష్ట్ర అధ్యక్షులు శ్రీ PVN మాధవ్ గారు, రాష్ట్ర మహిళా మోర్చా అధ్యక్షులు శ్రీమతి నిషిధా రాజు గారి, జిల్లా అధ్యక్షులు శ్రీ పరశురామ రాజు గారు, ఆదేశాల మేరకు,


విశాఖపట్నం ఏప్రిల్ -19
 :మహిళా మోర్చా అధ్యక్షురాలు నాదెళ్ల జ్యోతి గారి ఆధ్వర్యంలో మహిళల హక్కులను పూర్తిగా తుంచివేసే విధంగా విఫలమైన మహిళా రిజర్వేషన్ బిల్లు వీగిపోవడంలో విపక్షాలు వ్యవహరించిన తీరును ఖండిస్తూ పత్రికా సమావేశం నిర్వహించడం అయినది.

మహిళల సాధికారతకు మూలస్తంభమైన ఈ బిల్లును కావాలనే అడ్డుకోవడం మహిళలపై జరిగిన అన్యాయం మాత్రమే కాకుండా, వారి ఆశలు, ఆకాంక్షలపై నేరుగా చేసిన దాడిగా మేము భావిస్తున్నాము. మహిళల అభివృద్ధిని అడ్డుకునే ఈ విధమైన రాజకీయ ధోరణిని ఎట్టి పరిస్థితుల్లోనూ సహించబోమని,

మహిళల హక్కులను దెబ్బ తీసే విధంగా పార్లమెంట్లో వ్యవహరించిన పార్టీల  నిర్ణయం పై  తీవ్రంగా మండిపడుతూ, రాబోయే రోజుల్లో మరింత బలమైన పోరాటాలకు సిద్ధమవుతున్నామని తెలియజేస్తున్నాము.


ఈ కార్యక్రమంలో రాష్ట్ర మహిళా మోర్చా ప్రధాన కార్యదర్శి రోహిణి గారు, రాష్ట్ర మహిళా మోర్చా ఉపాధ్యక్షురాలు లలిత గారు, జిల్లా మహిళా మోర్చా జనరల్ సెక్రటరీ స్పందన గారు పాల్గొని తమ గట్టి అభిప్రాయాలను వ్యక్తం చేశారు.

                  K.V.SHARMA  EDITOR 

Comments

Popular posts from this blog

ప్రాణాలను కాపాడే సేవలో ఉక్కు సంకల్పం – RINL , విశాఖ ఉక్కు కర్మాగారం మాజీ జనరల్ మేనేజర్(VRS) శ్రీ జేవీవీఎస్ శర్మ 39 వ సారి అరుదైన ఓ- నెగటివ్ రక్తదానం*

భగవాన్ శ్రీ సత్య సాయి బాబా వారి దివ్య కృపతో, RINL,   విశాఖ ఉక్కు కర్మాగారం లో  థర్మల్ పవర్ ప్లాంట్‌లో జనరల్ మేనేజర్ (ప్రాజెక్ట్స్)గా పనిచేసి వాలంటరీ రిటైర్మెంట్ (VRS) తీసుకున్న శ్రీ జేవీవీఎస్ శర్మ గారు మరోసారి తన సేవా భావాన్ని చాటుకున్నారు. మెడికవర్ హాస్పిటల్‌లో హృదయ శస్త్రచికిత్స పొందవలసిన ఒక వ్యక్తికి  అరుదైన O-నెగటివ్ రక్తాన్ని దానం చేసి ప్రాణరక్షణలో భాగస్వాములయ్యారు. శ్రీ శర్మ గారు సేవా స్పూర్తి, మానవతా విలువలకు ప్రతీకగా నిలుస్తున్నారు. వీఆర్‌ఎస్ అనంతరం కూడా అవసరమైన వారికి సహాయం చేస్తూ సమాజానికి ఆదర్శంగా నిలుస్తున్నారు. ఇది ఆయన చేసిన 39వ రక్తదానం కావడం విశేషం. ప్రతి మూడు నెలలకు ఒకసారి రక్తదానం చేస్తూ, ఇతరులకు కూడా స్ఫూర్తినిస్తున్నారు. శ్రీ సత్య సాయి సాయి కుటుంబ సభ్యులు మరియు విశాఖ ఉక్కు కర్మాగారం సహచరులు ఆయన ఈ మహత్తర సేవను అభినందిస్తూ, శ్రీ శర్మ గారు, వారి సతీమణి మరియు పిల్లలపై భగవాన్ ఆశీస్సులు ఎల్లప్పుడూ ఉండాలని ప్రార్థించారు. సమాజ సేవలో మరింత ముందుకు సాగేందుకు ఆయనకు ఆరోగ్యం, ఆనందం, ఐశ్వర్యం కలగాలని ఆకాంక్షించారు.