విశాఖ ఆర్.కె. బీచ్ నందు గల అంబేద్కర్ విగ్రహం నుండి,బిజెపి SC మోర్చా ఆధ్వర్యంలో నిర్వహించిన బాబాసాహెబ్ డా.బి ఆర్ అంబేడ్కర్ గారి 135వ జయంతి వారోత్సవాల్లో భాగంగా "3K సమరసత మారథాన్" ఏర్పాటు చేయడం జరిగినది.
విశాఖపట్నం ఏప్రిల్ -19 :ఈ సమరసత మారధాన్ లో పాల్గొన వారిలో విజేతలకు బిజెపి జిల్లా అధ్యక్షులు పరశురామ్ రాజుగారు, రాష్ట్ర ఎస్సీ మోత్చార్ అధ్యక్షులు,పానతల సురేష్ మరియు రాష్ట్ర కార్యదర్శి సురేంద్రమోహన్ చేతుల మీదుగా ప్రైజ్ మనీ తో పాటు సర్టిఫికెట్స్ అందజేయడం జరిగింది.
ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న పానతల సురేష్ మాట్లాడుతూ...
మన ఊపిరిలో సమరసత... మన పరుగులో జాతీయత" అనే నినాదంతో విశాఖలో నినాదాలతో "సమరసత మారథాన్" విశాఖవాసులు పాల్గొన్నారు అని,
"కులం, మతం అనే భేదాలు లేకుండా అందరం కలిసి ఐక్యత తో కలసి సాగాలని, ఇదే బాబాసాహెబ్ కి నిజమైన ఘన నివాళి అని అన్నారు.
ఈ కార్యక్రమం లో బిజెపి sc మోర్చా ప్రధాన కార్యదర్శి గణిరెడ్డి రాకేష్,sc మోర్చా జిల్లా అధ్యక్షులు M ప్రకాష్,kvnp చక్రవర్తి, రాష్ట్ర మరియు జిల్లా పదాధికారులు, వివిధ మోర్చా అధ్యక్షులు, నాయకులు మరియు కార్యకర్తలు పెద్ద సంఖ్యలో విద్యార్థులు మరియు స్థానికులు పాల్గొనడం జరిగింది.
K.V.SHARMA EDITOR


Comments
Post a Comment