అమెరికా దేశంలోని మయామిలో నిర్వహించబడుతున్న Seatrade Cruise Global 2026లో భారతదేశం గణనీయమైన ప్రాతినిధ్యాన్ని నమోదు చేసింది. ఈ కార్యక్రమంలో విశాఖపట్నం పోర్ట్ అథారిటీ చైర్మన్ డా. ఎం. అంగముత్తు, IAS భారతదేశాన్ని ప్రతినిధ్యం వహించారు.
క్రూయిజ్ భారత్ మిషన్ పరిధిలో విశాఖపట్నం అంతర్జాతీయ క్రూయిజ్ టెర్మినల్ను ప్రపంచానికి పరిచయం చేస్తూ, క్రూయిజ్ పర్యాటక రంగంలో భారత్ వేగంగా ఎదుగుతున్నదని ఆయన వివరించారు. అంతర్జాతీయ క్రూయిజ్ సంస్థలతో చర్చలు జరిపి, భారత పోర్టుల్లో క్రూయిజ్ కాల్స్ పెంపు మరియు కొత్త పర్యాటక మార్గాల అభివృద్ధిపై అవకాశాలను పరిశీలించారు.ఈ కార్యక్రమం ద్వారా భారతదేశానికి అంతర్జాతీయ క్రూయిజ్ రంగంలో మరింత గుర్తింపు లభించడంతో పాటు, భవిష్యత్తులో క్రూయిజ్ పర్యాటక వృద్ధికి దోహదం అవుతుందని ఆశాభావం వ్యక్తమైంది.
విశాఖ నుండి ప్రపంచానికి – భారత క్రూయిజ్ పర్యాటకానికి నూతన దిశ



Comments
Post a Comment