శ్రీ శ్రీ శ్రీ వరాహ లక్ష్మీ నరసింహ స్వామి వారి దేవస్థానం సింహాచలం. సింహాచలం దేవస్థాన నిత్య అన్నప్రసాద పథకానికి రూ. 1 లక్ష విరాళం
సింహాచలం: 19 మే 2026. :శ్రీ శ్రీ శ్రీ వరాహ లక్ష్మీ నరసింహ స్వామి వారి దేవస్థాన నిత్య అన్నప్రసాద పథకానికి ఒక లక్ష రూపాయల విరాళం అందింది. దాత విశాఖపట్నం పెందుర్తి కి చెందిన నరసింపల్లి ప్రసాదరావు శ్రీ మతి నాగమణి, కుటుంబ సభ్యులు , ప్రవల్లిక, నీహారిక ఈవిరాళం చెక్కు రూపంలో దేవస్థానం పర్యవేక్షణ అధికారి ఏ. త్రిమూర్తులు కి అందజేశారు. ఈ సందర్భంగా దాతల కుటుంబానికి స్వామివారి దర్శన భాగ్యాన్ని కల్పించారు. దర్శనానంతరం ఆలయ అధికారులు వారికి స్వామివారి శేష వస్త్రంతో సత్కరించి, లడ్డూ ప్రసాదాలను అందజేశారు. స్వామివారి అన్నదాన మహత్కార్యానికి స్వచ్ఛందంగా ముందుకు వచ్చి విరాళం అందించిన దాతల ఉదారతను దేవస్థానం అధికారులు అభినందించారు.
K.V.SHARMA EDITOR

Comments
Post a Comment