Skip to main content

ఒక చాగంటి

 చాగంటి 

ఒక గరికపాటి 

ఒక సామవేదం 

ఒక చిన జియర్ స్వామి 

ఒక వడ్డిపర్తి పద్మా కర్ 

బ్రాహ్మణ్ అన్నా 

 బ్రాహ్మణత్వం అన్నా 

అందరికీ గుర్తుకు 

వచ్చేది పైన నేను 

పేర్కొన్న ఐదుగురే 

ముందు వరుస లో 

ఉంటారు. వారిని సద్ 

బ్రాహ్మణులు 

అనవచ్చు.

బ్రాహ్మనేతరులకు 

కూడా వారంటే 

ఇష్టమే.

వారిలో కాన 

వచ్చేది వేరెవ్వరిలో 

ఆగపించదు.

అదే భక్తి భావం,

సేవా భావం,

పరోపకారం,

నిబద్దత,

నిజాయితీ,

ధర్నాచరణ,

సమాజ స్పృహ 

ఇత్యాదివి.

వారి నోటినుంచి 

విలువడే ప్రతీ 

మాటలో అర్ధం,

పరమార్ధం 

ఇమిడి ఉంటాయి.

ఒక టీ దుకాణ

దారుడు దగ్గర 

నుంచి కారు,

ఆటో డ్రైవర్,

కూలి నాలి 

చేసుకుని 

జీవించే వారి 

వరకూ శ్రీ 

చాగంటి వారి 

ప్రవచనం తో 

తెల్లారుతుంది.

అలా నేటి 

సామాన్యుడు 

ఆకర్షి తుడవుతున్నాడు 

అనడం అతిశయోక్తి 

కాదు. వారి మాట

 తీరు అలాంటిది.

సమాజ హితులు,

దైవాంశ సంభూ తులు,

ఇంకా చెప్పాలంటే 

దేవ దూతలు.

మన పాలకులు 

కన్నా వీరి మాటలు 

మిన్న అని అనిపించక 

మానదు, ఎవరికన.

దినపత్రిక చూద్దాము 

అన్నా News ఛానల్ 

చూద్దాం అన్నా 

పాలక పక్షం పై 

ప్రతి పక్షం, 

ప్రతి పక్షం పై 

పాలక పక్షం 

విమర్శలు,

ప్రతి విమర్శలు 

తప్ప పాలనా 

అంశాలు ఎవరి లో 

కానరావు.

పెట్రోల్, డీజిల్ 

ధరలు ఒక్కసారే 

లీటరుకి  ఏడెనిమిది 

రూపాయలు 

పెరగడం తో 

వాటి ప్రభావం 

నిత్య అవసరాల 

మీద పడింది.

I.T. Coms లో 

ఉపాధి అవకాశాలు 

తగ్గు ముఖం 

పట్టాయి,

జనాలలో 

కొనుగోలు శక్తి 

క్రమంగా తగ్గుతూ 

సొంత ఇంటి 

కల నెరవేరక 

కొందరు, EMI 

కట్ట లేక మరికొందరు 

ఆర్ధిక సంక్షోభం 

లో కొట్టుమిట్టాడు 

తున్నారు.

అమ్మకాలు,

కొనుగోళ్లు 

జరగక రియల్ 

ESTATE వ్యాపారస్థులు,

BANKERS 

లబో, దిబో 

మంటున్నారు.

మరో ప్రక్క 

ట్రంప్ అమెరికా 

వీసాలపై ఆంక్షలు, 

యుద్ధ వాతావరణం 

చల్లారే టట్లు లేదు.

LPG గ్యాస్ 

అందుబాటులో 

లేక కొరత కారణం 

గా అన్ని తిను 

బండారాల ధరలు 

ఆకాశాన్ని అంటి 

ఎవరికీ చెప్పు 

కోలేని పరిస్థితి 

నేటి సామాన్యుడి 

స్థితి అని చెప్పొచ్చు.

మన 'నమో' గారేమో 

బంగారం 

కొనద్దు అంటారు 

మొదటి డానికి 

మొగుడు లేడు,

కడ దానికి కళ్యాణం 

అన్నట్టు ఉంది వారి 

తీరు. అసలు నిత్య 

అవసరాలు 

సామాన్యుడు

 కొనుగోలు శక్తి 

కోల్పోయి సతమత 

మవుతున్న తరుణం లో 

బంగారం కొనొద్దు

 అనడం లో 

అంతరార్ధం ఏమిటో 

అర్ధం కావడం లేదు.

నేటి మన పాలకులు 

యుద్ధం బూచి పేరు 

చెప్పి సామాన్యుడి తో 

దోబూచు లాడు 

కుంటున్నారు అన్నది జగద్విదితం.

ఎవరి ఎత్తు 

గడలు వారివి.

ఎవరి వ్యాపార

ధోరణి వారిది,

నడుమ సామాన్యుని 

గోడు ఎవరికి 

పట్టదు.

ఇదే మన 

ప్రజాస్వామ్యం 

ఇదే మన స్వతంత్ర 

భారత దేశం..


                  

                   


                     Dr. నండూరి రామకృష్ణ

                            Sr Sub EDITOR 

                            25.05.2026

Comments