Skip to main content

భారతీయ జనతా పార్టీ జనతా వారధి ఉత్తరాంధ్ర కార్యాలయంలో వినతులు స్వీకరించిన లంక దినకర్*


ఈరోజు 29-05-2026 శుక్రవారం
భారతీయ జనతా పార్టీ కార్యాలయంలో రాష్ట్ర వ్యాప్తంగా బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు శ్రీ పివిఎన్ మాధవ్ గారి సారధ్యంలో జరుగుతున్న జనతా వారధి ప్రజలకు ప్రభుత్వానికి వారధి కార్యక్రమం లో భాగంగా బీజేపీ విశాఖపట్నం జిల్లా అధ్యక్షులు శ్రీ MMN పరశు రామ రాజు గారి ఆధ్వర్యంలో రాష్ట్ర 20 సూత్రాల కమిటీ చైర్మన్ శ్రీ లంక దినకర్ గారు జనతా వారధి ఉత్తరాంధ్ర కార్యాలయంలో ప్రజల నుండి వినతులు స్వీకరించారు.


ఈ సందర్భంగా లంక దినకర్ గారు మాట్లాడుతూ ప్రజలకు ఎంతో కాలంగా పరిష్కారం కాని సమస్యలను అర్జీలను స్వీకరించి ఈ జనతా వారధి కార్యక్రమం ద్వారా ప్రభుత్వ అధికారుల దృష్టికి తీసుకొని వెళ్లి పరిష్కరించే దిశగా కృషి చేస్తామని తెలిపారు. ఈ జనతా వారధి కార్యాలయంలో ప్రతి శుక్రవారం ఒక MLA అందుబాటులో ఉంటూ ప్రజల నుండి అర్జీలను స్వీకరించడం జరుగుతుందని, ఈ అవకాశాన్ని ఉత్తరాంధ్ర ప్రజలు వినియోగించుకోవాలని కోరారు.


ఈ కార్యక్రమంలో జనతా వారధి కన్వీనర్ పొలిమేర శ్రీనివాసరావు, జనతా వారధి కో కన్వీనర్ మూలా వెంకటరావు, బీజేపీ ఏలూరు జిల్లా ఇంచార్జి బొండాడ నరేంద్ర ప్రకాష్, బీజేపీ రాష్ట్ర మీడియా ప్యానలిస్ట్ కరణంరెడ్డి నరసింగరావు, తో పాటు పలువురు నాయకులు, కార్యకర్తలు పాల్గొనడం జరిగింది

            D.S Varma  Sr Sub EDITOR 

Comments