Skip to main content

బిర్సా ముండా గారి 126వ వర్ధంతి సందర్భంగా, ST మోర్చా ఆధ్వర్యంలో బిజెపి జిల్లా కార్యాలయంలో నివాళులర్పించే కార్యక్రమం నిర్వహించాము.

 ​


ఈ కార్యక్రమంలో జిల్లా అధ్యక్షులు పరశురామరాజు గారు బిర్సా ముండా గారి చిత్రపటానికి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా దేశ స్వాతంత్ర్యం కోసం, గిరిజనుల హక్కుల కోసం ఆయన చేసిన పోరాటాలను, అమూల్యమైన సేవలను స్మరించుకున్నారు.

​ఈ కార్యక్రమంలో రాష్ట్ర ఎస్టి మోర్చా జనరల్ సెక్రటరీ మురళి మోహన్ రాజు,రాష్ట్ర అధికార ప్రతినిధి సుహాసిని ఆనంద్, జిల్లా ప్రధాన కార్యదర్శి దానేశ్వరరావు, జిల్లా మీడియా కన్వీనర్ టి కోటేశ్వరరావు మరియు వివిధ మోర్చా అధ్యక్షులు  మరియు జిల్లా పదాధికారులు, ముఖ్య నాయకులు మరియు కార్యకర్తలు పాల్గొన్నారు.


Comments