Skip to main content

శ్రీ శ్రీ శ్రీ వరాహ లక్ష్మీ నరసింహ స్వామి వారి దేవస్థానం సింహాచలం. ​సింహాచలం శ్రీ వరాహ లక్ష్మీ నరసింహ స్వామి వారిని దర్శించుకున్న ఢిల్లీ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ నవీన్ చావ్లా.

.                  K.V.SHARMA EDITOR 
 సింహాచలం, జూన్ 26, 2026: ఢిల్లీ హైకోర్టు గౌరవనీయులైన న్యాయమూర్తి శ్రీ జస్టిస్ నవీన్ చావ్లా  ఈరోజు సింహాచలంలోని శ్రీ వరాహ లక్ష్మీ నరసింహ స్వామి వారిని దర్శించుకున్నారు.

​ఆలయ కార్యనిర్వహణాధికారి శ్రీ జల్లేపల్లి వెంకట్రావు ఆదేశాల మేరకు, సహాయ కార్య నిర్వహణాధికారి శ్రీ కె. తిరుమలేశ్వరావు మరియు ఆలయ ప్రధాన అర్చకులు శ్రీ సీతారామాచార్యులు వారికి ఆలయ మర్యాదలతో  స్వాగతం పలికారు. 


ముందుగా న్యాయమూర్తి  ఆలయంలోని అత్యంత మహిమాన్వితమైన 'కప్పస్తంభాన్ని' ఆలింగనం చేసుకున్నారు. అనంతరం శ్రీ వరాహ లక్ష్మీ నరసింహ స్వామి వారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. దర్శనానంతరం వేద పండితులు వారికి వేదాశీర్వచనం అందించారు. ఈ సందర్భంగా ఆలయ అధికారులు న్యాయమూర్తి ని శేషవస్త్రంతో సత్కరించి, స్వామివారి ప్రసాదాలను, జ్ఞాపికగా స్వామివారి చిత్రపటాన్ని అందజేశారు

Comments