సెయింట్ జోసెఫ్ మహిళా కళాశాల కామర్స్, మేనేజ్మెంట్ విభాగాల ఆధ్వర్యంలో స్మార్ట్ గవర్నెన్స్ అండ్ సిస్టమ్స్: డ్రైవింగ్ ది ఫ్యూచర్ ఆఫ్ కామర్స్, మేనేజ్మెంట్ అండ్ టాక్సేషన్” అనే అంశంపై జాతీయ సదస్సు
కె.వి.శర్మ ఎడిటర్
విశాఖపట్నం -విశాఖ సందేశం వార్తలు -విశాఖపట్నంలోని సెయింట్ జోసెఫ్ మహిళా కళాశాల కామర్స్, మేనేజ్మెంట్ విభాగాల ఆధ్వర్యంలో జూలై 20, 21 తేదీలలో రెండు రోజుల జాతీయ సదస్సు నిర్వహిస్తున్నట్లు కళాశాల ప్రిన్సిపాల్ డా. సిస్టర్ షైజీ పి.డి. తెలిపారు.
ఈ సందర్భంగా డా. సిస్టర్ షైజీ పి.డి. సదస్సు బ్రోచర్ను ఆవిష్కరించి విడుదల చేశారు. అనంతరం కామర్స్, మేనేజ్మెంట్ విభాగాల అధ్యాపకులకు విద్యార్థినులకు బ్రోచర్లను అందజేశారు.
ఈ సదస్సుకు కళాశాల వాణిజ్య & నిర్వహణ విభాగాధిపతి డా. కె. రజని కన్వీనర్గా వ్యవహరిస్తున్నారు.
సదస్సులో ప్రొఫెసర్ వి. బాలమోహన్ దాస్, ప్రొఫెసర్ ఎస్. రజని, శ్రీమతి కె.వి. ఉమాదేవి, శ్రీ సురేష్ దాసరి, డా. ఎస్. అపర్ణ పావని, శ్రీమతి రహీమున్నిసా బేగం ముఖ్య వక్తలుగా పాల్గొంటారు. కృత్రిమ మేధస్సు ఆధారిత నిర్ణయ వ్యవస్థలు, డిజిటల్ పరివర్తన, ఈ-గవర్నెన్స్, ప్రపంచ వాణిజ్యం, ఏఐ ఆధారిత పన్ను ఆడిటింగ్ తదితర సమకాలీన అంశాలపై విస్తృతంగా చర్చలు జరగనున్నాయని
కళాశాల పీఆర్వో డా. పి.కె. జయలక్ష్మి ఒక ప్రకటనలో తెలిపారు. విశాఖపట్నంలోని సెయింట్ జోసెఫ్ మహిళా కళాశాల కామర్స్, మేనేజ్మెంట్ విభాగాల ఆధ్వర్యంలో జూలై 20, 21 తేదీలలో రెండు రోజుల జాతీయ సదస్సు నిర్వహిస్తున్నట్లు కళాశాల ప్రిన్సిపాల్ డా. సిస్టర్ షైజీ పి.డి. తెలిపారు.
ఈ సందర్భంగా డా. సిస్టర్ షైజీ పి.డి. సదస్సు బ్రోచర్ను ఆవిష్కరించి విడుదల చేశారు. అనంతరం కామర్స్, మేనేజ్మెంట్ విభాగాల అధ్యాపకులకు విద్యార్థినులకు బ్రోచర్లను అందజేశారు.
ఈ సదస్సుకు కళాశాల వాణిజ్య & నిర్వహణ విభాగాధిపతి డా. కె. రజని కన్వీనర్గా వ్యవహరిస్తున్నారు.
సదస్సులో ప్రొఫెసర్ వి. బాలమోహన్ దాస్, ప్రొఫెసర్ ఎస్. రజని, శ్రీమతి కె.వి. ఉమాదేవి, శ్రీ సురేష్ దాసరి, డా. ఎస్. అపర్ణ పావని, శ్రీమతి రహీమున్నిసా బేగం ముఖ్య వక్తలుగా పాల్గొంటారు. కృత్రిమ మేధస్సు ఆధారిత నిర్ణయ వ్యవస్థలు, డిజిటల్ పరివర్తన, ఈ-గవర్నెన్స్, ప్రపంచ వాణిజ్యం, ఏఐ ఆధారిత పన్ను ఆడిటింగ్ తదితర సమకాలీన అంశాలపై విస్తృతంగా చర్చలు జరగనున్నాయని
కళాశాల పీఆర్వో డా. పి.కె. జయలక్ష్మి ఒక ప్రకటనలో తెలిపారు.


Comments
Post a Comment