విశాఖపట్నం :విశాఖ సందేశం: రాష్ట్ర పార్టీ ఆదేశాల మేరకు ప్రతినెల నాలుగవ బుధవారం పార్లమెంట్ కమిటీ సమావేశం నిర్వహించాలని తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు గౌరవ ముఖ్యమంత్రివర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు తెలుగుదేశం పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ శ్రీ నారా లోకేష్ బాబు గారి ఆదేశాల మేరకు
ఈరోజు సాయంత్రం జిల్లా తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో విశాఖపట్నం పార్లమెంటరీ నియోజకవర్గ కార్యవర్గ సమావేశం జిల్లా అధ్యక్షులు చోడే వెంకట పట్టాభిరామ్ అధ్యక్షతన నిర్వహించడం జరిగినది. ఈ కార్యక్రమంలో విశాఖ తూర్పు నియోజకవర్గ శాసనసభ్యులు వెలగపూడి రామకృష్ణబాబు విశాఖ దక్షిణ నియోజకవర్గ ఇన్చార్జ్ సీతమ్మరాజు సుధాకర్ పాల్గొన్నారు.
ఈ సమావేశంలో ముఖ్య ఉద్దేశం దేశవ్యాప్తంగా నిర్వహిస్తున్న సమగ్ర ఓటర్ సర్వే ప్రతి నియోజకవర్గంలో ప్రతి బూత్ స్థాయిలో కార్యకర్తలు అందరూ పాల్గొనాలని తీర్మానించారు.
జిల్లా అధ్యక్షుడు పట్టాభిరామ్ మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ సర్ కార్యక్రమంలో పాల్గొనాలని ఏ ఒక్క ఓటు అనవసరంగా పోకూడదని కోరారు అదేవిధంగా ఎన్డీఏ కూటమి 2 ఏళ్ల పాలనలో చేసిన సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు అన్ని ప్రజల్లోకి తీసుకెళ్లాల్సిన బాధ్యత మనపై ఉందని కోరారు
ఎమ్మెల్యే వెలగపూడి రామకృష్ణ బాబు మాట్లాడుతూ 2002 వాటర్ జాబితా ప్రకారం నేడు సర్ కార్యక్రమం నిర్వహిస్తున్నారని ఇంటింటికి బిఎల్ఓ తో పాటు పార్టీ నుంచి బిఎల్ఎ కూడా వస్తున్నారని వాళ్ళకి ప్రతి ఒక్కరూ సహకరించాలని కోరారు
ఈ కార్యక్రమంలో పార్లమెంట్ ప్రధాన కార్యదర్శి లోడగల కృష్ణ, విశాఖ దక్షిణ అసెంబ్లీ ఇంచార్జ్ ఎన్టీఆర్ వైద్య సేవ చైర్మన్ సీతమరాజు సుధాకర్, బైరెడ్డి పోతన రెడ్డి,ఉపాధ్యక్షులు గోరపల్లి రాము, పొలిమేర సీతారాం, బమ్మిడి ఉమా, బొట్ట వెంకటరమణ, కోట నరేష్, అబ్దుల్ అనీఫ్, అల్తే హేమలత, గరికిన ఎల్లయ్య, అధికార ప్రతినిధులు విల్లూరు భాస్కరరావు, చెట్టుపల్లి గోపి,బుస రాంబాబు, పిడుగు మంగలక్ష్మి,
తోట శ్రీదేవి, గుని శెట్టి నాగేశ్వరరావు, కార్యనిర్వహ కార్యదర్శి నక్క చిన్న రాము, గనగల్ల సత్య,దాసరి శివ శంకర్,కని శెట్టి సత్యమ్మ, చుక్క జోగారావు, ఉసిరికాయల డిల్లీశ్వరి,తాడి వేణు కుమారి, బోర అప్పల సూరిబాబు, ఏడుకొండలు, తదితరులు పాల్గొన్నారు

Comments
Post a Comment